స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు హైదరాబాద్లో అభిమానుల నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం (డిసెంబర్ 21) నగరంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సమంతను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అయితే, ఒక్కసారిగా అభిమానులు ఆమెపైకి దూసుకురావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.
అదుపు తప్పిన జనం.. ఉక్కిరిబిక్కిరైన సమంత

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. పట్టుచీరలో ఎంతో హుందాగా ఈవెంట్కు వచ్చిన సమంత కార్యక్రమం ముగించుకుని స్టేజ్ పైనుంచి కారు వైపు వెళ్తుండగా వందలాది మంది ఆమెను చుట్టుముట్టారు. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారింది.
జనాల తోపులాట మధ్య సమంత కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా, సమంత చిరునవ్వు చెదరకుండా నిబ్బరంగా కారు వరకు చేరుకోగలిగారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మళ్లీ అదే సీన్.. మారని తీరు
కొద్దిరోజుల క్రితమే 'ది రాజా సాబ్' సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైన విషయం తెలిసిందే. అప్పుడు కూడా జనం ఆమెను ఇబ్బంది పెట్టిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. "నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ తర్వాత కూడా అభిమానులకు బుద్ధి రాదా? సెలబ్రిటీలకు ప్రైవసీ ఉండదా?" అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
వెర్రి అభిమానంపై విమర్శలు
దక్షిణాదిలో సినీ తారల పట్ల ఉండే అభిమానం కొన్నిసార్లు హద్దులు దాటుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. "అభిమానం ఉండాలి కానీ, అది అవతలి వారికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. మేనేజ్మెంట్ ఇలాంటి పరిస్థితులకు ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేయదు?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
{{/usCountry}}దక్షిణాదిలో సినీ తారల పట్ల ఉండే అభిమానం కొన్నిసార్లు హద్దులు దాటుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. "అభిమానం ఉండాలి కానీ, అది అవతలి వారికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. మేనేజ్మెంట్ ఇలాంటి పరిస్థితులకు ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేయదు?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
{{/usCountry}}గతంలో అల్లు అర్జున్, విజయ్ వంటి స్టార్ల కార్యక్రమాల్లోనూ ఇలాంటి తోపులాటలు జరిగాయని, ఈ సంస్కృతి మారాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలా మొన్న నిధి అగర్వాల్కు, ఇవాళ సమంతకు అభిమానులు నడవడానికి కూడా ఇబ్బంది పడేలా చుక్కలు చూపించారు.
సమంత సినిమాలు
సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'రక్త బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్డమ్' (Rakt Brahmand: The Bloody Kingdom) అనే భారీ ఓటీటీ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఇందులో ఆమెతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.