టీ20 ప్రపంచకప్ లో మరో థ్రిల్లర్ కు రంగం సిద్ధమైంది. పొట్టి కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో ఇండియా తలపడుతోంది. నేడు ఈ డూ ఆర్ డై మ్యాచ్. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగే సెమీస్ బలమైన ఇంగ్లిష్ జట్టును భారత్ ఢీకొడుతోంది. హెడ్ టు హెడ్ రికార్డు, మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ చూసేయండి.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

ఇండియా, ఇంగ్లాండ్ టీమ్ మధ్య మరో రసవత్తర పోరు జరగబోతుంది. ఇవాళ (మార్చి 5) ఈ రెండు బలమైన జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే టీ20ల్లో ఇంగ్లాండ్ పై ఇండియాదే పైచేయి కావడం మన ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇచ్చేదే.
హెడ్ టు హెడ్ రికార్డు
టీ20ల్లో టీమిండియా, ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్ రికార్డుపై ఓ లుక్కేద్దాం. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన టీ20ల్లో ఇండియా 17 గెలిచింది. ఇంగ్లాండ్ ఏమో 12 నెగ్గింది. గత ఆరు టీ20ల్లో ఏమో ఇండియా ఏకంగా అయిదు విజయాలు సాధించింది. ఇక టీ20 ప్రపంచకప్ చరిత్రలోనూ ఇంగ్లాండ్ పై ఇండియాదే డామినెన్స్. ప్రపంచకప్ ల్లో అయిదు మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ పై భారత్ మూడు గెలిచింది.
లైవ్ స్ట్రీమింగ్
టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేస్తారు. ముంబయిలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సెమీస్ పోరును స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియోహాట్ స్టార్ లో చూడొచ్చు.
ఇండియా ఇలా
బలమైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ తో పోరుకు ఇండియా సై అంటోంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబెతో భారత బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా సూపర్ 8 లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ ఫామ్ అందుకోవడం గుడ్ న్యూస్.
{{/usCountry}}బలమైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ తో పోరుకు ఇండియా సై అంటోంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబెతో భారత బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా సూపర్ 8 లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ ఫామ్ అందుకోవడం గుడ్ న్యూస్.
{{/usCountry}}సంజు శాంసన్ మూడు ఇన్నింగ్స్లలో 71.50 సగటు, 195.89 స్ట్రైక్ రేట్తో 143 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 38.50 సగటుతో 231 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 185.12 స్ట్రైక్ రేట్తో 224 పరుగులు చేశాడు. శివం దూబె, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ కూడా రాణిస్తున్నారు.
బౌలింగ్ లో
బౌలింగ్ లోనే ఇండియా కాస్త బలహీనంగా కనిపిస్తోంది. విండీస్ తో మ్యాచ్ లో బుమ్రా మినహా మన బౌలర్లు అంచనాలు అందుకోలేకపోయారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి (12 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 9, అర్ష్దీప్ 8, అక్షర్ 7 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తో పోరులో మన బౌలర్లు బెటర్ గా రాణిస్తేనే ఇండియాకు గెలిచే ఛాన్స్ ఉంటుంది.