...
...
Next Story

Mugguru Kothulu: తెలుగులో నయా కామెడీ సినిమా ముగ్గురు కోతులు- ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్- గాంధీజీ 3 సూత్రాలతో!

Mugguru Kothulu First Look Released: తెలుగులో వస్తున్న నయా కామెడీ సినిమా ముగ్గురు కోతులు. ఈ సినిమాకు కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహించగా.. శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్నారు. తాజాగా ముగ్గురు కోతులు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

Published on: Aug 22, 2026, 10:20:43 IST
Advertisement

Mugguru Kothulu First Look Released: టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ కథాంశాలకు, యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే బాటలో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించేందుకు ఒక ఆసక్తికరమైన తెలుగు చిత్రం రూపుదిద్దుకుంటోంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఆ సినిమా పేరు ‘ముగ్గురు కోతులు’.

ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగులో నయా కామెడీ సినిమా ముగ్గురు కోతులు- ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్- గాంధీజీ 3 సూత్రాలతో!
తెలుగులో నయా కామెడీ సినిమా ముగ్గురు కోతులు- ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్- గాంధీజీ 3 సూత్రాలతో!

తాజాగా ముగ్గురు కోతులు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం (ఆగస్ట్ 21) ఘనంగా ఆవిష్కరించారు. ఈ ముగ్గురు కోతులు చిత్రంలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కథానాయకులుగా నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా అలరించనున్నారు. ఈ సినిమాను శోభారాణి గరిమెల్ల నిర్మిస్తుండగా, కార్తీక్ గరిమెల్ల దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పోస్టర్‌తోనే పెరిగిన క్యూరియాసిటీ!

ముగ్గురు కోతులు సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే పోస్టర్‌ను కూడా ఎంతో వెరైటీగా డిజైన్ చేశారు. ఇందులో ముగ్గురు హీరోలు వేర్వేరు హాస్యభరిత హావభావాలు (ఎక్స్‌ప్రెషన్స్) చిందిస్తూ కనిపించడం విశేషం. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే గాంధీజీ మూడు కోతుల సూత్రాన్ని నేటి యూత్ ఎలా తమకు నచ్చినట్లు మలచుకున్నారనే కాన్సెప్ట్‌తో ఈ కథ సాగనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

పెంచేసిన అంచనాలు

ముగ్గురు కోతులు సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచిన చిత్రబృందం, త్వరలోనే పాటలు, టీజర్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటిగా వెల్లడిస్తామని పేర్కొంది.

నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు

నటీనటులు: తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు

సమర్పణ: జీఎస్ఆర్ క్రియేషన్స్, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్

నిర్మాత: శోభారాణి గరిమెల్ల

దర్శకత్వం: కార్తీక్ గరిమెల్ల

సంగీతం: ఎస్. సుహాస్

సినిమాటోగ్రఫీ: రాజ్ నోముల

ఎడిటింగ్: జమీర్ షేక్

పీఆర్వో: సాయి సతీష్

ముగ్గురు హీరోల సినిమా

సమకాలీన కామెడీ, యూత్ మెచ్చే ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ ముగ్గురు కోతులు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేర సందడి చేస్తుందో చూడాలి. ఇలా ముగ్గురు హీరోలతో తాజాగా థియేటర్లలోకి అమీర్ లోగ్ వచ్చి పర్వాలేదనిపిస్తోంది. మరి ఈ ముగ్గురు హీరోల ముగ్గురు కోతులు సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'ముగ్గురు కోతులు' సినిమా దర్శకుడు ఎవరు?

ఈ చిత్రానికి కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్నారు.

2. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?

తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కథానాయకులుగా నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు.

3. 'ముగ్గురు కోతులు' సినిమా ఏ జోనర్‌లో రాబోతోంది?

ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా, యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe