IRCTC Chardham Yatra Package : హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రను దర్శించుకోవాలని ఆకాంక్షించే భక్తుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఉత్తరాఖండ్లోని దివ్య క్షేత్రాలను సందర్శించేలా 'చార్ ధామ్ యాత్ర ఎక్స్ - హైదరాబాద్' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది.

ఈ ప్యాకేజీలో మొత్తం 10 రాత్రులు, 11 రోజులుగా ఉంటుంది. 2026 మే నెలలో 17, 18, 28వ తేదీల్లో జర్నీలు ఉంటాయి. ఈ తేదీలకు అనుగుణంగా భక్తులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్ చేరుకుని….. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో యాత్రను కొనసాగిస్తారు.
హైదరాబాద్ నుంచి ఉదయం 08:45 గంటలకు బయలుదేరే విమానం (6E 422) ఉదయం 11:15 గంటలకు డెహ్రాడూన్ చేరుకుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు డెహ్రాడూన్ నుంచి సాయంత్రం 05:45 గంటలకు బయలుదేరి రాత్రి 08:15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
టూర్ షెడ్యూల్ వివరాలు:
ఈ పర్యటనలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి నాలుగు ప్రధాన ధామాలతో పాటు హరిద్వార్, రుషికేశ్ వంటి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు.
- మొదటి రోజు: హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ చేరుకుని, అక్కడి నుంచి బార్కోట్ ప్రయాణం.
- రెండవ రోజు: జంకీచట్టి మీదుగా యమునోత్రి దర్శనం.
- మూడవ రోజు: బార్కోట్ నుంచి ఉత్తరకాశీ ప్రయాణం, దారిలో ప్రకాశేశ్వర్ మహాదేవ్ ఆలయ సందర్శన.
- నాలుగవ రోజు: గంగోత్రి ధామం సందర్శన మరియు పూజా కార్యక్రమాలు.
- ఐదు, ఆరు రోజులు: గుప్తకాశీ మీదుగా కేదార్నాథ్ చేరుకోవడం. కేదార్నాథ్లో సాయంత్రం హారతి దర్శనంతో పాటు బస.
- ఏడవ రోజు: కేదార్నాథ్ నుంచి గౌరీకుండ్ మీదుగా తిరిగి గుప్తకాశీకి చేరుకోవడం.
- ఎనిమిదవ రోజు: బద్రీనాథ్ ప్రయాణం మరియు ఆలయ సందర్శన.
- తొమ్మిదవ రోజు: బద్రీనాథ్ అభిషేకం మరియు భారత చివరి గ్రామమైన 'మాన' సందర్శన.
- పది, పదకొండ రోజులు: రుద్రప్రయాగ, హరిద్వార్ గంగా హారతి దర్శనం ముగించుకుని తిరిగి డెహ్రాడూన్ కు వస్తారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ యాత్రలో భక్తులు ఎంచుకునే వసతిని బట్టి ధరలు మారుతుంటాయి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 91,610, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 79,440, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 74,430గా నిర్ణయించారు.
{{/usCountry}}ఈ యాత్రలో భక్తులు ఎంచుకునే వసతిని బట్టి ధరలు మారుతుంటాయి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 91,610, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 79,440, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 74,430గా నిర్ణయించారు.
{{/usCountry}}ఈ ప్యాకేజీలో విమాన టికెట్లు, 10 రాత్రుల వసతి (డెహ్రాడూన్/హరిద్వార్లో హోటల్ మరియు కేదార్నాథ్లో ధర్మశాల వసతి), బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో రవాణా సౌకర్యం ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ , ఒక టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. అయితే…. కేదార్నాథ్ వెళ్లేందుకు హెలికాప్టర్, గుర్రం (Pony) లేదా పల్లకీ (Palki) ఖర్చులను యాత్రికులే స్వయంగా భరించాల్సి ఉంటుంది. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెెళ్లి ఈ ప్యాకేజీ వివరాలను తెలుసుకోవటంతో పాటు నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే 040-27702407 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.