ఇది కదా గెలుపు అంటే.. ఇలా కదా పాకిస్థాన్ ను చిత్తు చేయాల్సింది. అవును.. ఇండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసింది. బౌలింగ్ లో సత్తాచాటి పాక్ నడ్డివిరిచింది. ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో భారత్ 61 పరుగుల తేడాతో పాక్ పై గెలిచింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 రన్స్ చేసింది. ఛేజింగ్ లో పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఇండియన్ బౌలర్లలో బుమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య రెండేసి వికెట్లు తీశారు.
టీ20 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ విజయాలతో ఇండియా సూపర్ 8కు అర్హత సాధించింది.
బుమ్రా అదుర్స్
టీమిండియా మెయిన్ పేసర్ బుమ్రా కొద్దికాలంగా ఫామ్ లో లేడు. కానీ పాకిస్థాన్ తో మ్యాచ్ అనగానే బుమ్రా రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో సయీమ్ అయూబ్ (6), సల్మాన్ అఘా (4)ను ఔట్ చేసి పాక్ కు డబుల్ షాకిచ్చాడు. అంతకంటే ముందు ఫస్ట్ ఓవర్లోనే ఫర్హాన్ (0) ను హార్దిక్ ఔట్ చేయడంతో ఒక్క రన్ కూడా రాకుండానే పాక్ వికెట్ కోల్పోయింది.
ఉస్మాన్ వికెట్ తో
ఇండియన్ స్పిన్నర్లు రంగంలోకి దిగి పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజాం (5)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ దశలో ఉస్మాన్ ఖాన్ (34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్ తో 44) కాస్త పోరాడాడు. కానీ ఉస్మాన్ ను అక్షర్ ఔట్ చేయడంతో పాక్ పనైపోయింది.
నవాజ్ (4)ను కుల్ దీప్, షాదాబ్ ఖాన్ (14)ను తిలక్ వర్మ పెవిలియన్ చేర్చాడు. 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్ ఓటమి ఖాయమైపోయింది. ఒకే ఓవర్లో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి ఇండియా విజయాన్ని స్పీడప్ చేశాడు. ఉస్మాన్ ను ఔట్ చేసిన హార్దిక్ పాక్ ఇన్నింగ్స్ ను ముగించాడు.
ఇషాన్ అదుర్స్
{{/usCountry}}నవాజ్ (4)ను కుల్ దీప్, షాదాబ్ ఖాన్ (14)ను తిలక్ వర్మ పెవిలియన్ చేర్చాడు. 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్ ఓటమి ఖాయమైపోయింది. ఒకే ఓవర్లో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి ఇండియా విజయాన్ని స్పీడప్ చేశాడు. ఉస్మాన్ ను ఔట్ చేసిన హార్దిక్ పాక్ ఇన్నింగ్స్ ను ముగించాడు.
ఇషాన్ అదుర్స్
{{/usCountry}}అంతకంటే ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఇండియా ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) ఆట హైలైట్. పాకిస్థాన్ తమ స్పిన్నర్లతో ఉచ్చు బిగించాలని చూసినా ఇషాన్ మాత్రం బ్యాటింగ్ లో అదరగొట్టాడు. అతను క్రీజులో ఉన్నప్పుడు ఇండియా ఈజీగా 200 కు పైగా స్కోరు చేస్తుందనిపించింది. కానీ ఇషాన్ వికెట్ తర్వాత సీన్ రివర్సైంది.
పాకిస్థాన్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సయీమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆఖర్లో శివమ్ దూబె (17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 27), రింకు సింగ్ (4 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ తో 11 నాటౌట్) కలిసి టీమ్ స్కోరును 170 దాటించారు.
పాక్ టీమ్ పై ట్రోల్స్
ఇండియా చేతిలో ఓటమితో పాకిస్థాన్ టీమ్ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. నిజానికి టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను పాక్ బాయ్ కాట్ చేస్తామని ప్రకటించింది. కానీ ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆడింది. ఇప్పుడు ఓటమిపాలైంది. దీంతో పాక్ ఆడకపోయినా పరువు దక్కేదేమో, బాయ్ కాట్ చేసినా బాగుండేదేమోనని ఆ టీమ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.