డ్రీమ్ వెడ్డింగ్ తో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో విరోష్ వెడ్డింగ్ గ్రాండింగ్ జరిగింది. మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ రిసెప్షన్ జరుగుతుంది. ఈ రిసెప్షన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వయంగా వెళ్లి విజయ్, రష్మిక ఆహ్వానించారు.
ప్రధానితో విరోష్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. తమ వివాహం తర్వాత ఈ కొత్త దంపతులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఉదయ్ పూర్ నుంచి ఢిల్లీ వెళ్లి పీఎం మోదీని విరోష్ జోడీ కలిసింది. తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలని స్వయంగా మోదీని విజయ్, రష్మిక ఆహ్వానించారు.
మోదీ ఆశీర్వాదం
కొత్త దంపతులు రష్మిక, విజయ్ కు మోదీ తన ఆశీర్వాదాన్ని అందించారు. మోడీతో ఈ న్యూ కపుల్ సరదాగా మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా విరోష్ పెళ్లి గురించి మోదీ అడిగినట్లు తెలిసింది.
మొదట తమ వివాహానికి ప్రధానిని విరోష్ ఆహ్వానించారు. కానీ పెళ్లికి వెళ్లలేకపోయిన మోదీ ఒక స్పెషల్ లెటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇది కొత్త, అందమైన అధ్యాయం. సినిమాల్లో స్క్రిప్ట్ ప్రకారం రష్మిక, విజయ్ నటించారు. కానీ ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. సినిమాల్లో స్క్రిప్ట్ కంటే కూడా ఈ స్క్రిప్ట్ బెటర్ గా ఉండాలని ఆశిస్తున్నా’’ అని ఆ లెటర్ లో మోదీ పేర్కొన్నారు.
గ్రాండ్ గా రిసెప్షన్
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఘనంగా జరిగింది. తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం విరోష్ జంట రెండు సార్లు పెళ్లి చేసుకుంది. ఇప్పుడిక విజయ్, రష్మిక హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. మార్చి 4న సాయంత్రం తాజ్ హోటల్ లో జరిగే ఈ రిసెప్షన్ కు సినీ, క్రీడ, రాజకీయ తదితర రంగాలకు చెందిన ప్రముఖులను విరోష్ జోడీ ఆహ్వానించింది.
{{/usCountry}}రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఘనంగా జరిగింది. తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం విరోష్ జంట రెండు సార్లు పెళ్లి చేసుకుంది. ఇప్పుడిక విజయ్, రష్మిక హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. మార్చి 4న సాయంత్రం తాజ్ హోటల్ లో జరిగే ఈ రిసెప్షన్ కు సినీ, క్రీడ, రాజకీయ తదితర రంగాలకు చెందిన ప్రముఖులను విరోష్ జోడీ ఆహ్వానించింది.
{{/usCountry}}ఉదయ్ పూర్ లో జరిగిన విరోష్ వెడ్డింగ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, సందీప్ రెడ్డి వంగా, ఆషికా రంగనాథ్, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు అటెండ్ అయ్యారు. ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులైన ఫ్రెండ్స్ సమక్షంలో విరోష్ పెళ్లి జరిగింది. ఈ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.