...
...
Next Story

Tollywood: డే 1 రోజే అత్యధిక షేర్, గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాలు- రామ్ చరణ్ పెద్ది స్థానమెంతో తెలుసా?

Day 1 Top Highest Share Gross Collection Tollywood Movies: తెలుగు సినిమా తొలిరోజునే అధిక కలెక్షన్స్‌తో మార్కెట్ పరిధి గ్లోబల్ స్థాయికి చేరింది. ఈ క్రమంలో థియేట్రికల్ రిలీజ్ అయిన డే 1 నాడు అత్యధిక షేర్, గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాప్ టాలీవుడ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 6, 2026, 13:24:33 IST
Advertisement

Day 1 Top Highest Share Gross Collection Tollywood Movies: తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ స్టామినా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు వచ్చే వసూళ్లే వారి స్టార్‌డమ్‌కు అసలైన కొలమానంగా మారుతున్నాయి.

లాంగ్ రన్‌లో రికార్డులు

డే 1 రోజే అత్యధిక షేర్, గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాలు- రామ్ చరణ్ పెద్ది స్థానమెంతో తెలుసా?
డే 1 రోజే అత్యధిక షేర్, గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాలు- రామ్ చరణ్ పెద్ది స్థానమెంతో తెలుసా?

ఒకప్పుడు లాంగ్ రన్‌లో వచ్చే వసూళ్లను రికార్డులుగా పరిగణిస్తే, ఇప్పుడు కేవలం మొదటి రోజే వసూళ్ల సునామీ సృష్టిస్తూ వందల కోట్ల క్లబ్‌లో చేరే స్థాయికి మన సినిమాలు చేరాయి. అయితే, డే 1 రోజున రిలీజ్ అయి అత్యధికంగా షేర్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టాలీవుడ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

'ఆర్ఆర్ఆర్' టాప్.. వేటాడిన 'పుష్ప 2'

తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో గ్లోబల్ ఫినామినన్ 'ఆర్ఆర్ఆర్' రూ. 74.11 కోట్లతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

టాప్ 3లో పవన్ కల్యాణ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' రూ. 70.81 కోట్లతో గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. పవన్ కల్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ)' రూ. 64.56 కోట్ల షేర్‌తో మూడో స్థానంలో నిలిచి పవర్ స్టార్ బాక్సాఫీస్ రేంజ్‌ను నిరూపించింది.

పెద్దికి ఐదో స్థానం

జూనియర్ ఎన్టీఆర్ 'దేవర 1' రూ. 61.65 కోట్లతో నాలుగో స్థానంలో ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది రూ. 54.55 కోట్ల షేర్‌తో టాప్ 5లో సగర్వంగా నిలిచింది. ప్రభాస్ 'సలార్' రూ. 50.49 కోట్లతో ఆ తర్వాతి ఆరో స్థానంలో ఉంది.

వరల్డ్ వైడ్‌గా డే 1 షేర్స్ చూస్తే..

జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 రూ. 98.60 కోట్ల షేర్ వసూళ్లతో టాప్ 4 ఉంటే.. సలార్ రూ. 97.49 కోట్లతో 5వ స్థానంలో, రూ. 96.16 కోట్లతో కల్కి 2898 ఏడీ ఆరో స్థానం దక్కించుకున్నాయి. అలాగే, పవన్ కల్యాణ్ ఓజీ సినిమా రూ. 90.91 కోట్లతో ఏడో ప్లేసులో ఉంటే రామ్ చరణ్ పెద్ది రూ. 75.65 కోట్ల షేర్‌తో టాప్ 8గా నిలిచింది.

వరల్డ్ వైడ్ డే 1 గ్రాస్ కలెక్షన్స్:

1. పుష్ప 2 ది రూల్- రూ. 285.55 కోట్లు

2. ఆర్ఆర్ఆర్- రూ. 235 కోట్లు

3. బాహుబలి 2- రూ. 215 కోట్లు

4. కల్కి 2898 ఏడీ- రూ. 183.20 కోట్లు

5. సలార్- రూ. 167 కోట్లు

6. దేవర పార్ట్ 1- రూ. 157 కోట్లు

7. ఓజీ- రూ. 145 కోట్లు

8. ఆదిపురుష్- రూ. 137 కోట్లకుపైగా

9. సాహో- రూ. 126 కోట్లు

10. పెద్ది- రూ. 117.20 కోట్లు

ఆ రెండింటి మధ్య

ఇలా తొలిరోజు అధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ మూవీస్ జాబితాలో పుష్ప 2 ది రూల్ సినిమా ఉంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన పెద్ది టాప్ 10 స్థానంలో నిలిచింది. అయితే, తెలుగు స్టేట్స్‌ షేర్ కలెక్షన్స్‌లో టాప్ 1గా ఆర్ఆర్ఆర్ ఉంటే.. వరల్డ్ వైడ్ షేర్, గ్రాస్ పరంగా మాత్రం పుష్ప 2 ది రూల్ నిలిచి ఈ రెండింటి మధ్యే గట్టి పోటీ ఎదురైంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe