Telangana Voter List Revision : తెలంగాణలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. జూన్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక ఇంటింటి సర్వే….. జూన్ 27 నాటికి రాష్ట్రంలోని మొత్తం ఇళ్లలో 30 శాతానికి పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు వివరాలను వెల్లడించారు.

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి.సుదర్శన్ రెడ్డి కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 25 నుంచి జూన్ 27 వరకు జరిగిన ఈ మూడు రోజుల సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,02,75,000 ఎన్యుమరేషన్ (ఓటర్ల వివరాల నమోదు) ఫారాలను పంపిణీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని 30.08 శాతం ఇళ్లను బూత్ స్థాయి అధికారులు సందర్శించి…. ఓటర్ల సమాచారాన్ని సేకరించారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 36,000 మంది బూత్ స్థాయి అధికారులను ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. వీరంతా నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలను అందిస్తున్నారు. అలాగే ఓటర్లు తమ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా పూరించడంలో తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
జూలై 24 వరకు గడువు….
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఈ సర్వే గడువుపై స్పష్టతనిచ్చారు. ఈ ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియ జూలై 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి నుంచి వచ్చిన డేటాను క్రోడీకరించి…. జూలై 31వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ముసాయిదా విడుదల అనంతరం ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, క్లెయిములను స్వీకరిస్తారు. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అక్టోబర్ 1వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ( ECI ) జారీ చేసిన కఠినమైన మార్గదర్శకాలు, నిబంధనలకు కట్టుబడి ఈ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా….. జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.
{{/usCountry}}కేంద్ర ఎన్నికల సంఘం ( ECI ) జారీ చేసిన కఠినమైన మార్గదర్శకాలు, నిబంధనలకు కట్టుబడి ఈ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా….. జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.
{{/usCountry}}రాష్ట్రంలో గత ఏడాది (2025) నాటి లెక్కల ప్రకారం మొత్తం 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది జూన్ 20 నాటికి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా దాదాపు 2.38 కోట్ల మంది ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 90 లక్షల మంది ఓటర్ల వివరాలలో రకరకాల వ్యత్యాసాలు, తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఒకే ఓటరుకు రెండు చోట్ల ఓటు ఉండటం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఫొటోలు సరిగా లేకపోవడం వంటి సమస్యలను ఈ ఇంటింటి సర్వే ద్వారా బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తున్నారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు కోరుతున్నారు.