...
...
Next Story

ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​తో ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు భారీ లభాలు! ఈ స్టాక్స్​తో ప్రాఫిట్స్​..

ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​ కుదరడంతో గిఫ్టీ నిఫ్టీ దాదాపు 800 పాయింట్ల లాభంలో ఉంది! అంటే ఫిబ్రవరి 3న దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాలతో ఓపెన్​ అవుతాయని అర్థం. మార్కెట్​ అప్డేట్స్​తో పాటు ఈ రోజు స్టాక్స్​ టు బై లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

Published on: Feb 3, 2026, 08:15:49 IST
Advertisement

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 944 పాయింట్లు పెరిగి 81,666 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 263 పాయింట్లు వృద్ధిచెంది 25,088 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 202 పాయింట్లు పెరిగి 58,619 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

నెలల తరబడి నిరీక్షణకు తెరదించుతూ.. ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​ కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక ప్రకటన చేశారు. ఫలితంగా మొత్తం మార్కెట్​లో సానుకూల సెంటిమెంట్​ కనిపిస్తోంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,832.46 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,446.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

భారత్​- అమెరికా వాణిజ్యం ఒప్పందం ప్రకటనతో దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఫుల్​ జోష్​ కనిపించనుంది. ఈరోజు స్టాక్​ మార్కెట్​ అతి భారీ లాభాలతో ఓపెన్​ అయ్యే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 800 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

భారత్​- అమెరికా వాణిజ్య ఒప్పందం- స్టాక్​ మార్కెట్​లకు ఎందుకు కీలకం?

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధించిన 25 శాతం 'రెసిప్రోకల్ టారిఫ్'ను అమెరికా పూర్తిగా రద్దు చేశారు. దీనితో పాటు సాధారణ దిగుమతి సుంకాలను కూడా 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అంటే, ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. భారత్‌పై ట్రంప్ విధించిన మొత్తం సుంకాల భారం 50 శాతం నుంచి ఒక్కసారిగా 18 శాతానికి తగ్గిపోనుంది.

ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్​లకు ఈ వాణిజ్య ఒప్పందం ఒక భారీ ఊరటనిచ్చే పరిణామమని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా స్టాక్ మార్కెట్ దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిస్తుందని, ఇలాంటి సానుకూల వార్తల వల్ల వచ్చే ప్రయోజనాలను మార్కెట్ ముందే అంచనా వేస్తుందని వారు పేర్కొన్నారు. దీని ప్రభావంతో మంగళవారం మార్కెట్​లు 'గ్యాప్-అప్' (భారీ లాభాలతో) ప్రారంభమయ్యే అవకాశం ఉందని, నిఫ్టీ 50 సూచీ త్వరలోనే 25,500 పాయింట్ల కీలక రెసిస్టెన్స్​ని అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​ కుదిరిన వేళ.. ప్రధానంగా ఫార్మా, ఆటో, ఐటీ, టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి ఎగుమతి ఆధారిత రంగాల షేర్లపై దృష్టి సారించాలని ఇన్వెస్టర్లకు నిపుణులు సూచిస్తున్నారు.

ఎస్‌ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "ఈ వాణిజ్య ఒప్పందం దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులకు (డీఐఐ), విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు (ఎఫ్​ఐ) ఒక స్పష్టతను ఇస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో అమ్మకాలకు మొగ్గు చూపిన ఎఫ్ఐఐలు, ఇకపై తమ ధోరణిని మార్చుకుని మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది. చైనా, దక్షిణ కొరియా మార్కెట్ల నుంచి పెట్టుబడులు భారత్ వైపు మళ్లవచ్చు. మంగళవారం మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమవుతుందని నేను భావిస్తున్నాను. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలు వెలువడ్డాక.. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు సరికొత్త రికార్డు స్థాయిలను తాకవచ్చు" అని వివరించారు.

గ్రీన్ పోర్ట్‌ఫోలియో పీఎంఎస్ కో-ఫౌండర్ దివం శర్మ ఈ ఒప్పందాన్ని "భారత మార్కెట్లకు లభించిన అతిపెద్ద సానుకూల అంశం"గా అభివర్ణించారు. "ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న నిరాశావాదం మాయమైపోతుంది. షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్​లు వేగంగా పుంజుకుంటాయి. అమెరికా నుంచి వచ్చే విదేశీ పెట్టుబడులకు భారత్ ఇప్పుడు ఒక వ్యూహాత్మక కేంద్రంగా మారుతుంది. దీనివల్ల రీటైల్ ఇన్వెస్టర్లు, డీఐఐల నుంచి పెట్టుబడుల ప్రవాహం పెరిగి మార్కెట్ పరుగులు తీస్తుంది," అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా ప్రయోజనం పొందే రంగాలను ఆయన ఇలా వివరించారు:

టెక్స్‌టైల్స్- అపెరల్స్ (దుస్తులు)

ఆటో విడిభాగాలు, ఇంజనీరింగ్

స్పెషాలిటీ కెమికల్స్

అగ్రో- సీఫుడ్ ఎగుమతులు

అమెరికాకు ఎగుమతులు చేసే ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ గూడ్స్ సంస్థలు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.05 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.54శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.56 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

హిందుస్థాన్​ పెట్రోలియం- బై రూ. 453, స్టాప్​ లాస్​ రూ. 437, టార్గెట్​ రూ. 485

ఐటీసీ హోటల్స్​- బై రూ. 185.65, స్టాప్​ లాస్​రూ. 179, టార్గెట్​ రూ. 199

డీఎల్​ఎఫ్​- బై రూ. 625, స్టాప్​ లాస్​ రూ. 610, టార్గెట్​ రూ. 642

బీఈఎల్​- బై రూ. 439, స్టాప్​ లాస్​ రూ. 430, టార్గెట్​ రూ. 454

ఎల్​టీఎఫ్​- బై రూ. 277, స్టాప్​ లాస్​ రూ. 272, టార్గెట్​ రూ. 290

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe