The India Story Review And Rating In Telugu: ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం.. ప్రస్తుతం సమాజాన్ని వేధిస్తున్న తీవ్రమైన సమస్యల్లో ఇది ఒకటి. ఇలాంటి సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రల్లో చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్ లీగల్ డ్రామా జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామాజిక స్పృహ కలిగించే ప్రయత్నంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ది ఇండియా స్టోరీ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
యోగేష్ (శ్రేయాస్ తల్పడే) అనే తండ్రి తన చిన్నారి కూతురిని క్యాన్సర్ వ్యాధితో పోగొట్టుకుంటాడు. పంటల్లో వాడే క్రిమిసంహారకాలు, ఆహారంలో కల్తీ వల్లే తన బిడ్డకు ఈ ఘోరం జరిగిందని భావించిన ఆయన, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఈ పోరాటంలో అడ్వకేట్ అర్చన (కాజల్ అగర్వాల్) ఆయన తరఫున వకీలు పాత్ర పోషిస్తుంది. ఒక సామాన్య తండ్రి వ్యవస్థపై చేసిన ఈ న్యాయపోరాటం చివరకు ఏ మలుపు తిరిగింది? కోర్టులో కల్తీదారులను వారు ఎలా నిలదీశారనేదే 'ది ఇండియా స్టోరీ' కథ.
విశ్లేషణ:
మంచి ఉద్దేశంతో ఎంచుకున్న కథ ఇది. అయితే, సమాజంలోని లోటుపాట్లను తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు చేతన్ డీకే తడబడ్డారు. సినిమా మొదటి భాగం మొత్తం ఏదో సోషల్ మీడియా సందేశాన్ని సుదీర్ఘంగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కోర్టు గది సన్నివేశాల్లో కనీసం లాజిక్ కనిపించదు.
కాజల్ పోషించిన న్యాయవాది పాత్ర వాదనల్లో స్పష్టత కొరవడింది. ఒకే వాదనను పదే పదే పునరావృతం చేయడం తప్ప బలమైన ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయారు. ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఒక సాధారణ డాక్యుమెంటరీని ప్రధాన ఆధారంగా కోర్టు అంగీకరించడం నమ్మశక్యంగా అనిపించదు.
సెకండాఫ్ ఎలా ఉందంటే?
{{/usCountry}}కాజల్ పోషించిన న్యాయవాది పాత్ర వాదనల్లో స్పష్టత కొరవడింది. ఒకే వాదనను పదే పదే పునరావృతం చేయడం తప్ప బలమైన ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయారు. ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఒక సాధారణ డాక్యుమెంటరీని ప్రధాన ఆధారంగా కోర్టు అంగీకరించడం నమ్మశక్యంగా అనిపించదు.
సెకండాఫ్ ఎలా ఉందంటే?
{{/usCountry}}ఇంటర్వెల్ తర్వాత సినిమా కథనం పూర్తిగా దారి తప్పిన అనుభూతి కలుగుతుంది. మొదటి భాగంలో లేవనెత్తిన ఆహార కల్తీ, క్రిమిసంహారకాల అంశం పక్కకు పోయి, కేవలం ఎమోషనల్ డ్రామాగా మారిపోతుంది. పాప మరణానికి కేవలం ఆ రసాయనాలే కారణమని రుజువు చేసే సీన్లు బలంగా లేవు. క్యాన్సర్ బాధితుల వేదనను చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అసలు సమస్య పక్కదారి పట్టింది.
రోడ్డు పక్కన అమ్మే టీ తాగడానికి నిరాకరించి, ప్యాక్ చేసిన నీళ్లను కాజల్ పాత్ర ఎంచుకోగానే పక్కనున్న వారు కూడా టీ కప్పును పక్కన పడేసే సన్నివేశం చూస్తే.. అనవసర భయాందోళనలను వ్యాప్తి చేసేలా ఉంది. నిజానికి ఇలాంటి సమస్యలపై సినిమా తీస్తున్నప్పుడు లోతైన పరిశోధన, బాధ్యతాయుతమైన కథనం చాలా అవసరం.
ఎవరెలా చేశారంటే?
నటీనటుల విషయానికి వస్తే, శ్రేయాస్ తల్పడే తన పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. బిడ్డను కోల్పోయిన తండ్రిగా ఆయన వేదన ఆకట్టుకుంటుంది. కాజల్ అగర్వాల్ ఎమోషనల్ సీన్లలో పరవాలేదనిపించినా, న్యాయవాదిగా కోర్టు గది సన్నివేశాల్లో తేలిపోయారు. ఒక సీనియర్ అడ్వకేట్కు ఉండాల్సిన గాంభీర్యం ఆమె పాత్రలో కనిపించలేదు.
"సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని ఎంచుకున్నప్పటికీ, కేవలం ఉద్వేగాలను వాడుకోవాలనే తాపత్రయంలో దర్శకుడు కథనాన్ని దారితప్పించారు" అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫైనల్గా చెప్పాలంటే?
మొత్తంగా చెప్పాలంటే, 'ది ఇండియా స్టోరీ' తీవ్రంగా చర్చించాల్సిన విషయాన్నే ఎంచుకున్నప్పటికీ, ఆకట్టుకునేలా తీయడంలో విఫలమైంది. ఆలోచింపజేసే పరిశోధనాత్మక కథనానికి బదులు, భయాన్ని పంపే ప్రయత్నం చేయడంతో సినిమా సాధారణ స్థాయికే పరిమితమైంది.