గతేడాది డిసెంబర్లో విడుదలై భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని వసూళ్లతో రికార్డులు తిరగరాసిన చిత్రం 'ధురంధర్'. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెలలు గడుస్తున్నా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా ధురంధర్ సినిమాపై హీరోయిన్ స్వరా భాస్కర్ తల్లి, ప్రముఖ ఫిల్మ్ స్కాలర్ ఐరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిత్రంలోని రాజకీయ కోణంపై ఐరా భాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సాంకేతికత బాగుంది.. కానీ ఉద్దేశం?
ఇటీవల ‘కార్వాన్ ఎ మొహబ్బత్’ అనే యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐరా భాస్కర్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాలో కథలు చెప్పే విధానం ఎలా మారిపోయిందో వివరించారు.
"కోట్లు కొల్లగొడుతున్న ధురంధర్ వంటి సినిమాలను చూస్తుంటే.. ఒక ప్రత్యేక భావజాలానికి లోబడిన దర్శకులు వీటిని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. కానీ, అందులోని కంటెంట్ విషయానికి వస్తే అది హిందుత్వ అజెండాను ప్రచారం చేసేలా ఉంది" అని ఐరా భాస్కర్ అభిప్రాయపడ్డారు.
ముస్లింల చిత్రీకరణపై అభ్యంతరం
ధురంధర్ సినిమాలో చూపించిన విపరీతమైన హింస ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని ఐరా భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. "ముస్లింలంటే హింసావాదులని, పాకిస్థాన్ అంటే ఒక ఉగ్రవాద దేశమని ఈ సినిమా బలంగా నమ్ముతోంది. అక్కడ మనకు ఏ ఒక్కరు కూడా సాధారణ ముస్లిం వ్యక్తిలా కనిపించడు. ప్రతి ఒక్కరూ టెర్రరిస్టులుగానో లేదా గ్యాంగ్స్టర్లుగానో కనిపిస్తారు. మేకప్ వాడి నిజమైన వ్యక్తుల్లా చూపించి, వాస్తవ సంఘటనల పేరుతో తమకు కావాల్సిన అంశాలనే ఎంచుకుని ఇలాంటి చిత్రాలు తీస్తున్నారు" అని ఐరా భాస్కర్ విమర్శించారు.
ప్రోపగాండా వ్యాఖ్యలను కొట్టిపారేసిన సినీ పెద్దలు
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై ఇప్పటికే సోషల్ మీడియాలో 'ప్రోపగాండా' (ప్రచార చిత్రం) అనే ముద్ర పడింది. అయితే కరణ్ జోహార్, శత్రుఘ్న సిన్హా వంటి ప్రముఖులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
{{/usCountry}}ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై ఇప్పటికే సోషల్ మీడియాలో 'ప్రోపగాండా' (ప్రచార చిత్రం) అనే ముద్ర పడింది. అయితే కరణ్ జోహార్, శత్రుఘ్న సిన్హా వంటి ప్రముఖులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
{{/usCountry}}"హాలీవుడ్లో మార్వెల్ సినిమాలు అమెరికా గొప్పతనాన్ని చాటుతాయి, అప్పుడు ఎవరూ విమర్శించరు.. మరి మన దేశభక్తిని చాటే సినిమాలపైనే ఎందుకీ విమర్శలు?" అని అనురాగ్ కశ్యప్ గతంలోనే ప్రశ్నించారు.
రికార్డుల వేటలో 'ధురంధర్'
కరాచీలోని అండర్ వరల్డ్ నెట్వర్క్ను ఛేదించే ఒక భారతీయ గూఢచారి కథతో ఈ చిత్రం రూపొందింది. ఐసీ-814 హైజాకింగ్, ముంబై దాడులు వంటి నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది.