DMK Congress Alliance End : జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడులో సుదీర్ఘ కాలం పాటు మిత్రపక్షాలుగా ఉన్న ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) , కాంగ్రెస్ మధ్య మైత్రి అధికారికంగా ముగిసింది. ఈ మార్పుల నేపథ్యంలో లోక్సభలో తమ పార్టీ ఎంపీల సీటింగ్ అమరికను మార్చాలని కోరుతూ డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కనిమొళి లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు.
స్పీకర్ కు డీఎంకే లేఖ….

మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తన లేఖలో పేర్కొన్నారు. “లోక్సభలో డీఎంకేకు చెందిన ఎంపీల సీటింగ్ అమరికలో తగిన మార్పులు చేయాలని నేను గౌరవపూర్వకంగా కోరుతున్నాను. కాంగ్రెస్తో మా పొత్తు ముగిసినందున…. సభలో ఇప్పటికీ వారి పక్కనే మా సభ్యులు కూర్చోవడం ఇకపై సముచితం కాదు” అని కనిమొళి స్పీకర్కు వివరించారు.
పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం…. సాధారణంగా ఒకే కూటమి లేదా పొత్తులో ఉన్న పార్టీల సభ్యులకు సభలో పక్కపక్కనే సీట్లు కేటాయిస్తారు. ఇది సభలో వ్యూహరచనకు, సమన్వయానికి సులభంగా ఉంటుంది. అయితే… ఇప్పుడు కాంగ్రెస్తో బంధం తెగిపోవడంతో, విపక్ష పక్షాల మధ్య ఉండే ఆ సమన్వయం అవసరం లేదని డీఎంకే భావిస్తోంది.
ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా విపక్ష కూటమి(ఇండియా కూటమి) ఐక్యతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. దశాబ్ద కాలంగా యూపీఏ (UPA), ఇటీవలి 'ఇండియా' (INDIA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే…. ఇప్పుడు కాంగ్రెస్ నుండి దూరం కావడం దక్షిణాది రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజధానిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
సభలో సీటింగ్ మార్పు కోసం లేఖ అందిన వెంటనే స్పీకర్ కార్యాలయం దీనిపై స్పందించాల్సి ఉంటుంది. సాధారణంగా పార్టీల బలాబలాలు, రాజకీయ పొత్తుల ఆధారంగా సీట్ల కేటాయింపులో మార్పులు చేయడం సహజమే అయినప్పటికీ…. డీఎంకే వంటి ప్రధాన పార్టీ ఇలా బహిరంగంగా లేఖ రాయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో డీఎంకే ఎంపీలు ఏ వరుసలో, ఎవరి పక్కన కూర్చుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…!
దోస్తీ కట్ - కారణాలేంటి..?
మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - డీఎంకే కలిసే పోటీ చేశాయి. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని…. డీఎంకేతో పాటు అన్నాడీఎంకే కు గట్టి షాక్ ఇచ్చింది. టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా… డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది.
{{/usCountry}}మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - డీఎంకే కలిసే పోటీ చేశాయి. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని…. డీఎంకేతో పాటు అన్నాడీఎంకే కు గట్టి షాక్ ఇచ్చింది. టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా… డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది.
{{/usCountry}}ఏ పార్టీకి కూడా 118 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) రాకపోవటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది. టీవీకే పార్టీకి ఇతర పార్టీల మద్దతు ఉంటేనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో…. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్… టీవీకే వైపు మళ్లింది. కనీసం కాంగ్రెస్ పార్టీ తమతో సంప్రదింపులు చేయకుండా… విజయ్ కి మద్దతు ఇవ్వటాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే…. ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిపోయింది.