...
...
Next Story

సూర్యుని నక్షత్రంలోకి అంగారకుడు - జూలై 4 వరకు ఈ రాశులకు అఖండ విజయాలు, భారీ ధనలాభాలు…!

గ్రహాల కమాండర్ అంగారకుడు జూన్ 16న(ఇవాళ) సూర్యుడికి చెందిన కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్ర సంచారం వల్ల మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అఖండ విజయాలు, భారీ ధనలాభాలు కలగనున్నాయి.

Published on: Jun 16, 2026, 08:07:26 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నక్షత్ర మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నవగ్రహాలలో శౌర్యానికి, పరాక్రమానికి, శక్తికి కారకుడైన అంగారకుడు (కుజుడు) త్వరలోనే తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య పరిభాషలో గ్రహాల కమాండర్‌గా పిలిచే అంగారకుడు ప్రస్తుతం తన స్వరాశి అయిన మేష రాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటివరకు శుక్రుడికి చెందిన నక్షత్రంలో ఉన్న కుజుడు, ఇప్పుడు సూర్యుడికి చెందిన కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు.

సూర్యుని నక్షత్రంలోకి అంగారకుడు
సూర్యుని నక్షత్రంలోకి అంగారకుడు

హిందూ పంచాంగం ప్రకారం… జూన్ 16వ తేదీ(ఇవాళ) ఉదయం అంగారకుడు సూర్యుని నక్షత్రమైన కృత్తికలోకి అడుగుపెట్టాడు. ఈ నక్షత్రంలో జూలై 4వ తేదీ వరకు కుజుడు కొనసాగుతాడు. సూర్యుడు, అంగారకుడు ఇద్దరూ అగ్ని తత్వ గ్రహాలు కావడం వల్ల ఈ సంచారం విశ్వంలో భారీ మార్పులకు కారణం కానుంది. ముఖ్యంగా సూర్యుడి కృత్తికా నక్షత్రంలో అంగారకుడి ప్రవేశం కొన్ని రాశిచక్రాల వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇవ్వబోతోంది.

మేష రాశి :

అంగారకుడి నక్షత్ర సంచారం మేష రాశి జాతకులకు అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మీలో శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం విపరీతంగా పెరుగుతాయి. ఏ పనైనా చాలా వేగంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పైఅధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలంలో సానుకూల అవకాశాలు లభిస్తాయి. ఎలాంటి సవాళ్లనైనా నిర్భయంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా, స్థిరంగా మారుతుంది. కుటుంబం నుండి ఏదైనా ఒక సానుకూల వార్తను వింటారు.

వృశ్చిక రాశి :

ధనుస్సు రాశి జాతకులకు అంగారకుడి సంచారం పూర్తిగా సానుకూల మార్పులను తీసుకువస్తుంది. వ్యాపార విస్తరణకు, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. నూతన పెట్టుబడి మార్గాల వైపు మీరు అడుగులు వేస్తారు. కార్యాలయంలో సహోద్యోగులతో పాటు బాస్ నుంచి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీ పనితీరు మెరుగవుతుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. రాబడి మార్గాలు పెరగడం వల్ల ఆర్థికంగా మంచి పొదుపు చేయగలుగుతారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks