గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమాల్లో ‘ధురంధర్’ (Dhurandhar) ఒకటి. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ చేసిన ‘హెయిర్-ఫ్లిప్’ సీన్ యూత్ను పిచ్చెక్కించింది.
తుపాకీ పట్టుకుని

ఒక పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా, మధ్యలో రణ్వీర్ సింగ్ (హంజా) తుపాకీ పట్టుకుని శత్రువులతో పోరాడే ఈ యాక్షన్ సీన్ హైలైట్గా నిలిచింది. సరిగ్గా ఈ గన్ ఫైట్ జరుగుతున్నప్పుడే బ్యాక్గ్రౌండ్లో వచ్చే ‘రంబా హో’ (Ramba Ho) సాంగ్ థియేటర్లను దద్దరిల్లేలా చేసింది.
లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ పాడిన ఈ ఐకానిక్ సాంగ్ను కొత్తగా రీమిక్స్ చేసి పాడారు సింగర్ మధుబంతి బాగ్చీ. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో రంబా హో రీమిక్స్ సాంగ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను మధుబంతి బాగ్చీ పంచుకున్నారు.
"భయంతోనే ఒప్పుకున్నాను"
సంగీత దర్శకుడు శాశ్వత్ ఈ పాట గురించి తనతో చెప్పినప్పుడు మొదట ఆశ్చర్యపోయానని మధుబంతి తెలిపారు. "మ్యూజిక్ ఆల్బమ్ లాంచ్ కావడానికి ఒక రోజు ముందు ఈ పాటను రికార్డ్ చేశాం. సినిమాలో ఎవరూ ఊహించని సమయంలో ఈ పాట వస్తుందని శాశ్వత్ చెప్పారు. ఆ సీన్ విజువల్స్ చూశాక నాకు మైండ్ బ్లాక్ అయింది. అంత పెద్ద గన్ ఫైట్ సీన్లో ‘రంబా హో’ రావడం చాలా కొత్తగా, కూల్గా అనిపించింది" అని మధుబంతి వివరించారు.
అయితే, ఉషా ఉతుప్ వంటి దిగ్గజం పాడిన పాటను మళ్లీ పాడటం అంటే పెద్ద రిస్క్ అని మధుబంతి భయపడ్డారు. "స్టాండర్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.. నేను సరిగ్గా పాడలేకపోతే విమర్శలు వస్తాయని భయపడ్డాను. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం.. ‘ఒక గన్ ఫైట్ సీన్ కు ఎంత ఇంటెన్సిటీ కావాలో అంత పవర్ఫుల్గా పాడు’ అని ధైర్యం చెప్పారు. పాత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్లోకి పాట మారుతున్న తీరు అద్భుతంగా కుదిరింది" అని మధుబంతి బాగ్చీ సంతోషం వ్యక్తం చేశారు.
బ్లాక్బస్టర్ ‘ధురంధర్’
ఇక ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ గతేడాది డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.
{{/usCountry}}ఇక ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ గతేడాది డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.
{{/usCountry}}కరాచీలోని లయారీ టౌన్ నేపథ్యంలో సాగే గ్యాంగ్ వార్స్, కాందహార్ హైజాక్, పార్లమెంట్ అటాక్, 26/11 వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ధురంధర్ సినిమాను తెరకెక్కించారు.
సిక్వెల్ కోసం సిద్ధమా?
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సిక్వెల్ ధురంధర్ 2 మార్చి 19న థియేటర్లలోకి రానుంది. జస్కీరత్ సింగ్ రంగి అనే వ్యక్తి, గూఢచారి హంజా అలీ మజారీగా ఎలా మారాడు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ రెండో భాగం ధురంధర్ ది రివేంజ్ తిరగనుంది.