ఐఆర్సీటీసీ అందించే టూర్ ప్యాకేజీలు మిడిల్ క్లాస్ బడ్జెట్లో దొరుకుతాయి. అక్టోబర్ 2వ తేదీన అరుణోదయ అరుణాచల్ ఎక్స్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ యాత్ర ఉంటుంది. దిరంగ్, గౌహతి, తవాంగ్, తేజ్పూర్లాంటి ప్రాంతాలకు చుట్టేసి రావొచ్చు. మెుత్తం 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. విమానంలో ప్రయాణిస్తారు.
మెుదటి రోజు

ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి గౌహతి చేరుకుంటారు. అక్కడి నుండి తేజ్పూర్ (190 కి.మీ)కు ప్రయాణం ఉంటుంది. హోటల్లో చెక్ ఇన్ ఉంటుంది. తేజ్పూర్లో రాత్రి భోజనం, బస చేస్తారు..
రెండో రోజు
అల్పాహారం చేసి హోటల్ నుండి చెక్-అవుట్ అవుతారు. దిరాంగ్ (200 కి.మీ)కు బయలుదేరుతారు. మార్గమధ్యలో టిప్పి ఆర్కిడ్ సెంటర్, వేడి నీటి బుగ్గలను సందర్శిస్తారు. మధ్యాహ్నం బొమ్డిలా బౌద్ధ మఠాన్ని సందర్శిస్తారు. దిరాంగ్లో రాత్రి బస చేస్తారు.
మూడో రోజు
దిరాంగ్లో అల్పాహారం చేసి హోటల్ నుండి చెక్-అవుట్ అవుతారు. తవాంగ్ (130 కి.మీ)కు బయలుదేరుతారు. మార్గమధ్యలో సెలా పాస్, జశ్వంత్ గఢ్ వార్ మెమోరియల్, జంగ్ జలపాతాలను సందర్శిస్తారు. తర్వాత తవాంగ్ చేరుకుని.. హోటల్లో బస చేస్తారు.
నాలుగో రోజు
హోటల్లో అల్పాహారం చేసి షోంగా-త్సర్ సరస్సును (దీనిని మాధురి సరస్సు అని కూడా పిలుస్తారు) సందర్శిస్తారు. ఆ తర్వాత బుమ్లా పాస్కు వెళ్తారు(ఈ సందర్శన భారత సైన్యం అనుమతి, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది; తవాంగ్లోని డీసీ కార్యాలయంలో ప్రత్యేక అనుమతులు జారీ చేస్తారు). తవాంగ్లో రాత్రి బస చేస్తారు.
ఐదో రోజు
తవాంగ్లో హోటల్లో అల్పాహారం చేసి పాత తవాంగ్ మఠాన్ని సందర్శిస్తారు. తరువాత ఉర్జెల్లింగ్ మఠం, తవాంగ్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. రాత్రి తవాంగ్లో బస ఉంటుంది.
ఆరో రోజు
{{/usCountry}}తవాంగ్లో హోటల్లో అల్పాహారం చేసి పాత తవాంగ్ మఠాన్ని సందర్శిస్తారు. తరువాత ఉర్జెల్లింగ్ మఠం, తవాంగ్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. రాత్రి తవాంగ్లో బస ఉంటుంది.
ఆరో రోజు
{{/usCountry}}హోటల్లో అల్పాహారం చేసి.. చెక్ అవుట్ చేసి దిరాంగ్కు బయలుదేరుతారు(130 కి.మీ.). దిరాంగ్ మఠాన్ని సందర్శిస్తారు. హోటల్లో చెక్ ఇన్ చేసి.. రాత్రి దిరాంగ్లో బస చేస్తారు.
ఏడో రోజు
దిరాంగ్లో హోటల్లో అల్పాహారం చేసి చెక్ అవుట్ చేసి గౌహతికి బయలుదేరుతారు(300 కి.మీ.). హోటల్లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రి గౌహతిలో బస చేస్తారు.
ఎనిమిదో రోజు
ఉదయాన్నే అల్పాహారం చేసి చెక్ అవుట్ చేయండి. కామాఖ్య ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ విమానం ఎక్కడానికి గౌహతి విమానాశ్రయంలో దింపుతారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
టూర్ బడ్జెట్
సింగిల్ ఆక్యూపెన్సీ రూ. 75,530, డబుల్ ఆక్యూపెన్సీ రూ.56,490, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.53,500, పిల్లలు - పడకతో సహా (5-11 ఏళ్లు) రూ.42420, పిల్లలు - పడక లేకుండా (5-11 ఏళ్లు) రూ.39440, పిల్లలు - పడక లేకుండా(2-4 ఏళ్లు) రూ.23420గా ప్యాకేజీ ధరలు నిర్ణయించారు.
మరిన్ని వివరాల కోసం www.irctctourism.com సందర్శించండి.