అది 2017, జనవరి.. కెప్టెన్సీకి ధోని పూర్తిగా వీడ్కోలు పలికిన సమయం. అప్పటికే మహేంద్ర సింగ్ ధోని ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఎదిగాడు. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఇండియాను నంబర్ వన్ టెస్టు టీమ్ గా నిలబెట్టాడు. అంతకంటే రెండేళ్ల క్రితమే టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. అయితే అప్పుడు ధోని కెప్టెన్సీని వదిలేయడం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ధోనిపై బీసీసీఐ ఫోర్స్

అప్పటికే టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనిపై పూర్తిగా కెప్టెన్సీ వదిలేయాలని బీసీసీఐ ఫోర్స్ తెచ్చింది. అప్పటి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్, సెలక్టర్ జతిన్ పరంజపే కలిసి ఓ షోలో ఈ విషయాలు వెల్లడించారు.
‘‘అప్పుడు మహి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను గంటసేపు బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. మేము (ఎంఎస్కే, నేను) ఒకరినొకరం చూసుకుంటూ ఉన్నాం. మేం అతని దగ్గరకు వెళ్లి ‘మహి, ముందుకు సాగడానికి ఇదే సరైన సమయం’ అని చెప్పాం. అప్పుడు ఎంఎస్కేతో ధోని.. 'అన్నా, ఇది సరైన నిర్ణయం. నా నుంచి మీకు ఏం కావాలో చెప్పండి’ అని అడిగాడు’’ అని ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షోలో జతిన్ తెలిపాడు.
అర్ధరాత్రి ఈ మెయిల్
‘‘మీరు కెప్టెన్సీ వదిలేసి, ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నారని మాకు రాతపూర్వకంగా తెలియజేయాలని ధోనీతో ఎంఎస్కే అన్నాడు. అలాగే చేస్తానని ధోని చెప్పాడు. ఆ రోజు అర్ధరాత్రి మాకు మెయిల్ వచ్చింది. కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నానని అందులో ధోని పేర్కొన్నాడు. దీంతో ఈ నిర్ణయాన్ని మేం ప్రకటించాం. ఇందుకు మేం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని జతిన్ సంచలన విషయాలు బయటపెట్టాడు.
కోహ్లీకి సపోర్ట్
ధోని వైదొలిగిన తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాడు. కోహ్లీకి ధోని ఫుల్ సపోర్ట్ ఇచ్చాడని జతిన్ చెప్పాడు. ‘‘కోహ్లీకి ధోని ఫుల్ సపోర్ట్ గా నిలబడ్డాడు. ‘టెన్షన్ వద్దు. నేను విరాట్ తో పూర్తిగా కలిసి పని చేస్తా. అతను నా బ్రదర్ లాంటివాడు. నేను అతని కోసం చేయాల్సినవన్నీ చేస్తా. నా అనుభవాన్ని అతనికి అందిస్తా. మేం మంచి జట్టును నిర్మిస్తాం’ అని ధోని మాతో చెప్పాడు’’ అని జతిన్ వెల్లడించాడు.
కెప్టెన్ గా ధోని
{{/usCountry}}ధోని వైదొలిగిన తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాడు. కోహ్లీకి ధోని ఫుల్ సపోర్ట్ ఇచ్చాడని జతిన్ చెప్పాడు. ‘‘కోహ్లీకి ధోని ఫుల్ సపోర్ట్ గా నిలబడ్డాడు. ‘టెన్షన్ వద్దు. నేను విరాట్ తో పూర్తిగా కలిసి పని చేస్తా. అతను నా బ్రదర్ లాంటివాడు. నేను అతని కోసం చేయాల్సినవన్నీ చేస్తా. నా అనుభవాన్ని అతనికి అందిస్తా. మేం మంచి జట్టును నిర్మిస్తాం’ అని ధోని మాతో చెప్పాడు’’ అని జతిన్ వెల్లడించాడు.
కెప్టెన్ గా ధోని
{{/usCountry}}కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీది అద్భుతమైన రికార్డు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ అతడు. ఇండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ధోని అందించాడు. అతని నాయకత్వంలో ఇండియా నంబర్ వన్ టెస్టు టీమ్ గానూ నిలిచింది.