దేశంలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీకేజీల అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఆయన దేశవ్యాప్త విద్యార్థి సదస్సులకు శ్రీకారం చుడుతున్నారు. రాజస్థాన్లోని ప్రసిద్ధ కోచింగ్ హబ్ 'కోటా' వేదికగా జూన్ 17న ఈ ఉద్యమం ప్రారంభం కానుంది.
సదస్సుల షెడ్యూల్ ఇదే

ఈ దేశవ్యాప్త ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
"పరీక్షల కుంభకోణాల వల్ల ప్రత్యక్షంగా నష్టపోయిన విద్యార్థులు, ఉద్యోగార్థులు, విద్యావేత్తలు, యువజన సంఘాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు రాహుల్ గాంధీ ఈ భారీ సదస్సులు నిర్వహిస్తున్నారు. జూన్ 17న కోటాలో ప్రారంభమయ్యే ఈ సదస్సులు, ఆ తర్వాత జూలై 10న అలహాబాద్, జూలై 11న పాట్నా, జూలై 14న ఢిల్లీలో జరగనున్నాయి" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
ఉధృతంగా డిజిటల్, క్యాంపస్ ప్రచారాలు
యువత ఆకాంక్షలను అవినీతికి, ప్రభుత్వ అసమర్థతకు, రాజకీయ ఉదాసీనతకు బలికానివ్వకూడదనే బలమైన పట్టుదలతో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులందరినీ ఏకం చేయడమే ఈ ఉద్యమ లక్ష్యం. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస వైఫల్యాలపై బాధ్యులను నిలదీసేందుకు, నష్టపోయిన యువత తమ అనుభవాలను పంచుకునేందుకు ఈ సదస్సులు ఒక వేదికగా నిలవనున్నాయి.
ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అనుబంధ విభాగాలైన ఎన్ఎస్యూఐ (NSUI), యూత్ కాంగ్రెస్తో పాటు పీసీసీ, డీసీసీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించనున్నాయి. కోచింగ్ సెంటర్లు, యూనివర్సిటీలు, పాఠశాలలు, యూత్ హబ్లలో విద్యార్థులతో నేరుగా మాట్లాడటంతో పాటు డిజిటల్ ఆహ్వానాలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, లైవ్ స్క్రీనింగ్ల ద్వారా ఈ ఉద్యమాన్ని భారీ ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
కాంగ్రెస్ ప్రధాన డిమాండ్లు ఇవే
రాహుల్ గాంధీ గతంలోనే లేవనెత్తిన డిమాండ్లను ఈ సదస్సుల ద్వారా వీధుల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో పోరాట చైతన్యాన్ని పెంచాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
{{/usCountry}}రాహుల్ గాంధీ గతంలోనే లేవనెత్తిన డిమాండ్లను ఈ సదస్సుల ద్వారా వీధుల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో పోరాట చైతన్యాన్ని పెంచాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
{{/usCountry}}"నీట్ (NEET) పరీక్షల వికేంద్రీకరణ జరగాలి, పరీక్షల ఫీజులను పూర్తిగా రద్దు చేయాలి. పేపర్ లీక్ ముఠాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు ఈ వైఫల్యాలకు బాధ్యత వహించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి" అని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రతిభకు రక్షణ కల్పించడం, అందరికీ సమాన అవకాశాలు అందించడం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలని ఆయన పేర్కొన్నారు.
నీట్-యూజీ 2026 రద్దు నేపథ్యం
ఇటీవల జరిగిన నీట్-యూజీ (NEET-UG 2026) పరీక్షల్లో పెద్ద ఎత్తున పేపర్ లీకేజీలు, పరిపాలనాపరమైన లోపాలు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడటంతో ఈ అంశం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో భరోసా నింపేందుకు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమైంది.