తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి'గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. అయితే, విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదలలో ఎదురవుతున్న అడ్డంకులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
నిర్మాత కష్టాల్లో ఉండటం బాధగా ఉంది

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC)తో నడుస్తున్న ఈ జన నాయగన్ పోరాటంపై దళపతి విజయ్ తాజాగా స్పందించారు. ఎన్డీటీవీ (NDTV)కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో విజయ్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ‘జన నాయకన్’ చిత్రం సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడుతుండటంపై విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
"నా వల్ల నా నిర్మాత (KVN ప్రొడక్షన్స్) ఇబ్బందులు పడటం చూస్తుంటే చాలా బాధగా ఉంది. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడే, నా సినిమాలను టార్గెట్ చేస్తారని నాకు తెలుసు. అందుకు నేను మానసికంగా ఎప్పుడో సిద్ధమయ్యాను" అని దళపతి విజయ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. నిర్మాతలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావించిన సెన్సార్ బోర్డు, తమ వాదన వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని కోరుతూ సుప్రీంకోర్టులో 'కావియట్' దాఖలు చేసింది.
రాజకీయాల్లో షారుక్ ఖాన్ నా రోల్ మోడల్!
రాజకీయాల్లోకి రావడంపై దళపతి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ను తాను స్ఫూర్తిగా తీసుకుంటానని విజయ్ తెలిపారు. "షారుక్ ఎంత అద్భుతంగా మాట్లాడతారో నేను గమనిస్తూ ఉంటాను. ఆయన ఉచ్చారణ, మాటల్లో ఉండే స్పష్టత నన్ను బాగా ఆకర్షించాయి. ఆయనను చూసినప్పుడల్లా ఒక వ్యక్తి ఇంత చక్కగా ఎలా మాట్లాడగలడా? అని ఆశ్చర్యపోయేవాడిని" అని విజయ్ వివరించారు.
వీరితో పాటు తమిళ రాజకీయ దిగ్గజాలు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిలను కూడా తన మార్గదర్శకులుగా విజయ్ పేర్కొన్నారు. నటులుగా ఉంటూనే వారు రాజకీయాల్లో ఎలా రాణించారో చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.
కరుర్ విషాదం నన్ను వెంటాడుతోంది..
{{/usCountry}}వీరితో పాటు తమిళ రాజకీయ దిగ్గజాలు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిలను కూడా తన మార్గదర్శకులుగా విజయ్ పేర్కొన్నారు. నటులుగా ఉంటూనే వారు రాజకీయాల్లో ఎలా రాణించారో చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.
కరుర్ విషాదం నన్ను వెంటాడుతోంది..
{{/usCountry}}రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కొవిడ్ సమయం నుంచే మొదలైందని విజయ్ వెల్లడించారు. అలాగే గతేడాది తన కరుర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (సుమారు 41 మంది మృతి) తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆ విషాదం తనను ఇంకా వెంటాడుతూనే ఉందని విజయ్ ఎమోషనల్ అయ్యారు.
ఏదేమైనా, ఈ ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తాను ముందుకు సాగుతానని దళపతి విజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, జన నాయగన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీకి జన నాయగన్ రీమేక్ అని టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే.