CBSE Class 10 results : స్టూడెంట్స్.. గెట్ రెడీ- ఆ తేదీలోగా సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు!
CBSE Class 10 result date 2026 : భారతదేశంలోని అతిపెద్ద విద్యా బోర్డు సీబీఎస్ఈ.. తన 10వ తరగతి ఫలితాల వెల్లడిలో ఈసారి వేగాన్ని పెంచనుంది. సాధారణంగా మే రెండో వారంలో విడుదలయ్యే ఫలితాలు, ఈసారి ఏప్రిల్ 20 నాటికే వచ్చే అవకాశం ఉందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలను గతంలో కంటే ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతియేటా మే నెలలో ఈ ఫలితాలు వెలువడతాయి. కానీ, పలు మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు ఏప్రిల్ 20 లోగా విడుదల అవుతాయి! పరీక్షా విధానంలో రాబోయే మార్పుల (ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి పరీక్షలు) దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2026- వివరాలు..
ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు కింద పేర్కొన్న అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ మార్కు షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు:
results.nic.in
cbseresults.nic.in
cbse.nic.in
వీటితో పాటు, పాఠశాలల రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు కూడా ఫలితాలు నేరుగా అందుతాయి.
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2026- లాగిన్ వివరాలు, డిజిలాకర్..
ఫలితాలను చూసుకోవడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీని సిద్ధంగా ఉంచుకోవాలి. సీబీఎస్ఈ తన 'పరిణామ మంజుష' (Parinam Manjusha) రిపోజిటరీ ద్వారా డిజిటల్ మార్క్ షీట్లు, మైగ్రేషన్ సర్టిఫికేట్లను డిజిలాకర్లో అందుబాటులో ఉంచుతుంది. విద్యార్థుల మొబైల్ నంబర్లకు లాగిన్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. అలాగే 'DigiResults' యాప్, UMANG ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు.
అయితే, ఏప్రిల్ 20 లోగా సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల అవుతాయన్నది ప్రస్తుతం నివేదికల మాటలు మాత్రమే. ఫలితాల తేదీపై సీబీఎస్ఈ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు..
మరోవైపు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ), నూతన పాఠ్యప్రణాళిక (ఎన్సీఎఫ్) సిఫార్సుల మేరకు సీబీఎస్ఈ పలు కీలక మార్పులను ప్రకటించింది:
1. 6వ తరగతి నుంచి త్రిభాషా సూత్రం:
2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు మూడు భాషల సూత్రం అమల్లోకి వస్తుంది. ఇందులో కనీసం రెండు భాషలు భారతీయ భాషలై ఉండాలి. విదేశీ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి. ఈ విధానంలో చదివే మొదటి బ్యాచ్ 2031లో బోర్డు పరీక్షలు రాస్తుంది.
2. 9వ తరగతిలో రెండు స్థాయిల మ్యాథ్స్, సైన్స్:
2026-27 నుంచి 9వ తరగతి విద్యార్థులకు గణిత, సైన్స్లో రెండు స్థాయిల విధానం ప్రవేశపెట్టబడుతుంది.
స్టాండర్డ్ కోర్సు: ఇది అందరికీ తప్పనిసరి. 80 మార్కులకు 3 గంటల పరీక్ష ఉంటుంది.
అడ్వాన్స్డ్ పేపర్: అదనపు నైపుణ్యం కోరుకునే వారు 25 మార్కులకు 1 గంట అదనపు పరీక్ష రాయవచ్చు. ఇందులో 50% పైగా మార్కులు సాధించిన వారి ప్రతిభను మార్క్ షీట్లో ప్రత్యేకంగా చూపిస్తారు. ఈ విధానంలో చదివే విద్యార్థులు 2028లో 10వ తరగతి బోర్డు పరీక్షలు రాస్తారు.
3. ఏఐ, కంప్యూటేషనల్ థింకింగ్:
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటేషనల్ థింకింగ్ను 9, 10 తరగతులకు తప్పనిసరి సబ్జెక్టులుగా మారుస్తున్నారు. ప్రస్తుతం ఇవి ఇంటర్నల్ అసెస్మెంట్లుగా ఉండగా, 2029 నాటికి పూర్తి స్థాయి బోర్డు పరీక్షా సబ్జెక్టులుగా మారతాయి. 3 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఇవి ఈ ఏడాది నుంచే పరిచయం అవుతాయి.
4. ఒకే ఏడాదిలో రెండు బోర్డు పరీక్షలు:
2026 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గి, తమ స్కోరును మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది.
5. ఒకేషనల్, ఆర్ట్ ఎడ్యుకేషన్:
2027-28 విద్యా సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులు తప్పనిసరి సబ్జెక్టుగా మారుతాయి. ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మాత్రం పాఠశాల స్థాయి ఇంటర్నల్ అసెస్మెంట్లుగానే కొనసాగుతాయి.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు వెలువడవచ్చు?
అధికారిక ప్రకటన రానప్పటికీ, ఏప్రిల్ 20, 2026 నాటికి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాల సమాచారం.
2. 9వ తరగతిలో మ్యాథ్స్, సైన్స్లో వచ్చిన కొత్త మార్పు ఏంటి?
2026-27 నుంచి విద్యార్థులకు స్టాండర్డ్, అడ్వాన్స్డ్ అని రెండు స్థాయిల విధానం ఉంటుంది; అడ్వాన్స్డ్ పేపర్ ద్వారా విద్యార్థుల లోతైన అవగాహనను 25 మార్కులకు ప్రత్యేకంగా పరీక్షిస్తారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


