Family Electric car : 543 కి.మీ రేంజ్ ఇచ్చే మారుతీ సుజుకీ ఈ విటారా ఎందుకు కొనాలి? 5 కారణాలు..
Maruti Suzuki e Vitara price : మారుతీ సుజుకీ ఈ విటారా కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రేంజ్ నుంచి ఫీచర్లు, ధర వరకు.. పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్గా తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుంది.
Maruti Suzuki e Vitara on road price : ఈ విటారా లాంచ్తో భారత దేశ ప్యూర్ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. మరి ఈ ఈవీని మీరు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! నెక్సా షోరూమ్ల ద్వారా లభిస్తున్న ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే ముందు కస్టమర్లు తెలుసుకోవాల్సిన ఐదు ప్రధాన అంశాలను ఇక్కడ చూసేయండి.

మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎందుకు కొనాలి? 5 కారణాలు..
1. మస్కులర్, ఫ్యూచరిస్టిక్ డిజైన్
మారుతీ సుజుకీ ఈ విటారా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారును గతంలో ప్రదర్శించిన 'eVX కాన్సెప్ట్' ఆధారంగా రూపొందించారు. దీని ఎక్స్టీరియర్ అత్యంత పవర్ఫుల్ అండ్ మస్కులర్ లుక్ను కలిగి ఉంటుంది.
ముందు భాగం: ఇందులో క్లోజ్డ్-అవుట్ ఫ్రంట్ బంపర్, వినూత్నమైన వై-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. బంపర్ కింది భాగం చూడటానికి బ్రెజ్జా కారును పోలి ఉంటుంది. దీని చార్జింగ్ పోర్టులను ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్స్పై అమర్చారు.
సైడ్ అండ్ రేర్ ప్రొఫైల్: పక్క భాగంలో కారుకు మరింత స్పోర్టీ లుక్ ఇచ్చేలా 18-ఇంచ్ స్టైలిష్ అల్లాయ్ వీల్స్ను ఇచ్చారు. వెనుక డోర్ హ్యాండిల్ను వినూత్నంగా సీ-పిల్లర్పై అమర్చారు.
2. పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్, 543 కిమీ రేంజ్
ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్యూవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంది:
49-కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది గరిష్టంగా 144 బీహెచ్పీ పవర్ను ఉత్పత్తి చేస్తుంది.
61-కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది మరింత పవర్ఫుల్గా ఉంటూ 171 బీహెచ్పీ పవర్ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండు వేరియంట్లు కూడా గరిష్టంగా 189 ఎన్ఎం టాప్ టార్క్ను అందిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో 4-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) ఆప్షన్ ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో మాత్రం ప్రస్తుతం కేవలం 2-వీల్ డ్రైవ్ (2డబ్ల్యూడీ) ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు సింగిల్ ఛార్జ్పై ఏకంగా 543 కిలోమీటర్ల (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
3. ప్రీమియం ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు
మారుతీ సుజుకీ ఇప్పటివరకు తయారు చేసిన కార్లలోనే ఇది అత్యంత లగ్జరీ, ప్రీమియం క్యాబిన్ను కలిగి ఉంది. ఇంటీరియర్లో డ్యూయల్-టోన్ కలర్ థీమ్ కంటికి ఇంపుగా ఉంటుంది.
ఇందులో 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.09-ఇంచ్ డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఒకే డిస్ప్లే ప్యానెల్గా అమర్చారు. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేని సపోర్ట్ చేస్తుంది.
కంఫర్ట్ కోసం ఫిక్స్డ్ గ్లాస్ సన్రూఫ్, మల్టీ-కలర్ అంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్, ఇన్ఫినిటీ బై హార్మన్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లను జోడించారు.
4. భద్రతలో నెంబర్ వన్: 5-స్టార్ భారత్ ఎన్సీఏపీ రేటింగ్
మారుతీ సుజుకీ కార్లపై ఉండే సేఫ్టీ అంచనాలను ఈ విటారా పూర్తిగా మార్చేసింది! భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో ఈ కారు పర్ఫెక్ట్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ను సొంతం చేసుకుంది.
భద్రత కోసం ఇందులో విప్లవాత్మక లెవెల్ 2 అడాస్ సాంకేతికతను అందించారు.
దీనితో పాటు 7 ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ కెమెరా, ఫ్రంట్-బ్యాక్ పార్కింగ్ సెన్సార్లను స్టాండర్డ్గా ఇచ్చారు.
5. ధరలు, ఆకర్షణీయమైన బీఏఏఎస్ స్కీమ్
మారుతీ సుజుకీ ఈ విటారా ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 15.99 లక్షలుగా ఉండగా, మిడ్-వేరియంట్ ధర రూ. 17.49 లక్షలు, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 20.01 లక్షల వరకు ఉంది.
అయితే, కస్టమర్లకు మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సంస్థ ఇందులో బీఏఏఎస్ (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా బ్యాటరీ ధరను మినహాయించి కారు ముందస్తు ఎక్స్-షోరూమ్ ధరను కేవలం రూ. 10.99 లక్షలకే పొందవచ్చు. దీనికోసం బ్యాటరీ వినియోగానికి అదనంగా కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున ఈఎంఐ లేదా రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


