Ambati Rayudu Advice To Yashasvi Jaiswal To Leave RR IPL Team: భారత టెస్ట్ క్రికెట్లో బెస్ట్ ఓపెనర్గా ఎదిగిన ఆటగాడు యశస్వి జైస్వాల్. ఇప్పటివరకు టీమిండియా తరఫున 55 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం అతడి సొంతం. ఐపీఎల్లో ఇది అతడికి ఏడో సీజన్. మరోవైపు వైభవ్ సూర్యవంశీ కేవలం టీ20 ఫార్మాట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక కొత్త మోన్స్టర్.
సూర్యవంశీకే ఎక్కువ పాపులారిటీ

టీమిండియాలోకి ఇంకా అడుగుపెట్టని సూర్యవంశీకి ఇది కేవలం రెండో ఐపీఎల్ సీజన్ మాత్రమే. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ ఇద్దరిలో యశస్వి కంటే సూర్యవంశీనే ఎక్కువ పాపులారిటీ, పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
జైస్వాల్ 15 మ్యాచ్ల్లో 426 పరుగులు చేసి పర్వాలేదనిపించినా, వైభవ్ సూర్యవంశీ ఏకంగా 680కి పైగా పరుగులు సాధించి రికార్డులు తిరగరాస్తున్నాడు. ఏకంగా విరాట్ కోహ్లీ క్రేజ్ను సైతం దాటేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
సూర్యవంశీ నీడలో జైస్వాల్!
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఈ ఇద్దరి మధ్య ఫామ్ పరంగా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఒకే జట్టులో సూర్యవంశీ అంతలా రెచ్చిపోతుంటే, సీనియర్ ఓపెనర్ అయిన జైస్వాల్ ఒత్తిడికి లోనవుతున్నాడని ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే జైస్వాల్కు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఒక కీలకమైన సలహా ఇచ్చారు.
2020 నుంచి రాజస్థాన్ జట్టుకు ప్రధాన పిల్లర్గా ఉన్న జైస్వాల్, ఇకపై ఆ ఫ్రాంచైజీని వీడి మరో జట్టులోకి వెళ్తేనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని రాయుడు స్పష్టం చేశారు. సూర్యవంశీ నీడ నుంచి బయటకు వస్తేనే జైస్వాల్ మళ్లీ హీరో కాగలడని విశ్లేషించారు. యశస్వి జైస్వాల్ వేరే జట్టుకు మారాల్సిన అవసరం ఎందుకు ఉందో వివరిస్తూ రాయుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ప్రతి మ్యాచ్లోనూ అతడే హైలైట్ అవుతున్నాడు'
"జైస్వాల్ తక్షణమే తన ఐపీఎల్ జట్టును మార్చాలి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాడితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిసారీ జైస్వాల్ మరుగున పడిపోతున్నాడు. జైస్వాల్ కూడా ఒక స్టార్ ఆటగాడే. అతడు వేరే జట్టుకు వెళ్తే ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించగలడు" అని ప్రశంసించారు అంబటి రాయుడు.
{{/usCountry}}"జైస్వాల్ తక్షణమే తన ఐపీఎల్ జట్టును మార్చాలి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాడితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిసారీ జైస్వాల్ మరుగున పడిపోతున్నాడు. జైస్వాల్ కూడా ఒక స్టార్ ఆటగాడే. అతడు వేరే జట్టుకు వెళ్తే ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించగలడు" అని ప్రశంసించారు అంబటి రాయుడు.
{{/usCountry}}"అతడికి ఆ స్వేచ్ఛ, ప్రత్యేకమైన వేదిక అవసరం. సూర్యవంశీ ఆడే తీరుకు ఇతరులు హైలైట్ అవ్వడం కష్టం. కాబట్టి సూర్యవంశీ పక్కన ఒక సీనియర్ భాగస్వామి ఉండి, అతడి పరుగులను చూసి సంతోషపడేవాడు ఉండాలే తప్ప, నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉండి పోటీ పడేవాడు ఉండకూడదు" అని అంబటి రాయుడు స్పష్టం చేశారు.
జైస్వాల్ తదుపరి జట్టు ముంబై ఇండియన్సేనా?
రాజస్థాన్ రాయల్స్ను వీడితే జైస్వాల్కు సరిపోయే తదుపరి జట్టు ఏది అనే ప్రశ్నకు రాయుడు వద్ద స్పష్టమైన సమాధానం ఉంది. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ (MI) జట్టులో సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం లేకపోవడం, పైగా టీమిండియా వన్డే జట్టులో రోహిత్ స్థానానికి జైస్వాల్ నేరుగా పోటీ పడుతుండటంతో అతడు ముంబై ఫ్రాంచైజీకి వెళ్లడమే కరెక్ట్ అని రాయుడు భావిస్తున్నారు.
అంతేకాకుండా జైస్వాల్ తన దేశవాళీ క్రికెట్ (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ) అంతా ముంబై జట్టు తరఫునే ఆడాడు. కాబట్టి అతడికి ముంబై హోమ్ గ్రౌండ్ లాంటిది. జైస్వాల్కు ముంబై ఇండియన్స్ అత్యంత అనుకూలమైన జట్టు అని రాయుడు తేల్చి చెప్పారు. ఈ మెగా ట్రేడింగ్ గనుక నిజమైతే రాబోయే సీజన్లలో ఐపీఎల్ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయమని తెలుస్తోంది.