Singer Shreya Ghoshal Real Estate Buys 3 Flats: మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్ వరుస పెట్టి ఆస్తులు కొంటున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన శాంతాక్రజ్ వెస్ట్ ప్రాంతంలో సింగర్ శ్రేయా ఘోషల్ రూ. 20.88 కోట్లు వెచ్చించి ఒక లగ్జరీ అపార్ట్మెంట్ను సొంతం చేసుకున్నారు. అంటే సుమారు రూ. 21 కోట్లు అన్నమాట.
కుటుంబ సభ్యులతో కలిసి

రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన డాక్యుమెంట్ల ప్రకారం.. శ్రేయా ఘోషల్ తన కుటుంబ సభ్యులు శర్మిష్ఠ ఘోషల్, బిశ్వజిత్ ఘోషల్తో కలిసి ఈ ఆస్తిని రిజిస్టర్ చేయించారు.
మూడు నెలల్లో మూడవ కొనుగోలు
శ్రేయా ఘోషల్ పెట్టుబడులు చూస్తుంటే ఆమె రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల (ఏప్రిల్) ప్రారంభంలోనే ముంబైలోని వర్లీలో దాదాపు రూ. 60 కోట్లతో రెండు ఖరీదైన ఫ్లాట్లను శ్రేయా ఘోషల్ కొనుగోలు చేశారు. ఇప్పుడు శాంతాక్రజ్లో కొన్న ఈ మూడవ అపార్ట్మెంట్తో కలిపి గత మూడు నెలల్లోనే శ్రేయా ఘోషల్ సుమారు రూ. 80 కోట్లకు పైగా ఆస్తుల కోసం వెచ్చించడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొత్త ఇంటి ప్రత్యేకతలు ఇవే
శాంతాక్రజ్ సరోజిని రోడ్లోని 'వాయు' బిల్డింగ్లో శ్రేయా ఘోషల్ ఈ కొత్త ఫ్లాట్ ఉంది. 'ఓం డెవలపర్స్ రియాల్టీ' నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఎగువ అంతస్తులో ఈ అపార్ట్మెంట్ను ఆమె ఎంచుకున్నారు. దీని విస్తీర్ణం సుమారు 2,900 చదరపు అడుగులు (బాల్కనీతో కలిపి).
ఏప్రిల్ 24, 2026న జరిగిన ఈ లావాదేవీకి గాను శ్రేయా ఘోషల్ రూ. 1.25 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ డీల్లో భాగంగా మూడు కార్ పార్కింగ్ స్పేస్లు కూడా లభించాయి. పాత 'సుఖద' భవనాన్ని కూల్చివేసి ఆధునిక హంగులతో పునర్నిర్మించిన (Redevelopment) ప్రాజెక్ట్ ఇది.
వర్లీలో భారీ ఇన్వెస్ట్మెంట్
{{/usCountry}}ఏప్రిల్ 24, 2026న జరిగిన ఈ లావాదేవీకి గాను శ్రేయా ఘోషల్ రూ. 1.25 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ డీల్లో భాగంగా మూడు కార్ పార్కింగ్ స్పేస్లు కూడా లభించాయి. పాత 'సుఖద' భవనాన్ని కూల్చివేసి ఆధునిక హంగులతో పునర్నిర్మించిన (Redevelopment) ప్రాజెక్ట్ ఇది.
వర్లీలో భారీ ఇన్వెస్ట్మెంట్
{{/usCountry}}గతంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్న 'గోద్రెజ్ ట్రైలజీ'లో శ్రేయా ఘోషల్ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్ 1న జరిగిన ఆ రిజిస్ట్రేషన్ల కోసం ఏకంగా రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించడం గమనార్హం.
కేవలం శ్రేయా ఘోషల్ మాత్రమే కాదు, ఇటీవల ప్రముఖ హీరోయిన్ టబు కూడా వెర్సోవా ప్రాంతంలో రూ. 10 కోట్లతో ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, సెలబ్రిటీలు మాత్రం విలాసవంతమైన భవనాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
ఆ కోవలోకే శ్రేయా ఘోషల్
సాధారణంగా సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని కేవలం సినిమాలు, షోలకే పరిమితం చేయకుండా ఇలా రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించడం ద్వారా భవిష్యత్తుకు భద్రతను వెతుక్కుంటారు. శ్రేయా ఘోషల్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా ఆ కోవలోకే వస్తుంది.