టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్, బ్యూటిపుల్ పాయల్ రాధాకృష్ణ జోడీగా నటించిన సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. నటుడు అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో చేస్తున్న ఈ హోల్సమ్ ఎంటర్టైనర్ మూవీకి మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు.
ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్

సీహెచ్వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై అరవింద్ మండెం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఇదివరకు విడుదలైన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా యాంథమ్ సాంగ్ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో శ్రీ కృష్ణుడు డ్రోన్స్తో వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది. ప్రకాష్ చెరుకూరి అందించిన మ్యూజిక్ ఈ పాటకు ప్రాణం పోసింది.
బాబా సెహగల్ వాయిస్
ఈ పాటను పాపులర్ సింగర్ బాబా సెహగల్ ఆలపించారు. బాబా సెహగల్ వాయిస్ యూత్ను వెంటనే అట్రాక్ట్ చేసే ఎనర్జీతో ఈ పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది.
అర్వింద్ మండెం రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను మట్టి వాసనతో పాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్ఫుల్గా ప్రజెంట్ చేయడంలో ఆయన లిరిక్స్ కీలక పాత్ర పోషించాయి. ఈ పాట యూత్తో పాటు ప్రతి వర్గం ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా నిలిచింది.
ఇదిలా ఉంటే, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రానికి రవికుమార్ డీవోపీగా, ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
{{/usCountry}}ఇదిలా ఉంటే, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రానికి రవికుమార్ డీవోపీగా, ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
{{/usCountry}}కాగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాలో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లాతోపాటు శివాజీ రాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు ఇతర పాత్రలు పోషించారు.
ఇండస్ట్రీలో ఉండేందుకు కారణం
ఇక ఇటీవల నిర్వహించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. నేను ఈ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం చంటి గారు. ఆయన లేకపోతే ఈ జర్నీ ఇంత స్మూత్గా జరిగేది కాదు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని అన్నారు.
"చినప్పుడు విన్న ఒక మాట నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. వ్యవసాయ భూమి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందంటే.. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథ. ఇది చాలా అద్భుతంగా వచ్చింది" అని మధుదీప్ తెలిపారు.
"ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ హత్తుకునేలా ఉంటుంది. హీరో త్రిగుణ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. 5 ఏళ్ల జర్నీ. మొదటి రోజు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాము" అని డైరెక్టర్ మధుదీప్ పేర్కొన్నారు.
చిరునవ్వు ఎక్కడికిపోదు
"బాబ్జి గారు చాలా మంచి మనిషి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు మీ మొహంలో చిరునవ్వు ఎక్కడికి పోదు. ఈ సినిమా ఆనందంపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తారు" అని దర్శకుడు మధుదీప్ చెప్పారు.