పాపులర్ యాంకర్, బుల్లితెర బ్యూటి శ్రీముఖి ఫుడ్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. ఫుర్సత్ అనే పేరుతో చాలా గ్రాండ్గా రెస్టారెంట్ను ప్రారంభించింది టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి. మాదాపూర్లోని క్యాపిటల్ పార్క్ వద్ద ఈ ఫుర్సత్ రెస్టారెంట్ను ఓపెన్ చేశారు.
మరో ముగ్గురు పార్టనర్స్తో ప్రారంభం

ఫుర్సత్ రెస్టారెంట్ను తన పార్ట్నర్స్ శ్రావణ్, ఆనంద్, రవిలతో కలిసి శ్రీముఖి ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులు, మీడియా ప్రతినిధులు, ఆహ్వానితులు హాజరై, మల్టీ-కుయిజిన్ వంటకాలతో పాటు ఆకర్షణీయమైన వాతావరణాన్ని కలిపిన ప్రత్యేక డైనింగ్ కాన్సెప్ట్ను ఆస్వాదించారు.
ఇంటి స్టైల్ కర్రీలు చాలా ఇష్టం
ఫుర్సత్ రెస్టారెంట్ ప్రారంభ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.. "నాకు భోజనం చాలా ఇష్టం. ముఖ్యంగా చికెన్ వంటకాలు, బిర్యానీ, ఇంటి స్టైల్ కర్రీలు చాలా ఇష్టం. అలాగే వెజిటేరియన్ వంటకాలు కూడా నేను ఇష్టపడతాను" అని తెలిపింది.
రెస్టారెంట్ మాత్రమే కాదు
"ఫుర్సత్ రెస్టారెంట్లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఇది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు. ఇది ఒక అనుభూతి, ఒక వాతావరణం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఇది మంచి ప్రదేశం" అని శ్రీముఖి పేర్కొంది.
300 మంది కూర్చొనే సదుపాయం
"అందుబాటులో ధరలు, నల్లి గోష్ట్ బిర్యానీ వంటి ప్రత్యేక వంటకాలు, 300 మంది కూర్చునే సదుపాయంతో పాటు బ్యాంక్వెట్ సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల, హైదరాబాద్లో మంచి ఆహారం, వేడుకల కోసం ఒకే చోటుగా ఫుర్సత్ నిలుస్తుందని ఆశిస్తున్నాం” అని యాంకర్ శ్రీముఖి వెల్లడించారు.
పార్టనర్ శ్రావణ్ కామెంట్స్
ఈ సందర్భంగా భాగస్వామి శ్రావణ్ మాట్లాడుతూ.. "ఫుర్సత్ను ప్రజలు ప్రశాంతంగా గడిపే, మంచి ఆహారంతో సమయాన్ని ఆస్వాదించే ప్రదేశంగా మేము ఆలోచించాం. రుచి, సేవలో నిరంతరతతో పాటు ఆత్మీయ వాతావరణాన్ని అందించడం మా లక్ష్యం. శ్రీముఖి ఉత్సాహం, మా అందరి అభిరుచితో, ఫుర్సత్ హైదరాబాద్లో కుటుంబాలు, స్నేహితులు, కార్పొరేట్ సమావేశాల కోసం ప్రాధాన్య ప్రదేశంగా మారుతుందని విశ్వసిస్తున్నాం" అని పేర్కొన్నారు.
ఆధునిక శైలిలో సంప్రదాయ రుచులు
{{/usCountry}}ఈ సందర్భంగా భాగస్వామి శ్రావణ్ మాట్లాడుతూ.. "ఫుర్సత్ను ప్రజలు ప్రశాంతంగా గడిపే, మంచి ఆహారంతో సమయాన్ని ఆస్వాదించే ప్రదేశంగా మేము ఆలోచించాం. రుచి, సేవలో నిరంతరతతో పాటు ఆత్మీయ వాతావరణాన్ని అందించడం మా లక్ష్యం. శ్రీముఖి ఉత్సాహం, మా అందరి అభిరుచితో, ఫుర్సత్ హైదరాబాద్లో కుటుంబాలు, స్నేహితులు, కార్పొరేట్ సమావేశాల కోసం ప్రాధాన్య ప్రదేశంగా మారుతుందని విశ్వసిస్తున్నాం" అని పేర్కొన్నారు.
ఆధునిక శైలిలో సంప్రదాయ రుచులు
{{/usCountry}}ఆనంద్ రెస్టారెంట్ వంటకాల దృక్పథాన్ని వివరిస్తూ.. “ఫుర్సత్లో మేము వివిధ రుచులను దృష్టిలో ఉంచుకుని మెనూను రూపొందించాము. సంప్రదాయ రుచులను ఆధునిక శైలిలో అందిస్తూ, ప్రతి వంటకం నాణ్యత, నిజమైన రుచిని కాపాడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. మా అతిథులకు కేవలం భోజనం కాకుండా పూర్తి డైనింగ్ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం” అని చెప్పారు.
అన్ని రకాల ఈవెంట్స్ కోసం
రెస్టారెంట్ కాన్సెప్ట్, భవిష్యత్ ప్రణాళికలను రవి వివరించుతూ.. “ఫుర్సత్ను మేము కేవలం రెస్టారెంట్గా కాకుండా, వేడుకలు, సమావేశాలు, గుర్తుండిపోయే క్షణాల కోసం ఒక ప్రత్యేక స్థలంగా రూపొందించాము. పెద్ద సంఖ్యలో కూర్చునే సౌకర్యం, బ్యాంక్వెట్ సదుపాయాలతో అన్ని రకాల ఈవెంట్స్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే నాణ్యతను కొనసాగిస్తూ ఫుర్సత్ బ్రాండ్ను విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు.