IND vs PAK : ఇండియాతో మ్యాచ్​ బాయ్​కాట్​.. ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్న పాక్​!

టీ20 వరల్డ్​ కప్​లో భారత్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించడంతో గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మైదానంలోకి దిగకుండానే భారత్‌కు 2 పాయింట్లు లభించగా, పాక్ సెమీస్ ఆశలు ఇప్పుడు చాలా క్లిష్టంగా మారాయి.

Published on: Feb 2, 2026, 06:00:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంకొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్​ కప్​లో ఆడతామని చెప్పిన పాకిస్థాన్​, ఫిబ్రవరి 15న భారత్​తో జరగనున్న మ్యాచ్​ని మాత్రం బాయ్​కాట్​ చేస్తున్నట్టు చెప్పింది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్​ కేవలం ఒక ప్రధాన మ్యాచ్‌ను దూరం చేసుకోవడమే కాకుండా.. గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ సమీకరణాలను రాత్రికి రాత్రే పూర్తిగా మార్చివేసింది.

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు.. (HT_PRINT)
పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు.. (HT_PRINT)

టీ20 వరల్డ్​ కప్​ 2026- పాయింట్ల పట్టికపై పడే ప్రభావం ఏంటి?

సాధారణ టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. ఏదైనా జట్టు మైదానంలోకి దిగడానికి నిరాకరిస్తే, ఆ మ్యాచ్‌ను 'ఫోర్ఫిట్' (అవార్డెడ్ మ్యాచ్)గా పరిగణిస్తారు. దీనివల్ల:

  • భారత్‌కు 2 పాయింట్లు లభిస్తాయి.
  • పాకిస్థాన్‌కు 0 పాయింట్లు వస్తాయి.

బ్యాటింగ్ లేదా బౌలింగ్ జరగదు కాబట్టి, సదరు టోర్నీ నిబంధనల ప్రకారం డిఫాల్ట్ అయిన జట్టు నెట్ రన్ రేట్​పై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.

టీ20 వరల్డ్​ కప్​ ప్లేయింగ్​ కండీషన్స్​కి సంబంధించిన రూల్స్​ బయటకు వచ్చిన తర్వాతే అసలు ప్రభావం ఎంత అని తెలుస్తుంది.

ఏదేమైనా, పాక్​ నిర్ణయంతో టీమ్ ఇండియా గ్రూప్ స్టేజ్‌లోనే ఒక భారీ ఆధిక్యంతో ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. అదే సమయంలో పాకిస్థాన్ పాయింట్లను కోల్పోవడమే కాకుండా, తదుపరి మ్యాచ్‌ల్లో పొరపాట్లకు అస్సలు తావులేని స్థితికి చేరుకుంది.

టీ20 వరల్డ్​ కప్​ 2026 గ్రూప్-ఏ: క్వాలిఫికేషన్ అంటే ఏంటి?

టీ20 వరల్డ్​ కప్​ 2026 గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లు ఉన్నాయి. వీటిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి.

ఇప్పటికే 2 పాయింట్లు ఖాతాలో ఉండటంతో, భారత్ ఇప్పుడు ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే ఒత్తిడిలో ఉండక్కర్లేదు.

వాస్తవంగా చూస్తే:

భారత్​: మిగిలిన 3 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించినా, ఇతర జట్ల ఫలితాలను బట్టి టాప్-2లో ఉండే బలమైన అవకాశం టీమ్​ ఇండియాకు ఉంటుంది.

సూర్యకుమార్​ యాదవ్​ టీమ్​ రెండు విజయాలు సాధిస్తే సూపర్-8 బెర్తు దాదాపు ఖాయం అవుతుంది.

ఇది జట్టు వ్యూహాన్ని కూడా మారుస్తుంది. ఇకపై భారత్ కేవలం 'తప్పక గెలవాలి' అనే ఒత్తిడిలో కాకుండా, రన్ రేట్ మేనేజ్‌మెంట్, క్లీన్ విక్టరీలపై దృష్టి పెట్టవచ్చు.

భారత్ షెడ్యూల్ (గ్రూప్ స్టేజ్):

అమెరికా — ఫిబ్రవరి 7, ముంబై

నమీబియా — ఫిబ్రవరి 12, దిల్లీ

పాకిస్థాన్ — ఫిబ్రవరి 15, కొలంబో (బాయ్​కాట్​)

నెదర్లాండ్స్ — ఫిబ్రవరి 18, అహ్మదాబాద్

పాకిస్థాన్: పాకిస్థాన్ సూపర్​-8కి వెళ్లేందుకు కావాల్సిన పాయింట్లు సాధించడానికి కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి:

నెదర్లాండ్స్ — ఫిబ్రవరి 7, కొలంబో

అమెరికా — ఫిబ్రవరి 10, కొలంబో

నమీబియా — ఫిబ్రవరి 18, కొలంబో

అవకాశాలు:

3/3 విజయాలు (6 పాయింట్లు): సులభంగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది.

2/3 విజయాలు (4 పాయింట్లు): అప్పుడు క్వాలిఫికేషన్ అనేది రన్ రేట్, ఇతర జట్ల మధ్య జరిగే పోరుగా మారుతుంది. ప్రత్యర్థి జట్ల ఫలితాలు అత్యంత కీలకం అవుతాయి.

1/3 విజయం (2 పాయింట్లు): టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ఎందుకంటే కనీసం మరో రెండు జట్లు 4 కంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం ఉంటుంది.

భారత్​ వర్సెస్​ పాక్​- అసలైన మలుపు

గతంలో ఈ గ్రూప్‌లో ఒక ప్రధాన 'స్వింగ్ మ్యాచ్' (భారత్-పాక్ మ్యాచ్) ఉండేది. కానీ ఇప్పుడు పాక్​కి పరిస్థితి మరింత కఠినంగా మారింది. పాకిస్థాన్ ఖచ్చితంగా మిగిలిన జట్లపై స్పష్టమైన విజయాలు సాధించాలి. అదే సమయంలో భారత్ మొదటి రోజు నుంచే టోర్నీ ఫేవరెట్‌గా నిలిచే అవకాశం మరింత పెరిగింది.

క్లుప్తంగా చెప్పాలంటే.. పాక్ బహిష్కరణ వల్ల టీవీల్లో డ్రామా తగ్గింది కానీ, పాయింట్ల పట్టిక లెక్కల్లో మాత్రం వార్​ వన్​సైడ్​ అయిపోయింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More