Sai Sudharsan IPL GT Vs RCB: ఐపీఎల్ 2026 సీజన్లో సాయి సుదర్శన్ తన బ్యాట్కు పనిచెప్పారు. బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేస్తూ క్లాసిక్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. గత సీజన్లోనే తన ముద్ర వేసిన ఈ యంగ్ బ్యాట్స్మెన్ ఈసారి మరింత పరిణతితో బ్యాటింగ్ చేశారు.
ఎక్కడా అనవసరపు షాట్లకు పోకుండా, కేవలం టైమింగ్పైనే ఆధారపడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా బంతిని బలంగా బాదడం కంటే, గ్యాప్లను వెతకడంలో సుదర్శన్ చూపించిన నేర్పు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
టీమిండియా దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు
ఈ సెంచరీతో సాయి సుదర్శన్ భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు సీజన్లలో సెంచరీలు బాదిన తొలి భారతీయ బ్యాటర్గా ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఏ భారత స్టార్ ప్లేయర్కూ ఇది సాధ్యం కాలేదు. ఓవరాల్గా చూస్తే వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (2011-2013) మాత్రమే ఈ ఘనత సాధించారు.
గిల్ మద్దతు.. సుదర్శన్ విద్వంసం
ఇప్పుడు ఆ అరుదైన జాబితాలో సుదర్శన్ రెండో స్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఆయన ఎంతటి కీలక ఆటగాడో మరోసారి నిరూపితమైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో ఎండ్లో నిలకడగా ఆడుతూ సుదర్శన్కు పూర్తి సహకారం అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
గిల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సుదర్శన్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వగా పవర్ప్లేలో సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. బెంగళూరులోని చిన్న సరిహద్దులను, బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్ను ఈ జంట చక్కగా వినియోగించుకుంది. మొత్తం 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 3వ ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్న సుదర్శన్, ఆ వెంటనే హేజిల్వుడ్ బౌలింగ్లో అవుటయ్యారు.
ఉత్కంఠభరిత ముగింపు.. 200 దాటిన గుజరాత్
{{/usCountry}}గిల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సుదర్శన్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వగా పవర్ప్లేలో సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. బెంగళూరులోని చిన్న సరిహద్దులను, బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్ను ఈ జంట చక్కగా వినియోగించుకుంది. మొత్తం 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 3వ ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్న సుదర్శన్, ఆ వెంటనే హేజిల్వుడ్ బౌలింగ్లో అవుటయ్యారు.
ఉత్కంఠభరిత ముగింపు.. 200 దాటిన గుజరాత్
{{/usCountry}}సాయి సుదర్శన్ అవుటైన తర్వాత బెంగళూరు బౌలర్లు మ్యాచ్ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లలో రాసిఖ్ సలామ్ గాయపడటంతో కృనాల్ పాండ్యా బంతిని అందుకున్నారు.
అయితే, జేసన్ హోల్డర్ తన అనుభవాన్ని రంగరించి రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. బెంగళూరు వంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుపై ఈ స్కోరు ఎంతవరకు సరిపోతుందో వేచి చూడాలి.