...
...
Next Story

ఓటీటీ రేట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఆధారపడటం అన్యాయం- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ధరపై మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ వరుణ్ గుప్తా

పాండమిక్ తర్వాత సినిమా బడ్జెట్లు, బాక్సాఫీస్ లెక్కలపై సామాన్యులకు కూడా అవగాహన పెరిగింది. అయితే, స్టార్ హీరోల సినిమాలకు ఉన్న బడ్జెట్, చిన్న సినిమాలకు ప్రమోషన్ల కోసం ఉండకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ ‘విష వలయం’ గురించి ప్రముఖ మార్కెటింగ్ నిపుణుడు వరుణ్ గుప్తా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Published on: Feb 9, 2026, 10:16:37 IST
Advertisement

కరోనా మహమ్మారి తర్వాత సినిమా ప్రపంచం తీరు మారిపోయింది. గతంలో కేవలం ఇండస్ట్రీ వర్గాలకే పరిమితమైన బడ్జెట్లు, ఓవర్‌ హెడ్ ఖర్చులు, రికవరీ వంటి పదాలు ఇప్పుడు ట్విట్టర్, రెడ్డిట్ పుణ్యమా అని సామాన్య ప్రేక్షకుడికి కూడా తెలిసిపోతున్నాయి.

ఓటీటీ రేట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఆధారపడటం అన్యాయం- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ధరపై మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ వరుణ్ గుప్తా
ఓటీటీ రేట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఆధారపడటం అన్యాయం- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ధరపై మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ వరుణ్ గుప్తా

అయితే, టాలెంట్ ఉండి కంటెంట్ ఉన్నా చిన్న సినిమాలు ఎందుకు వెనుకబడిపోతున్నాయి? కేవలం మార్కెటింగ్ బడ్జెట్ లేకపోవడమే దానికి కారణమా? ఈ అంశంపై ‘బాహుబలి’, ‘హనుమాన్’, ‘ధురంధర్’ వంటి భారీ చిత్రాలకు మార్కెటింగ్ చేసిన మాక్స్ మార్కెటింగ్ అధినేత వరుణ్ గుప్తా తన లోతైన విశ్లేషణను హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

స్టార్లకు ప్రమోషన్స్ అవసరమా?

వరుణ్ గుప్తా మాటల్లో ఒక విచిత్రమైన నిజం వినిపించింది. "పెద్ద సినిమాలకు భారీ మార్కెటింగ్ బడ్జెట్లు ఉంటాయి. కానీ, ఢిల్లీ, ముంబై లేదా కోట వంటి నగరాలకు షారుక్ ఖాన్ వచ్చి తన సినిమా చూడమని చెప్పాల్సిన అవసరం ఉందా? నిజానికి లేదు. ‘కింగ్’ వంటి సినిమాలు ఆయన ప్రమోషన్స్ చేయకపోయినా జనం చూస్తారు" అని వరుణ్ గుప్తా పేర్కొన్నారు.

అంటే, ఎవరికైతే ప్రమోషన్స్ అవసరం లేదో వారి దగ్గర కోట్లు ఉన్నాయి, ఎవరికైతే జనం గుర్తుపట్టడానికి మార్కెటింగ్ అవసరమో వారి దగ్గర చిల్లిగవ్వ లేకపోవడం ఇండస్ట్రీలోని పెద్ద వైరుధ్యం అని ఆయన మాటల్లో తెలుస్తోంది.

అది అన్యాయం

సినిమా థియేటర్లలో ఎంత వసూలు చేస్తే, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అంత ఎక్కువ రేటు ఇస్తాయనేది ఇప్పుడున్న పద్ధతి. దీనిపై వరుణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

రెండో శ్రేణి నగరాల (Tier-2) ప్రేక్షకులు కేవలం కమర్షియల్ సినిమాలే చూస్తారు, కంటెంట్ సినిమాలను ఆదరించరు అనే వాదనను వరుణ్ కొట్టిపారేశారు. "ప్రజలు కంటెంట్ సినిమాలను చూడటం లేదంటే.. మరి ‘12th ఫెయిల్’, ‘ముంజ్య’ లేదా ‘హనుమాన్’ వంటి సినిమాలు ఎలా హిట్టయ్యాయి? ప్రేక్షకులకు మంచి సినిమా చూడాలని ఉంది. కానీ అది ఒక ‘మంచి సినిమా’ అని వారికి చెప్పడానికి ప్రమోషన్ బడ్జెట్ సరిపోవడం లేదు" అని వరుణ్ పేర్కొన్నారు.

పరిష్కారం ఏంటి?

ఈ సమస్యను అధిగమించాలంటే గతంలో ఉన్న ‘UTV’ వంటి ప్రొడక్షన్ హౌస్‌లు మళ్లీ రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకే ఏడాదిలో ‘జోధా అక్బర్’ వంటి భారీ చిత్రంతో పాటు ‘ఏ వెడ్నెస్ డే’, ‘ఖోస్లా కా ఘోస్లా’ వంటి చిన్న చిత్రాలను కూడా వారు సమానంగా ప్రోత్సహించేవారు.

"పెద్ద నిర్మాతలు భారీ చిత్రాల ద్వారా మిగిలే లాభాలను చిన్న సినిమాల మార్కెటింగ్ కోసం కేటాయించాలి. అప్పుడే ఈ విషవలయం నుంచి చిన్న సినిమాలు బయటపడతాయి" అని వరుణ్ గుప్తా సూచించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe