Neha Bhasin: పెంట్ హౌస్ నుంచి రోడ్డుపైకి, 21 ఏళ్లకే చరిత్రగా మిగిలిపోతానని భయపడ్డా: సింగర్ నేహా భాసిన్ ఎమోషనల్ కామెంట్స్
Neha Bhasin Singing Career Struggles: ఇండియా మొట్టమొదటి గర్ల్ బ్యాండ్ వివాతో రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న పాపులర్ సింగర్ నేహా భాసిన్, ఆ తర్వాత ఎదుర్కొన్న తీవ్రమైన ఒడిదొడుకులను పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలోనే పాతాళానికి పడిపోయినట్లు అనిపించిందంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
Neha Bhasin Singing Career Struggles: చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఢిల్లీలోని ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఛానల్ వి ‘పాప్స్టార్స్’ పోటీల్లో గెలిచి, భారత తొలి గర్ల్ బ్యాండ్ ‘వివా’ (Viva) లో సభ్యురాలిగా మారారు నేహా భాసిన్.

జీవితం ఒక్కసారిగా తారుమారు
అప్పట్లో దేశాన్ని ఊపేసిన పాప్ సంస్కృతిలో సింగర్ నేహా భాసిన్ ఒక వెలుగు వెలిగారు. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. బ్యాండ్ విడిపోయిన తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా తారుమారైంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే తన కెరీర్ ముగిసిపోయిందని భావించినట్లు నేహా భాసిన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లేబ్యాక్ సింగింగ్ వేరు.. నాడు ఎదురైన చేదు అనుభవాలు
2002లో ‘వివా’ బ్యాండ్ విడుదల చేసిన మొదటి ఆల్బమ్ సంచలన విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాదే వచ్చిన రెండో ఆల్బమ్ కూడా హిట్టయింది. దేశవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ప్రేక్షకుల ముందు లైవ్ షోలు ఇస్తూ నేహా భాసిన్ స్టార్గా దూసుకుపోయారు.
కానీ, 2004లో ఈ నలుగురు అమ్మాయిల బ్యాండ్ అనుకోకుండా విడిపోయింది. ఆ తర్వాత సొంతంగా కెరీర్ నిర్మించుకోవాలని నేహా ప్లేబ్యాక్ సింగింగ్ వైపు అడుగులు వేశారు. ఆ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలోని అసలు వాస్తవాలు ఆమెకు తెలిసొచ్చాయి.
రక్షణ వలయంలో ఉంచారు
"బ్యాండ్ ముగిసిన తర్వాతే బయటి ప్రపంచం ఎంత భిన్నంగా ఉంటుందో నాకు అర్థమైంది. అంతవరకు మమ్మల్ని ఒక రక్షణ వలయంలో ఉంచారు. సినిమాల్లో పాడటం అంత సులువు కాదని, దానికి ప్రత్యేక శిక్షణ అవసరమని అప్పుడు తెలిసింది" అని నేహా భాసిన్ తెలిపారు.
"మైక్ ముందు నిలబడి ఏది పడితే అది పాడితే కుదరదు. అవకాశాల కోసం రికార్డింగ్ స్టూడియోల చుట్టూ తిరిగినప్పుడు.. మాకు వివా బ్యాండ్ తెలుసు, కానీ ఇంతకీ నువ్వు ఎవరు? అని మ్యూజిక్ లేబుల్స్ ప్రశ్నించేవి" అని నేహా భాసిన్ ఆనాటి పరిస్థితులను వివరించారు.
పెంట్హౌస్ నుంచి రోడ్డుపైకి వచ్చినట్లు అనిపించింది
వేల మంది చప్పట్లు, ఈలల మధ్య స్టేజ్ పైన ప్రదర్శనలు ఇచ్చిన రోజులకు, ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులకు అస్సలు పోలికే లేదని నేహా పేర్కొన్నారు. ఈ మార్పు తనను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని చెప్పారు. ఒక్కసారిగా లగ్జరీ పెంట్హౌస్ నుంచి రోడ్డుపై పడిపోయినట్లు ఫీలయ్యానని ఆవేదన చెందారు.
దాదాపు ఐదారు సంవత్సరాల పాటు చిన్న చిన్న షోలు చేసుకుంటూ గడపాల్సి వచ్చింది. సరిగ్గా తాను సోలో కెరీర్ ప్రారంభించే సమయానికే దేశంలో ఇండియన్ పాప్ (ఇండిపాప్) సంగీతానికి ఆదరణ తగ్గిపోవడం కూడా ఆమెను దెబ్బతీసింది. ఇక జీవితంలో కోలుకోలేనేమో, 21 ఏళ్లకే చరిత్రగా మిగిలిపోతానా అనే భయం వెంటాడిందని నేహా భాసిన్ చెప్పుకొచ్చారు.
'సుల్తాన్' సినిమాతో మలుపు..
ఎన్నో కష్టాల తర్వాత 2007లో వచ్చిన ‘ఫ్యాషన్’ సినిమాలోని ‘కుచ్ ఖాస్ హై’ పాట నేహా భాసిన్ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ పాట ఆమెకు ఫిలింఫేర్ నామినేషన్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2016లో సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ చిత్రంలోని ‘జగ్ ఘూమేయా’ పాటకు గాను నేహా భాసిన్ ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్గా ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని, కెరీర్ మొదట్లోనే ఒక చీకటి రోజులను అనుభవించానని నేహా చెప్పారు. ఇటీవలి కాలంలో మళ్లీ ఇండిపెండెంట్ మ్యూజిక్కు ఆదరణ పెరగడంపై నేహా సంతోషం వ్యక్తం చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వాడకం పెరగడంతో ఇండిపాప్ మళ్లీ పుంజుకుందని అభిప్రాయపడ్డారు.
మళ్లీ ఫామ్లోకి..
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కంటే స్వతంత్ర సంగీత ఆల్బమ్స్ స్ట్రీమింగ్ యాప్స్లో అద్భుతమైన వ్యూస్ సాధిస్తున్నాయని, ఈ మార్పు రావడానికి ఇన్నేళ్లు పట్టిందని గుర్తుచేశారు.
పెద్ద సినిమాల్లో పాటలు పాడి
కాగా, ‘వివా’ బ్యాండ్ పాత మ్యూజిక్ ఆల్బమ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అందుబాటులోకి రావడంతో నేహా భాసిన్ తన పాత స్నేహితురాళ్లతో కలిసి సందడి చేశారు. ఇటీవల విడుదలైన ‘బడే మియాన్ ఛోటే మియాన్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ వంటి పెద్ద సినిమాల్లోనూ నేహా భాసిన్ పాటలు పాడి శ్రోతలను అలరించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


