ఎండలో ఎంత నీళ్లు తాగినా దాహం తీరడం లేదా..? మీరు చేస్తున్న ఈ 4 తప్పులే కారణం

Summer Hydration Mistakes : వేసవిలో దాహం తీర్చడానికి నీరు చాలా ముఖ్యం. కానీ నీరు తాగే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లి రాగానే ఫ్రిజ్ తెరిచి ఐస్ వాటర్ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Published on: May 23, 2026, 17:25:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Summer Hydration Mistakes : భానుడి భగభగలకు ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఈ ముదురుటెండలు శరీరంలో వేడిని విపరీతంగా పెంచేస్తున్నాయి. ఫలితంగా ఒళ్లంతా చెమటలు పట్టి శరీరం త్వరగా డిహైడ్రేషన్‌కు గురవుతోంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అయితే, శరీరాన్ని రీహైడ్రేట్ చేయడమంటే కేవలం లీటర్ల కొద్దీ నీళ్లు తాగేయడం మాత్రమే కాదు.

ఎండలో ఎంత నీళ్లు తాగినా దాహం తీరడం లేదా..? (Photo by Shammi MEHRA / AFP)
ఎండలో ఎంత నీళ్లు తాగినా దాహం తీరడం లేదా..? (Photo by Shammi MEHRA / AFP)

చాలామంది ఎండ తీవ్రతకు భయపడి కేవలం సాధారణ నీటిని మాత్రమే ఎక్కువగా తాగుతుంటారు. అయినప్పటికీ దాహం తీరకపోగా.. నీరసం, తలనొప్పి అలాగే ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఉమంగ్ వివరించారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల దాదాపు 90 శాతం మంది నీళ్లు తాగేటప్పుడు 4 రకాల పెద్ద తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఏమిటి? ఎండ దెబ్బ నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి ఆయుర్వేదం చెబుతున్న సూత్రాలెంటో ఇక్కడ తెలుసుకోండి….

తప్పు 1: నేరుగా చల్లటి నీరు తాగడం

ఎండలో బయటకు వెళ్లి రాగానే ఫ్రిజ్ తెరిచి ఐస్ వాటర్ తాగడం చాలామందికి అలవాటు. ఇది 90 శాతం మంది చేసే మొదటి పెద్ద తప్పు.

  • తాత్కాలిక ఉపశమనం : ఈ చల్లటి నీరు గొంతుకు, నోటికి మాత్రమే కొంతసేపు చల్లదనాన్ని ఇస్తుంది. కానీ, ఇది కణాలలోకి (Cells) త్వరగా శోషించబడదు. అందువల్ల శరీరంలో నీటి లోపం అలాగే ఉండిపోతుంది.
  • జీర్ణక్రియ మందగింపు : ఆయుర్వేదం ప్రకారం… ఐస్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియకు కారణమయ్యే జీర్ణ మంట చల్లబడుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.
  • శక్తి వృథా : ఫ్రిజ్ నీటిని మన శరీరం నేరుగా గ్రహించలేదు. ఆ నీటిని శరీర సాధారణ ఉష్ణోగ్రత అయిన 37 డిగ్రీల సెల్సియస్‌కు తీసుకురావడానికి శరీరం తన సొంత శక్తిని వృథా చేయాల్సి వస్తుంది. దీనికంటే ఫ్రిజ్ లేని సాధారణ కుళాయి నీరు లేదా మట్టి కుండ నీరు శరీర దాహాన్ని సులభంగా తీరుస్తుందని శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది.

తప్పు 2: కేవలం సాదా నీటిని మాత్రమే తాగడం

చెమటలు ఎక్కువగా పట్టినప్పుడు కేవలం సాదా నీటిని మాత్రమే తాగడం ప్రజలు చేసే రెండో తప్పు.

  • ఎలక్ట్రోలైట్ల నష్టం : విపరీతమైన ఎండల వల్ల శరీరం నుండి చెమట రూపంలో కేవలం నీరు మాత్రమే బయటకు పోదు. దాంతో పాటు సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి కీలకమైన ఎలక్ట్రోలైట్లు కూడా నశిస్తాయి.
  • సహజ ఎలక్ట్రోలైట్లు ముఖ్యం : ఇలాంటి స్థితిలో కేవలం ప్యూర్ వాటర్ తాగితే శరీరం హైడ్రేట్ కాదు. వేసవి కాలంలో మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గుల్కండ్ నీరు వంటివి సహజ ఎలక్ట్రోలైట్లలా పనిచేసి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయని ఆయుర్వేద శాస్త్రం స్పష్టం చేస్తోంది.

తప్పు 3: ఒకేసారి నీటిని మింగేయడం

దాహం వేసినప్పుడు లీటరు బాటిల్ పట్టుకుని ఒకేసారి గుటగుటా తాగేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని తాగినప్పుడు ఆ నీరు శరీర కణాలకు చేరదు. పైగా, మూత్రపిండాలపై (Kidneys) ఒక్కసారిగా భారం పడుతుంది. రక్తంలోని సోడియం స్థాయిలు ఒక్కసారిగా పలచబడి అలసట, నీరసం మరియు కండరాల బలహీనతకు దారితీస్తుంది. అందువల్ల రోజంతా కొద్దికొద్ది వ్యవధిలో సిప్ చేస్తూ (సిప్‌ బై సిప్) నీటిని తాగాలని ఆయుర్వేదం సూచిస్తోంది.

తప్పు 4: కూల్ డ్రింక్స్, సోడాలు తాగడం

ఎండ వేడి నుంచి తక్షణ ఉపశమనం కోసం చాలామంది కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ సోడాలు లేదా ప్యాకేజ్డ్ జ్యూస్‌లను ఆశ్రయిస్తారు. ఇది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

శరీరం మరింత డీహైడ్రేట్ అవుతుంది : ఈ పానీయాలలో చక్కెర (Sugar) పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చక్కెరను జీర్ణం చేయడానికి మన శరీర కణాలలో ఉన్న నీటిని వాడుకోవాల్సి వస్తుంది. ఫలితంగా శరీరం లోపల మరింత పొడిబారి, తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇవి శరీరంలో టాక్సిన్స్ (విషపదార్థాలు) పెరగడానికి కారణమవుతాయి.

శరీరం చల్లబడటానికి ఏం తాగాలి..?

కేవలం సాదా నీటితో పాటు, ఎండల తీవ్రతను తట్టుకోవడానికి మన పూర్వీకులు అందించిన సహజసిద్ధమైన అమృతం లాంటి పానీయాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

  • మట్టి కుండ నీరు : ఫ్రిజ్ నీళ్లకు బదులుగా మట్టి కుండలో ఉంచిన నీటిని తాగాలి. ఇది సహజంగా చల్లబడటమే కాకుండా నీటి పిహెచ్ (pH) స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
  • పలచటి మజ్జిగ : జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి కావలసిన లవణాలను అందిస్తుంది.
  • బొండం నీరు (కొబ్బరి నీళ్లు ): ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ గ్లూకోజ్. ఇది శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.
  • నిమ్మరసం / సత్తు పానీయం : విటమిన్ సి, ప్రొటీన్లు అందించి వడదెబ్బ తగలకుండా కాపాడుతాయి.
  • షర్బత్ - గసగసాల నీరు: ఇవి గుండెకు, మెదడుకు చల్లదనాన్ని ఇచ్చి వేసవి తలనొప్పిని నివారిస్తాయి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More