నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 18 ఎపిసోడ్ లో.. నిన్న గాక మొన్న వచ్చిన మాయ కూడా నా తప్పులను ఎత్తిచూపుతోంది. బయట వాళ్ల మాటలను కూడా పడాలా? పాత గాయాలను రేపుతుంటే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నాలో నేను బాధపడుతున్నానని అందరి ముందు శాలిని ఎమోషనల్ డ్రామా ఆడుతుంది.
ట్రాఫిక్ పోలీసులు

గెస్ట్ లా వచ్చినదానివి గెస్ట్ లా ఉండక ఇవన్నీ నీకు ఎందుకు? నీ హద్దుల్లో నువ్వుంటే బాగుంటుందని మాయకు శ్యామల వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు శ్రుతిని కామాక్షి తిడుతుంది. అప్పుడే ట్రాఫిక్ పోలీసులు వస్తారు. కారును నడిరోడ్డు మీద వదిలేసి వెళ్తున్నారా? కారుతో పాటు మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తానని ట్రాఫిక్ పోలీసులు అంటారు.
రఘురాం ఎమోషనల్
కారు తోస్తే రూ.2 వేలు ఇస్తామని శ్రుతి చెప్తుంది. ఓ నలుగురు తోసేందుకు ముందుకు వస్తారు. కారును తోసుకుంటూ వెళ్లిపోతారు. మరోవైపు జగదీశ్వర వేలికి రఘురాం కట్టు కడతాడు. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను జగదీశ్వరి అని రఘురాం అంటాడు.
చంద్ర వార్నింగ్
శాలిని విషయం గురించి ఇంట్లో ఎవరితో డిస్కస్ చేయొద్దని చెప్పా కదా. మరి డైరెక్ట్ గా శాలినినే ఎందుకు అడిగావ్? దీన్ని పైత్యం అంటారా? అని మాయపై చంద్రకళ సీరియస్ అవుతుంది. ఆ శాలిని చేసింది తెలిశాక అడగకుండా ఉండలేకపోయానని మాయ చెప్తుంది. శాలిని ఫ్రెండ్లీగా తీసుకుంటుందనుకున్నా కానీ ఫీల్ అయిందని మాయ అంటుంది.
కామాక్షి చెప్పిందని
వద్దని ఎంత చెప్పినా వెళ్లి అడిగావు. క్రాంతి, శాలిని మధ్య గొడవలకు కారణం నేను చెప్పలేదు కదా. మరి అవన్నీ నీకు ఎలా తెలుసు? అని చంద్ర అడుగుతుంది. కామాక్షి పిన్ని చెప్పిందని మాయ చెప్తుంది. ఇంత సీన్ క్రియేట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. రియల్లీ సారీ అక్క, ఇంకెప్పుడూ ఇలా చేయనని మాయ అంటుంది.
రాజ్ షాక్
{{/usCountry}}వద్దని ఎంత చెప్పినా వెళ్లి అడిగావు. క్రాంతి, శాలిని మధ్య గొడవలకు కారణం నేను చెప్పలేదు కదా. మరి అవన్నీ నీకు ఎలా తెలుసు? అని చంద్ర అడుగుతుంది. కామాక్షి పిన్ని చెప్పిందని మాయ చెప్తుంది. ఇంత సీన్ క్రియేట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. రియల్లీ సారీ అక్క, ఇంకెప్పుడూ ఇలా చేయనని మాయ అంటుంది.
రాజ్ షాక్
{{/usCountry}}కామాక్షి కారు తోసుకుంటూ రావడం చూసి సరోజ హ్యాపీగా ఫీల్ అవుతుంది. డ్రైవర్ వచ్చి చెప్పేలోపు నువ్వు కారు తీసుకుని వెళ్లావని శ్రుతితో రాజ్ అంటాడు. కారు తోసినందుకు ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇవ్వమంటే సరోజ, రాజ్ షాక్ అవుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్ డబ్బులు ఇస్తాడు.
శాలిని డ్రామా
క్రాంతి దగ్గరకు శాలిని వెళ్తుంది. ఇంకా ఎన్ని రోజులు శిక్ష వేస్తావ్? పశ్చాత్తాపం ఎందుకు కనిపించడం లేదు. నన్ను ఎప్పుడు క్షమిస్తావ్? క్షమించాలంటే ఏం చేయాలి? నెల రోజులు నాతో నార్మల్ గా ఉండి చూడు. మార్పు రాలేదనిపిస్తే ఏ శిక్ష వేసిన భరిస్తానని శాలిని అడుగుతుంది.
మాయ సారీ
నీకు ఛాన్స్ ఇవ్వాలని నాకు లేదని క్రాంతి అంటాడు. అప్పుడే మాయను తీసుకొచ్చి శాలినికి చంద్ర సారీ చెప్పిస్తుంది. శాలిని నాకు చెల్లితో సమానం. ఆమెను ఇబ్బందిపెట్టడం సరికాదు. మాయ మరోసారి ఈ తప్పు చేయకు అని చంద్ర అంటుంది.
అత్తయ్య, మామయ్య కోసం శాలినిని క్షమించమని క్రాంతికి చంద్ర చెప్తుంది. అందుకు క్రాంతి ఒప్పుకోడు. ఇంట్లో జరిగిన విషయాన్ని తల్లి సునందకు కాల్ చేసి శాలిని చెప్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.