Child Artist Mahima Makwana On OTT Series: చైల్డ్ ఆర్టిస్ట్గా బుల్లితెరపై అడుగుపెట్టి, ఇప్పుడు బాలీవుడ్ వెండితెరతో పాటు ఓటీటీ మాధ్యమంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది నటి మహిమా మక్వానా. ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన 'ముసాఫిర్ కెఫె' (Musafir Cafe) వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఈ సందర్భంలో సినీ పరిశ్రమలోని అనిశ్చితి, తను ఎంచుకుంటున్న పాత్రల గురించి పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది మహిమా మక్వానా.
'బాలికా వధు' నుంచి సల్మాన్ ఖాన్ సినిమా వరకు
దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన 'బాలికా వధు' (తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు') వంటి సీరియల్స్తో చిన్నతనంలోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది మహిమ. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నిర్మించిన 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్' సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమానే తన కెరీర్కు మలుపు తిప్పిందని ఆమె పేర్కొంది.
"సల్మాన్ సర్, మహేష్ మంజ్రేకర్ సర్ నన్ను నమ్మి ఇచ్చిన అవకాశం నా జీవితాన్నే మార్చేసింది. పెద్ద తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరడమే కాకుండా పరిశ్రమలో మరిన్ని అవకాశాలు రావడానికి 'అంతిమ్' దారులు పరిచింది" అని మహిమ మక్వానా వెల్లడించింది.
అనిశ్చితికి సమాధానం సహనం..
సినిమా పరిశ్రమలో ఏదీ మన చేతుల్లో ఉండదని, ఇక్కడ ఓర్పు, పట్టుదల చాలా అవసరమని, సినిమా రంగం పాఠాలు నేర్పించిందని మహిమా వ్యాఖ్యానించింది. మనకు వచ్చే అవకాశాల నుంచి ఎలాంటి పాత్రలను ఎంచుకుంటున్నామనేదే మన చేతుల్లో ఉండే ఏకైక విషయమని తెలిపింది.
"నేను నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, నాకంటూ ఒక సొంత అభిమాన గణాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నా ప్రయాణాన్ని నా సొంత మార్గంలోనే మలుచుకుంటున్నాను. నా వల్ల అయిందంటే ఎవరి వల్ల అయినా అవుతుంది" అని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
'ముసాఫిర్ కెఫె' లో ప్రేమ లోతులు
{{/usCountry}}"నేను నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, నాకంటూ ఒక సొంత అభిమాన గణాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నా ప్రయాణాన్ని నా సొంత మార్గంలోనే మలుచుకుంటున్నాను. నా వల్ల అయిందంటే ఎవరి వల్ల అయినా అవుతుంది" అని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
'ముసాఫిర్ కెఫె' లో ప్రేమ లోతులు
{{/usCountry}}దివ్య ప్రకాష్ దూబే రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా 'ముసాఫిర్ కెఫె' ఓటీటీ సిరీస్ను దర్శకుడు రుచిర్ అరుణ్ తెరకెక్కించారు. ఇందులో ప్రీతి అనే సంక్లిష్టమైన పాత్రలో మహిమ కనిపించింది. విక్రాంత్ మాస్సీ, వేదిక పింటో ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రస్తుత రోజుల్లో ప్రేమ కథలు రావడం తగ్గిపోయాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కాగానే వెంటనే ఒప్పుకున్నానని తెలిపింది మహిమ. ఈ సిరీస్లో విక్రాంత్ మాస్సీతో కలసి పనిచేయడంపై స్పందిస్తూ.. 'బాలికా వధు' రోజుల్లోనే అతన్ని మొదటిసారి చూశానని, టీవీ రంగానికి చెందిన ఒక నటుడు ఈ రోజు స్టార్గా ఎదగడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది.
భవిష్యత్తు ప్రాజెక్టులు
ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న మహిమా మక్వానా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. టైగర్ ష్రాఫ్ తో కలసి ఒక యాక్షన్ సినిమాలో నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లోనూ ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది. ఇంతియాజ్ అలీ, రాజ్ అండ్ డీకే వంటి ప్రముఖ దర్శకులతో పనిచేయడమే తన తదుపరి లక్ష్యమని మహిమా మక్వానా స్పష్టం చేసింది.