Payal Rohatgi On OTT Reality Shows: నాచ్ బలియే, బిగ్ బాస్, లాక్ అప్ వంటి పాపులర్ ఓటీటీ రియాలిటీ షోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి, వ్యాపారవేత్త పాయల్ రోహత్గీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ముక్కుసూటితనంతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే పాయల్, తాజాగా ఓటీటీ రియాలిటీ షోల వెనుక జరిగే అసలు గుట్టును రట్టు చేశారు.
రియాలిటీ షోల క్రేజ్

నెట్ఫ్లిక్స్లో విజయవంతంగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న 'లాక్ అప్ సీజన్ 2' నేపథ్యంలో పాయల్ రోహత్గీ ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ నిజంగానే జరుగుతాయా లేక వెనుక ఏమైనా స్క్రిప్ట్ నడుస్తుందా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటాయి.
ఏక్తా కపూర్ షోలలో అన్నీ దొంగ ప్రేమకథలే!
సరిగ్గా ఇదే విషయంపై పాయల్ రోహత్గీ స్పందిస్తూ, మేకర్స్ టీఆర్పీ రేటింగుల కోసం రియాలిటీ షోలను కాస్తా డ్రామా సీరియల్స్లా మార్చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తాను పాల్గొన్న 'నాచ్ బలియే' షో అనుభవాలను గుర్తుచేసుకుంటూ బాలీవుడ్ టాప్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్పై పాయల్ సంచలన ఆరోపణలు చేశారు.
"రియాలిటీ షోల మేకర్స్ ఎవరైనా సరే, వాటిని దయచేసి టీవీ సీరియల్స్లా మార్చకండి. గతంలో నేను ఏక్తా కపూర్తో కలిసి నాచ్ బలియే షో చేసినప్పుడు, ఆమె దాన్ని ఒక డైలీ సోప్లా మార్చడానికి ప్రయత్నించారు. తమకు అలాంటి కాన్సెప్ట్ కావాలని ఓపెన్ గానే చెప్పారు" అని పాయల్ రోహత్గీ వెల్లడించారు.
మృణాల్ ఠాకూర్ది ఫేక్ లవ్ స్టోరీనే
ఆ షోలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఆమె పార్ట్నర్ (రచయిత) మధ్య రేటింగుల కోసం కావాలనే ఒక అబద్ధపు ప్రేమకథను స్టేజ్పై సృష్టించారని పాయల్ బాంబు పేల్చారు. ఏక్తా కపూర్కు రియాలిటీ షోలను సీరియల్స్లా మార్చే అలవాటు ఉందని, దీనివల్ల ఆ షోలలోని సహజత్వం పూర్తిగా దెబ్బతింటుందని విమర్శించారు.
{{/usCountry}}ఆ షోలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఆమె పార్ట్నర్ (రచయిత) మధ్య రేటింగుల కోసం కావాలనే ఒక అబద్ధపు ప్రేమకథను స్టేజ్పై సృష్టించారని పాయల్ బాంబు పేల్చారు. ఏక్తా కపూర్కు రియాలిటీ షోలను సీరియల్స్లా మార్చే అలవాటు ఉందని, దీనివల్ల ఆ షోలలోని సహజత్వం పూర్తిగా దెబ్బతింటుందని విమర్శించారు.
{{/usCountry}}ఇలా డ్రామాగా మార్చితే ఎప్పటికీ బిగ్ బాస్ లాంటి సుదీర్ఘ కాలం నడిచే నిజమైన రియాలిటీ షోలతో పోటీ పడలేరని హితవు పలికారు. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న లాక్ అప్ సీజన్ 2 లోనైనా ఏక్తా కపూర్ ఇలాంటి పనులు చేయకుండా ఉంటే ఆ ఓటీటీ షోకి మంచిదని సలహా ఇచ్చారు పాయల్ రోహత్గీ.
రియాలిటీ షోలు తన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చాయో కూడా పాయల్ రోహత్గీ వివరించారు. వయసు పెరిగే కొద్దీ మనుషుల్లో వచ్చే మార్పులను ఈ షోలు ప్రతిబింబిస్తాయని చెప్పారు.
20 ఏళ్ల వయసులో అరుపులు.. 40 ఏళ్లలో మెచ్యూరిటీ!
"నేను బిగ్ బాస్, నాచ్ బలియే వంటి ఎన్నో షోలు చేశాను. వాటన్నింటినీ నా నిజ జీవితంలాగే భావించాను. 20 ఏళ్ల వయసులో కోపం వస్తే గట్టిగా అరుస్తాం. అదే 40 ఏళ్లకు వచ్చాక అరిచి సమయం వృథా చేయకుండా సింపుల్గా ఫోన్ కట్ చేస్తాం. నా జీవితంలో వచ్చిన ఈ మార్పులన్నీ రియాలిటీ షోల ద్వారా అభిమానులు చూశారు. ఈ షోలు నా వ్యక్తిగత ఎదుగుదలకు ఎంతో సహాయపడ్డాయి" అని పాయల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను కొత్తగా సంగీతం నేర్చుకోవడంలో బిజీగా ఉండటం వల్ల 'లాక్ అప్ 2' చూడలేకపోతున్నానని, కానీ కంటెస్టెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని పాయల్ అన్నారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న 'లాక్ అప్: సచ్ యా సజా' షోకు ఫరా ఖాన్, రితేష్ దేశ్ముఖ్ హోస్ట్లుగా వ్యవహరిస్తున్నారు.
నెట్ఫ్లిక్స్ ఓటీటీలో
రామ్ కపూర్, ధీరజ్ ధూపర్, శివాంగి జోషి, శిల్పా షిండే వంటి పాపులర్ స్టార్లతో పాటు రియాజ్, యోగేష్ రావత్, ఆకాంక్ష చౌదరి, శ్రేయ కల్రా వంటి సోషల్ మీడియా స్టార్స్ ఈ జైలు సెటప్ షోలో కంటెస్టెంట్స్గా పోటీ పడుతున్నారు. శనివారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ షో ప్రసారమవుతోంది.