RK Selvamani On Thalapathy Vijay Jana Nayagan Leak: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్కు స్వస్తి పలికే ముందు నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ చుట్టూ ఇప్పుడు తీవ్ర విషాదం అలుముకుంది. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే జన నాయగన్ హై క్వాలిటీ (HD) ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది.

ఈ ఘటనపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (FEFSI) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా లీక్ కాదని, వ్యవస్థాగతమైన వైఫల్యమని ఆర్కే రోజా భర్త, డైరెక్టర్ సెల్వమణి అభివర్ణించారు.
రిజర్వ్ బ్యాంక్ దోపిడీతో పోలిక
ఈ లీకేజీని ఒక భారీ బ్యాంకు దోపిడీతో పోల్చారు సెల్వమణి. "రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎవరైనా రూ. 500 కోట్లు దొంగిలిస్తే దేశమంతా గగ్గోలు పెడుతుంది. కానీ, ఒక నిర్మాత రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా చోరీకి గురైతే అటు ప్రభుత్వం గానీ, ఇటు ప్రజలు గానీ పెద్దగా స్పందించడం లేదు. హాలీవుడ్ సినిమాలు లీక్ అయితే నిందితులు వెంటనే పట్టుబడతారు. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు" అని సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడ లోపం జరిగింది?
జన నాయగన్ సినిమా ఎడిటింగ్ టేబుల్ నుంచి బయటకు వచ్చిందా లేక డబ్బింగ్ సమయంలో లీక్ అయిందా అనే దానిపై సెల్వమణి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్ విభాగం నుంచి సమాచారం సేకరించగా.. సినిమా కాపీలను డబ్బింగ్ కోసం కర్ణాటకకు, ఆడియో మిక్సింగ్ కోసం హైదరాబాద్కు పంపినట్లు తెలిసిందని సెల్వమణి పేర్కొన్నారు.
ఈ రెండు చోట్ల ఎక్కడో ఒకచోట ఈ భారీ చోరీ జరిగి ఉండొచ్చని సెల్వమణి అనుమానం వ్యక్తం చేశారు. దొంగిలించిన వస్తువులను ఎటువంటి భయం లేకుండా నేరుగా ప్రజల ఇళ్లకే ఇంటర్నెట్ ద్వారా పంపిణీ చేయడం ఆందోళన కలిగించే విషయమన్నారు.
కమల్ హాసన్ మద్దతు.. ప్రభుత్వాలకు విన్నపం
{{/usCountry}}ఈ రెండు చోట్ల ఎక్కడో ఒకచోట ఈ భారీ చోరీ జరిగి ఉండొచ్చని సెల్వమణి అనుమానం వ్యక్తం చేశారు. దొంగిలించిన వస్తువులను ఎటువంటి భయం లేకుండా నేరుగా ప్రజల ఇళ్లకే ఇంటర్నెట్ ద్వారా పంపిణీ చేయడం ఆందోళన కలిగించే విషయమన్నారు.
కమల్ హాసన్ మద్దతు.. ప్రభుత్వాలకు విన్నపం
{{/usCountry}}ఈ విషయంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను సెల్వమణి సమర్థించారు. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం వల్లే పైరసీ రాయుళ్లు చెలరేగిపోతున్నారని కమల్ హాసన్ గతంలో ట్వీట్ చేశారు. చట్టపరమైన మార్గాలు మూసుకుపోయినప్పుడు ఇలాంటి అక్రమ మార్గాలు పుట్టుకొస్తాయని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సెల్వమణి కోరారు. ఐపీ అడ్రస్లను ట్రాక్ చేసి నిందితులను జైలుకు పంపాలని, సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా విధించే చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ
దళపతి విజయ్ సినిమా అంటే థియేటర్ల వద్ద ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఆ పండగ ఇప్పుడు పైరసీ వల్ల ఆగిపోయిందని సెల్వమణి పేర్కొన్నారు. థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం పంపిణీదారులకు, అక్కడి నుంచి నిర్మాతలకు, చివరికి వేలాది మంది సినీ కార్మికులకు చేరుతుందని.. ఇప్పుడు ఆ గొలుసు తెగిపోయిందని ఆయన ఆవేదన చెందారు.
కాగా, ఈ ఘటనపై తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే రంగంలోకి దిగి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది.