బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కేవలం ఆరు రోజుల్లోనే బాహుబలి రికార్డులను తిరగరాయడం విశేషం.
ఆసక్తికర విషయం

అయితే, ధురంధర్ 2 సినిమాలో వాడిన పదజాలంపై తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) తండ్రి బ్రిగేడియర్ జహంగీర్గా నటించిన సువీందర్ విక్కీ సెన్సార్ బోర్డు కళ్లుగప్పి బూతు పదాలను ఎలా ఉపయోగించారో వెల్లడించారు.
ఇలాంటి కఠినమైన పదజాలాన్ని
మిర్చి ప్లస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సువీందర్ విక్కీ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. "నేను నా కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి కఠినమైన పదజాలాన్ని ఎప్పుడూ వాడలేదు. అందుకే ఆ సీన్ చేసే ముందు ఆదిత్యను అడిగాను.. ‘పాజీ, నిజంగా ఇన్ని బూతులు అవసరమా? మరీ ఇంతగానా?’ అని సందేహం వ్యక్తం చేశాను" అని ఆయన తెలిపారు.
"బీప్" పడకుండానే బూతులు!
దానికి ఆదిత్య ధర్ నవ్వుతూ ఇచ్చిన సమాధానం సువీందర్ను ఆశ్చర్యపరిచిందట. "పాజీ, నేను స్క్రిప్ట్లో కేవలం సెన్సార్ బోర్డు బీప్ వేయని బూతులను మాత్రమే రాశాను. మీరు సినిమా చూసేటప్పుడు గమనించండి.. ఒక్క చోట కూడా బీప్ సౌండ్ వినిపించదు" అని ఆదిత్య ధర్ ధీమాగా చెప్పారు.
"ఇంత కాలం కెరీర్లో ఎన్నో సినిమాలు సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లాయి కాబట్టి, ఏ పదానికి అనుమతి ఉంటుంది, ఏది ఉండదు అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది" అని దర్శకుడు వివరించినట్లు సువీందర్ పేర్కొన్నారు.
డైరెక్టర్ మాస్టర్ ప్లాన్
{{/usCountry}}"ఇంత కాలం కెరీర్లో ఎన్నో సినిమాలు సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లాయి కాబట్టి, ఏ పదానికి అనుమతి ఉంటుంది, ఏది ఉండదు అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది" అని దర్శకుడు వివరించినట్లు సువీందర్ పేర్కొన్నారు.
డైరెక్టర్ మాస్టర్ ప్లాన్
{{/usCountry}}ఆదిత్య రీసెర్చ్ చూసి తాను ముగ్ధుడనయ్యానని సువీందర్ విక్కీ కొనియాడారు. అలా ధురంధర్ 2లో బూతులున్నా డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ వల్ల సెన్సార్ కత్తెర పడలేదని సువీందర్ చెప్పుకొచ్చారు.
ఇర్ఫాన్ ఖాన్తో పోలిక..
సువీందర్ విక్కీ పంజాబీ చిత్రాల ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పటికీ, 2023లో నెట్ఫ్లిక్స్ ఓటీటీ వచ్చిన ‘కోహ్రా’ సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఉడ్తా పంజాబ్’ సినిమాతోపాటు ‘పాతాళ్ లోక్’ వంటి ఓటీటీ సిరీస్లో సువీందర్ విక్కీ నటించారు. నెటిజన్లు ఆయన నటనను దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్తో పోల్చడం విశేషం.
రికార్డుల సునామీ..
ఇకపోతే ప్రస్తుతం ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రం దేశీయంగా ఇప్పటివరకు రూ. 643 కోట్లు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల మార్కును దాటి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది ధురంధర్ 2 సినిమా. బాహుబలి లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా ఈ చిత్రం అధిగమించడం విశేషం.