...
...
Next Story

Shah Rukh Khan Sunil Narine: 200 వికెట్లు, 3 టైటిల్స్, నువ్వో మాంత్రికుడివి- సునీల్ నరైన్‌పై షారుఖ్ ఖాన్ ప్రశంసలు!

Shah Rukh Khan Praised Sunil Narine IPL Record: ఐపీఎల్‌లో తొలి విదేశీ బౌలర్‌గా సునీల్ నరైన్ అరుదైన రికార్డ్ సాధించాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సునీల్ నరైన్‌ను మాంత్రికుడు అంటూ ప్రశంసలు కురిపించాడు షారుఖ్ ఖాన్.

Published on: May 4, 2026, 10:10:17 IST
Advertisement

Shah Rukh Khan Praised Sunil Narine IPL Record: కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి విదేశీ ఆటగాడిగా సునీల్ నరైన్ రికార్డుల్లోకెక్కారు.

ఉప్పల్ వేదికగా అరుదైన మైలురాయి

200 వికెట్లు, 3 టైటిల్స్, నువ్వో మాంత్రికుడివి- సునీల్ నరైన్‌పై షారుఖ్ ఖాన్ ప్రశంసలు!
200 వికెట్లు, 3 టైటిల్స్, నువ్వో మాంత్రికుడివి- సునీల్ నరైన్‌పై షారుఖ్ ఖాన్ ప్రశంసలు!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో సునీల్ నరైన్ ఈ అద్భుత ఘనతను సొంతం చేసుకున్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్ సలీల్ అరోరాను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో తన 200వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నారు. లీగ్ చరిత్రలో ఈ మార్కును అందుకున్న మూడో బౌలర్‌గా ఆయన నిలిచారు.

ఇప్పటివరకు యజువేంద్ర చాహల్ అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచారు. ఇప్పుడు నరైన్ వీరి సరసన చేరడమే కాకుండా, ఈ మైలురాయిని చేరిన మొట్టమొదటి విదేశీ ప్లేయర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. నరైన్ రికార్డు సృష్టించిన తరుణంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఎక్స్‌(X) వేదికగా భావోద్వేగంగా స్పందించారు.

"నువ్వొక మెజీషియన్".. షారుఖ్ ప్రశంసలు

నరైన్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. "సునీల్, నా మిత్రమా.. నీతో మా ప్రయాణం 15 సీజన్లుగా కొనసాగుతోంది. 200 వికెట్లు, 3 టైటిల్స్.. ఇలా కేకేఆర్ తరఫున ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎన్నో విజయాలు అందించావు. నువ్వు ఒక మాంత్రికుడివి (Magician). నిన్ను మా కుటుంబ సభ్యుడిలా ప్రేమిస్తున్నాం. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ, ఆరోగ్యంగా ఉండు" అని షారుఖ్ ఖాన్ పేర్కొన్నారు. 2012లో కేకేఆర్‌లో చేరినప్పటి నుంచి నరైన్ ఆ జట్టులోనే కొనసాగుతుండటం గమనార్హం.

కేకేఆర్ హ్యాట్రిక్ విజయం.. మలుపు తిరిగిన లీగ్

అనంతరం లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో 59 పరుగులతో రాణించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్న యువ ఆటగాడు రఘువంశీ మాట్లాడుతూ.. టోర్నీ సుదీర్ఘంగా సాగేటప్పుడు ఇలాంటి విజయాలు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని అభిప్రాయపడ్డారు.

పాయింట్ల పట్టికలో మార్పులు

ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఐదు ఓటములు, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో కలిపి మొత్తం ఏడు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. మరోవైపు, ఓటమి పాలైనప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ బౌలర్ ఎవరు?

కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ బౌలర్‌గా రికార్డు సృష్టించారు.

2. సునీల్ నరైన్ ఏ జట్టు తరఫున ఆడుతున్నారు?

ఆయన 2012 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

3. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మిగిలిన బౌలర్లు ఎవరు?

యజువేంద్ర చాహల్ (అత్యధిక వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (తొలి ఫాస్ట్ బౌలర్) ఇప్పటికే ఈ మైలురాయిని దాటారు.

4. కేకేఆర్ vs ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?

కేకేఆర్ బ్యాటర్ రఘువంశీ 59 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe