అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, మిచెల్ శాంట్నర్ నాయకత్వంలోని న్యూజిలాండ్తో ఢీకొనబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్, తన టైటిల్ను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రెండు ప్రధాన సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. అవే.. ఓపెనర్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిల పేలవమైన ఫామ్.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- నంబర్ 1 ఆటగాళ్ల ఫామ్ సంక్షోభం..

ప్రస్తుతం టీ20 బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానాల్లో ఉన్న అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలు వరల్డ్ కప్ లాంటి కీలక సమయంలో ఫామ్ కోల్పోవడం జట్టును కలవరపెడుతోంది. అభిషేక్ ఈ టోర్నీలో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు వరుణ్ చక్రవర్తి సూపర్ 8 దశతో పాటు సెమీఫైనల్లోనూ ప్రత్యర్థి బ్యాటర్ల ధాటికి తేలిపోయాడు.
అయితే, వీరిద్దరి వైఫల్యాలు బయటకు కనిపించకుండా సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్ జట్టును ఆదుకుంటూ వస్తోంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్లపై సాధించిన విజయాల్లో శాంసన్ పాత్ర కీలకం. ముఖ్యంగా సెమీఫైనల్లో ఇచ్చిన క్యాచ్ను హ్యారీ బ్రూక్ జారవిడవడం శాంసన్కు కలిసి వచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సంజూ, ఇంగ్లాండ్పై 89 పరుగులతో విరుచుకుపడి భారత్కు విజయాన్ని అందించాడు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ చాతుర్యం..
సూర్యకుమార్ యాదవ్ తన నాయకత్వ పటిమతో విమర్శకులను మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో ఆఖరి 18 బంతుల్లో ఇంగ్లాండ్ 45 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు, సూర్య చేసిన బౌలింగ్ మార్పులు ఫలితాన్ని భారత్ వైపు తిప్పాయి. ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్లను ప్రారంభంలోనే అవుట్ చేయడం అత్యంత కీలకం. ఒకవేళ ఈ జోడీ నిలదొక్కుకుంటే భారత బౌలింగ్ విభాగంపై విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉంది.
అటు కివీస్ మిడిలార్డర్ నిలకడలేమితో సతమతమవుతోంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలంటే, జస్ప్రీత్ బుమ్రాను పవర్ప్లేలో, డెత్ ఓవర్లలో జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ లోయర్ ఆర్డర్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- పిచ్, వేదిక ప్రభావం..
{{/usCountry}}అటు కివీస్ మిడిలార్డర్ నిలకడలేమితో సతమతమవుతోంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలంటే, జస్ప్రీత్ బుమ్రాను పవర్ప్లేలో, డెత్ ఓవర్లలో జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ లోయర్ ఆర్డర్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- పిచ్, వేదిక ప్రభావం..
{{/usCountry}}అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ హై-స్కోరింగ్ థ్రిల్లర్గా నిలిచే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ విధ్వంసకర బ్యాటర్లు ఉండటం, ఇక్కడి పిచ్ ఎరుపు- నలుపు మట్టి మిశ్రమంతో కూడి ఉండటంతో పరుగులు పారడం ఖాయం. ఇది స్పిన్నర్లకు ప్రతికూల విషయం అనే చెప్పాలి! అయితే, ఆటగాళ్లను 'మంచు ప్రభావం' (డ్యూ) భయపెడుతోంది.
2024 నుంచి ఇక్కడ జరిగిన మ్యాచ్ల రికార్డులను పరిశీలిస్తే, ఛేజింగ్ చేసిన జట్లే 5-3 తేడాతో ఆధిక్యంలో ఉన్నాయి.
ఇక ఆదివారం సాయంత్రం 7 గంటలకు టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ప్రారంభంకానుంది. జియో హాట్స్టార్లో లైవ్ చూడవచ్చు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- ముఖాముఖి పోరు, ఫామ్ గైడ్..
టీ20 క్రికెట్లో భారత్ 16-11 తేడాతో న్యూజిలాండ్పై ఆధిక్యంలో ఉంది. మూడు మ్యాచ్లు టైగా ముగిశాయి. అయితే, టీ20 ప్రపంచకప్ల చరిత్రలో మాత్రం భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్ను ఓడించలేదు (0-3 రికార్డు)!
భారత్ తన చివరి ఐదు మ్యాచ్ల్లో నాలుగింటిలో గెలిచి (W, L, W, W, W) ఆత్మవిశ్వాసంతో ఉండగా, న్యూజిలాండ్ ప్రస్థానం ఎత్తుపల్లాలతో సాగింది (W, AB, W, L, W).
మరి ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- జట్టు ఎంపికలో సందిగ్ధత..
అభిషేక్ శర్మను తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సూర్యకుమార్ యాదవ్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో సూచించాడు. ఇషాన్ కిషన్తో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ జోడీగా రావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్, లేదా పేసర్ మహ్మద్ సిరాజ్ను తీసుకుంటారా అన్నది సస్పెన్స్గా మారింది.
కివీస్ జట్టులో జేమ్స్ నీషమ్ సెమీస్లో భారీగా పరుగులు ఇచ్చుకున్నా, శాంట్నర్ తన విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించేలా కనిపిస్తున్నాడు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- బుమ్రా వర్సెస్ డారిల్ మిచెల్..
ఈ మ్యాచ్లో అత్యంత కీలకమైన పోరు జస్ప్రీత్ బుమ్రా, డారిల్ మిచెల్ మధ్య ఉండబోతోంది. మిచెల్ ఈ టోర్నీలో ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. కానీ, గత జనవరిలో భారత్లో జరిగిన వన్డే సిరీస్లో అతను కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు, తనదైన రోజున మిచెల్ మెరుపులు ఎలా ఉంటాయో క్రికెట్ ఫ్యాన్స్కి తెలుసు. బుమ్రా బౌలింగ్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ, మిచెల్ గనుక ఒక్కసారి కుదురుకుంటే భారత్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- ఫ్యాన్స్కి ఆ ఒక్కటే ఆందోళన!
టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లాండ్పై టీమిండియా గెలుపుతో సంబరాలు చేసుకున్న చాలా మంది అభిమానులు.. ఫైనల్ అహ్మదాబాద్లో ఉందని గుర్తొచ్చి బాధపడ్డారు! ఈ స్టేడియంలో ఆడిన కీలక మ్యాచులు టీమిండియాకు కలిసి రావడం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓటమి ఫ్యాన్స్ని ఇంకా వెంటాడుతోంది. అందుకే సోషల్ మీడియాలో కూడా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇదే చోట ఈసారి గెలిచి టీమిండియా ఆ భయాలను తొలగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.