...
...
Next Story

Mouni Pavitra: ఆ లక్ష మీరేమైనా ఇచ్చారా- బుల్లితెర నటి పవిత్ర ఆగ్రహం- మౌనీ రాయ్ ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్‌పై కౌంటర్లు

Pavitra Punia Defends Mouni Roy Plastic Surgery Trolling: లక్ష సర్జరీలు అంటున్నారు, ఆ లక్ష రూపాయలు మీరేమైనా ఇచ్చారా, మీ కుటుంబ సభ్యులకు డబ్బు ఖర్చు పెట్టి చేయించండి అంటూ ట్రోలర్లపై విరుచుకుపడింది బుల్లితెర నటి పవిత్ర పునియా. మౌనీ రాయ్ ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్‌పై గట్టి కౌంటర్లు ఇచ్చింది.

Published on: May 1, 2026, 22:35:11 IST
Advertisement

Pavitra Punia Defends Mouni Roy Plastic Surgery Trolling: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్‌పై జరుగుతున్న ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్‌పై బుల్లితెర నటి పవిత్ర పునియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వారిపై ఆమె నిప్పులు చెరిగారు.

మౌనీ రాయ్ కనిపించిన తీరుపై

ఆ లక్ష మీరేమైనా ఇచ్చారా- బుల్లితెర నటి పవిత్ర ఆగ్రహం- మౌనీ రాయ్ ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్‌పై కౌంటర్లు
ఆ లక్ష మీరేమైనా ఇచ్చారా- బుల్లితెర నటి పవిత్ర ఆగ్రహం- మౌనీ రాయ్ ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్‌పై కౌంటర్లు

'ది డెవిల్ వేర్స్ ప్రాడా 2' ప్రీమియర్ వేడుకలో మౌనీ రాయ్ కనిపించిన తీరుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, పెదవుల ఆకృతి మార్చుకుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'స్ల్పిట్స్ విల్లా' ఫేమ్, బుల్లితెర నటి పవిత్ర పునియా ఏప్రిల్ 30న ఒక వీడియో విడుదల చేస్తూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఆ వంటగది మీది కాదు

"నటీనటులను వేధించడం ఆపండి. ఆ వంటగది మీది కాదు, ఆ వంటకం మీది అంతకంటే కాదు. అనవసరమైన మాటల వల్ల మాకేం నష్టం లేదు కానీ, ఇలా వాగితే మీకు వేరేగా జీతం వస్తుందని భ్రమపడుతున్నారేమో" అంటూ పవిత్ర పునియా ఎద్దేవా చేశారు.

మీడియా తీరుపై కూడా అసహనం

కేవలం ట్రోలర్లనే కాకుండా, కొన్ని మీడియా సంస్థల తీరును కూడా పవిత్ర తప్పుబట్టారు. వ్యూస్ కోసం, ఎంగేజ్మెంట్ పెంచుకోవడం కోసం సెలబ్రిటీల ఫోటోలు పెట్టి, అనుమానాస్పదంగా క్యాప్షన్లు ఇస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని పవిత్ర మండిపడ్డారు. "మీడియా కూడా ఇలాంటి విషయాలను ఎంజాయ్ చేస్తోంది. ప్రజలకు ఏదో ఒకటి ఊహించుకునేలా అవకాశమిస్తూ మీ బిజినెస్ చేసుకుంటున్నారు" అని పవిత్ర పునియా విమర్శించారు.

ఆ డబ్బు మీ దగ్గర తీసుకోలేదు!

గతంలో కూడా మౌనీ రాయ్ తన పెదవులకు సర్జరీ చేయించుకుందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా పవిత్ర పునియా మద్దతుగా నిలవడంతో ఈ అంశం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కాగా బుల్లితెర సీరియల్‌లో హీరోయిన్‌గా చేసిన మౌనీ రాయ్ బాలీవుడ్ వెండితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. మౌనీ రాయ్‌పై ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి?

ఇటీవల ఒక సినిమా ప్రీమియర్ వేడుకలో ఆమె లుక్ మారినట్లు అనిపించడంతో, నెటిజన్లు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్స్ చేస్తున్నారు.

2. పవిత్ర పునియా ట్రోలర్లకు ఏమని సమాధానం ఇచ్చారు?

సెలబ్రిటీలు సర్జరీల కోసం ఎవరి దగ్గరా డబ్బులు అడగరని, వారి వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని పవిత్ర గట్టిగా చెప్పారు.

3. పవిత్ర పునియా మీడియాను ఎందుకు విమర్శించారు?

సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి సెలబ్రిటీల ఫోటోలపై తప్పుదోవ పట్టించేలా క్యాప్షన్లు ఇస్తున్నారని ఆమె మీడియాపై మండిపడ్డారు.

4. పవిత్ర పునియా ఏ షో ద్వారా గుర్తింపు పొందారు?

ఆమె ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా 3 (MTV Splitsvilla 3) ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe