Hyderabad MMTS trains cancelled : ఎంఎంటీఎస్ (MMTS) రైలు సర్వీసులకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. రైల్వే నెట్వర్క్ నిర్వహణ, కొన్ని కార్యాచరణ కారణాల వల్ల నగరంలోని పలు కీలక మార్గాల్లో నడిచే కొన్ని నిర్దిష్ట ఎంఎంటీఎస్ రైళ్లను జూన్ 10వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

నిత్యం వేలాది మంది ప్రయాణించే ఐటీ కారిడార్ మార్గాలతో పాటు ఇతర ఉప నగరాలను అనుసంధానించే రైళ్లు ఈ జాబితాలో ఉండటంతో ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను ముందే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏయే రైళ్లు ఏయే స్టేషన్ల మధ్య రద్దయ్యాయో ఇక్కడ తెలుసుకోండి…
పాక్షికంగా రద్దు - ఎంఎంటీఎస్ రైళ్ల పూర్తి వివరాలు:
- ఫలక్నుమా - రామచంద్రాపురం (రైలు నంబర్ 47155) : ఈ రైలు సాధారణంగా పలక్నుమా నుంచి రామచంద్రాపురం వరకు నడుస్తుంది. జూన్ 10వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఈ రైలును లింగంపల్లి - రామచంద్రాపురం స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అంటే ఈ మూడు రోజులు ఈ రైలు ఫలక్నుమా నుంచి బయలుదేరి కేవలం లింగంపల్లి వరకే నడుస్తుంది.
- రామచంద్రాపురం - హైదరాబాద్ (రైలు నంబర్ 47142) : ఈ రైలు రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తుంది. జూన్ 10 నుంచి జూన్ 12 వరకు ఈ సర్వీసును రామచంద్రాపురం - లింగంపల్లి మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దీనివల్ల ఈ రైలు రామచంద్రాపురం నుంచి కాకుండా, నేరుగా లింగంపల్లి స్టేషన్ నుంచే హైదరాబాద్కు బయలుదేరుతుంది.
- ఘట్ కేసర్ - రామచంద్రాపురం (రైలు నంబర్ 47253) : మేడ్చల్, మల్కాజ్గిరి పరిసరాల మీదుగా ఐటీ హబ్ను కలిపే ఈ రైలు జూన్ 10, 11 తేదీల్లో సనత్నగర్ - రామచంద్రాపురం మధ్య నడవదు. ఆయా రోజుల్లో ఈ సర్వీస్ కేవలం ఘటకేసర్ నుంచి సనత్నగర్ వరకే పరిమితం కానుంది.
- రామచంద్రాపురం - ఘట్ కేసర్ (రైలు నంబర్ 47254) : తిరుగు ప్రయాణంలో నడిచే ఈ రైలును కూడా జూన్ 10, 11 తేదీల్లో రామచంద్రాపురం - సనత్నగర్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ సర్వీస్ నిర్దేశిత రోజుల్లో సనత్నగర్ స్టేషన్ నుంచే ప్రారంభమై ఘటకేసర్కు చేరుకుంటుంది.
ఈ తాత్కాలిక మార్పుల వల్ల ముఖ్యంగా లింగంపల్లి, సనత్నగర్, రామచంద్రాపురం, ఘట్ కేసర్ మార్గాల్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. రైళ్ల రాకపోకల సమయాలు, మరిన్ని తాజా వివరాల కోసం ప్రయాణికులు అధికారిక వెబ్సైట్ లేదా రైల్వే హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
{{/usCountry}}ఈ తాత్కాలిక మార్పుల వల్ల ముఖ్యంగా లింగంపల్లి, సనత్నగర్, రామచంద్రాపురం, ఘట్ కేసర్ మార్గాల్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. రైళ్ల రాకపోకల సమయాలు, మరిన్ని తాజా వివరాల కోసం ప్రయాణికులు అధికారిక వెబ్సైట్ లేదా రైల్వే హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
{{/usCountry}}