...
...
Next Story

Petrol Diesel price : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్​ ధరలు- 8 రోజుల్లో 3వసారి!

Petrol price Hyderabad : దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్​పై 87 పైసలు, లీటరు డీజిల్​పై 91 పైసలు పెరిగాయి. ఇంధన ధరలు పెరగడం 8 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం!

Published on: May 23, 2026, 07:18:22 IST
Advertisement

Petrol Diesel price increased : అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్​పై 87 పైసలు, లీటరు డీజిల్​పై 91పైసలు పెంచినట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. 8 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోవసారి.

మెట్రో నగరాల్లో పెట్రోల్​, డీజిల్ ధరల వివరాలు (మే 23 నాటికి)..

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్​ ధరలు.. (HT_PRINT)
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్​ ధరలు.. (HT_PRINT)

దిల్లీ: పెట్రోల్ లీటరు ధర రూ. 99.51 కి చేరగా.. డీజిల్ ధర రూ. 92.49 గా ఉంది.

ముంబై: ఇక్కడ ఇంధన ధరలు ఎప్పుడూ కాస్త ఎక్కువగా ఉంటాయి. పెట్రోల్ లీటరు రూ. 107.59, డీజిల్ రూ. 94.08 వద్ద విక్రయించబడుతోంది.

చెన్నై: పెట్రోల్ ధర లీటరు రూ. 104.51, డీజిల్ ధర రూ. 96.21 గా ఉంది.

కోల్‌కతా: పెట్రోల్ లీటరు రూ. 109.66 కు పెరగ్గా, డీజిల్ ధర రూ. 96.07 వద్ద ఉంది.

హైదరాబాద్​ : ఇక్కడ లీటరు పెట్రోల్​ ధర రూ. 112.81గాను, లీటరు డీజిల్​ ధర రూ. 100.94గా ఉంది.

విజయవాడ : ఇక్కడ లీటరు పెట్రోల్​ ధర రూ. 114.72గాను, లీటరు డీజిల్​ ధర రూ. 102.43గాను ఉన్నాయి.

8 రోజుల్లోనేే రూ. 5 పెరిగిన ధరలు..

చమురు సంస్థలు గత ఎనిమిది రోజుల్లోనే లీటరుపై దాదాపు రూ. 5 మేర భారాన్ని మోపాయి! మొదటగా మే 15న లీటరుకు రూ. 3 పెంచగా, ఆ తర్వాత మే 19న మరో 90 పైసలు పెంచాయి. ఇప్పుడు శనివారం (మే 23) చేసిన సవరణతో కలిపి మొత్తంగా వారంలోనే రూ. 5 వరకు ధరలు పెరిగాయి.

పెట్రోల్​, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

రూపాయి క్షీణత: భారతదేశం తన ముడిచమురు అవసరాలలో 88% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ దాదాపు 6% క్షీణించింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 95.6 వద్ద కొనసాగుతోంది.

నష్టాల్లోనే చమురు సంస్థలు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్​పీసీఎల్) సంస్థలు అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల రోజుకు దాదాపు రూ. 1,000 కోట్ల రెవెన్యూ నష్టాన్ని చవిచూస్తున్నట్లు పేర్కొన్నాయి. తాజా పెంపుతో కొంత ఒత్తిడి తగ్గినప్పటికీ.. రిటైల్ విక్రయాలపై ఇప్పటికీ లీటరుకు రూ. 9 నుంచి రూ. 12 వరకు నష్టాలు వస్తున్నట్లు ఇంధన రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెంపు తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ వార్తలతో సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం వాడే ఇంధన ధరలు రూ. 5 పెరగడం అంటేనే జేబుకు భారీగా చిల్లుపడినట్టు లెక్క! అలాంటిది రానున్న రోజుల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఇంకెంత పెరుగుతాయో అని నిత్యం భయంభయంగా బతుకుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe