Priyanka Chopra: ప్రియాంక చోప్రాపై అరిచేసిన కొరియోగ్రాఫర్- మైక్ కిందపడేసి ఆగ్రహం- కత్రినా కైఫ్ నుంచి మెళకువలతో ఇలా!

Priyanka Chopra About Katrina Kaif And Raju Khan: నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా తన సినీ ప్రయాణం మొదట్లో డ్యాన్స్ సరిగా రాక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సీనియర్ కొరియోగ్రాఫర్ రాజు కాన్ సెట్‌లో మైక్ విసిరేసి తిట్టిన చేదు జ్ఞాపకాలను తాజాగా ప్రియాంక చోప్రా పంచుకున్నారు.

Published on: Apr 30, 2026, 11:10:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Priyanka Chopra About Katrina Kaif And Raju Khan: నేషనల్ అవార్డు విన్నర్, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా అంటే మనకు గుర్తొచ్చేది ఆమె అద్భుతమైన నటన, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు. కానీ, తన కెరీర్ ఆరంభంలో ఆమె డ్యాన్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. 'వోగ్ అరేబియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.

ప్రియాంక చోప్రాపై అరిచేసిన కొరియోగ్రాఫర్- మైక్ కిందపడేసి ఆగ్రహం- కత్రినా కైఫ్ నుంచి మెళకువలతో ఇలా!
ప్రియాంక చోప్రాపై అరిచేసిన కొరియోగ్రాఫర్- మైక్ కిందపడేసి ఆగ్రహం- కత్రినా కైఫ్ నుంచి మెళకువలతో ఇలా!

ఒకేసారి చేయడం నా వల్ల అయ్యేది కాదు

"సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను చాలా దారుణంగా డ్యాన్స్ చేసేదాన్ని. ఒకవైపు నటన, మరోవైపు కొరియోగ్రాఫర్ చెప్పిన మూమెంట్స్.. ఇవన్నీ ఒకేసారి చేయడం నావల్ల అయ్యేది కాదు" అని ప్రియాంక చోప్రా నిజాయితీగా ఒప్పుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సీనియర్ కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట.

మైక్ కింద పడేసి వెళ్లారు

"నువ్వు ఏదో అందాల పోటీల (Miss World) నుంచి వచ్చుండొచ్చు.. కానీ నటి కావాలంటే ముందు డ్యాన్స్ నేర్చుకో" అంటూ మైక్ కింద పడేసి సెట్ నుంచి వెళ్లిపోయారట ఆ కొరియోగ్రాఫర్. ఆ సమయంలో తాను ఎంతో సిగ్గుపడ్డానని, బాధగా అనిపించిందని ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పట్టుదలతో శ్రమించిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత 'దేశీ గర్ల్', 'రామ్ చాహే లీలా' వంటి సాంగ్స్‌తో అందరినీ మెప్పించారు.

కత్రినా కైఫ్ సాయంతో కఠిన సాధన

ప్రస్తుతం రాజు ఖాన్, ప్రియాంక మంచి స్నేహితులు కావడం విశేషం. డ్యాన్స్‌లో తన బలహీనతను అధిగమించడానికి ప్రియాంక చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆమెకు తోడయ్యారు. అప్పటికే కత్రినా మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో, ఆమె దగ్గర మెళకువలు నేర్చుకుంటూ రోజుకు ఆరు గంటల పాటు ప్రియాంక ప్రాక్టీస్ చేసేవారట. అలా తనను తాను మలచుకుని బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగారు ప్రియాంక చోప్రా.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన ఓటీటీ మూవీ 'ది బ్లఫ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే భారతీయ ప్రేక్షకులు మాత్రం ఆమె 'వారణాసి' సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి సినిమాతో ఇండియాకు రీ-ఎంట్రీ

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్‌లో ప్రియాంక చోప్రా మందాకినీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్‌లో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More