మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో ములుగు వైపు వెళ్లే రూట్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో… దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

{{^htLoading}} {{/htLoading}}
ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నడుస్తాయి. ఈ ట్రైన్స్… సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్ కాగజ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం జాతర ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్ రిజర్వుడ్ జనసాధారణ రైళ్లని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. ఈ రైళ్లలో సెకండ్ జనరల్ క్లాస్ కోచులుంటాయని పేర్కొంది.
{{^usCountry}}
- ఈనెల 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో సికింద్రాబాద్ -మంచిర్యాల- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్-మంచిర్యాల రైలు(ట్రైన్ నెంబర్ 07495) ఉదయం 5.45 గంటలకు సికిందరాబాద్లో బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటుంది. తిరిగి ఇదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల-సికింద్రాబాద్ రైలు ( ట్రైన్ నెంబర్ 07496) మంచిర్యాల నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజిపేటకు…. రాత్రి 10.10 గంటలకు సికిందరాబాద్ చేరుకుంటుంది.
- చర్లపల్లి, ఘట్ కీసర్, బీబీ నగర్, భువనగిరి, ఆలేరు, పెంబర్తి, రఘునాథ్ పల్లి, కాజీపేట, వరంగల్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రాఘువపురం, రామగుండం, పెద్దంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
- ఇక జనవరి 29, 31 తేదీల్లో సికింద్రారాబాద్-సిరిపుర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (07497/07498) మధ్య మేడారం ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి… మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్ కాగజ్నగర్ చేరుకుంటాయి. అదే రోజు మద్యాహ్నం 2.30 గంటలకు సిరిపూర్ కాగజ్నగర్లో బయలుదేరి… రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయి. ఈ రైళ్లు… మౌలాలి, ఘట్ కీసర్, బీబీ నగర్, కాజీపేటతో పాటు మరికొన్ని స్టేషన్లలో ఆగుతాయి.
- మరోవైపు నిజామాబాద్- వరంగల్ మధ్య ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు నిజామాబాద్లో ఉదయం 7.05 గంటలకు బయలుదేరి… మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్లో బయలుదేరి అదే రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటాయి.
- అంతేకాకుండా ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం-కాజీపేట మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఖమ్మంలో ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరే ట్రైన్… మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి. ఇక ఆదిలాబాద్-కాజీపేట (ట్రైన్ నెంబర్ 07501) మధ్య ప్రత్యేక రైలు ఉంటుంది. జనవరి 28, 29 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
{{#usCountry}}
- ఈనెల 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో సికింద్రాబాద్ -మంచిర్యాల- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్-మంచిర్యాల రైలు(ట్రైన్ నెంబర్ 07495) ఉదయం 5.45 గంటలకు సికిందరాబాద్లో బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటుంది. తిరిగి ఇదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల-సికింద్రాబాద్ రైలు ( ట్రైన్ నెంబర్ 07496) మంచిర్యాల నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజిపేటకు…. రాత్రి 10.10 గంటలకు సికిందరాబాద్ చేరుకుంటుంది.
- చర్లపల్లి, ఘట్ కీసర్, బీబీ నగర్, భువనగిరి, ఆలేరు, పెంబర్తి, రఘునాథ్ పల్లి, కాజీపేట, వరంగల్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రాఘువపురం, రామగుండం, పెద్దంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
- ఇక జనవరి 29, 31 తేదీల్లో సికింద్రారాబాద్-సిరిపుర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (07497/07498) మధ్య మేడారం ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి… మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్ కాగజ్నగర్ చేరుకుంటాయి. అదే రోజు మద్యాహ్నం 2.30 గంటలకు సిరిపూర్ కాగజ్నగర్లో బయలుదేరి… రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయి. ఈ రైళ్లు… మౌలాలి, ఘట్ కీసర్, బీబీ నగర్, కాజీపేటతో పాటు మరికొన్ని స్టేషన్లలో ఆగుతాయి.
- మరోవైపు నిజామాబాద్- వరంగల్ మధ్య ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు నిజామాబాద్లో ఉదయం 7.05 గంటలకు బయలుదేరి… మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్లో బయలుదేరి అదే రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటాయి.
- అంతేకాకుండా ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం-కాజీపేట మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఖమ్మంలో ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరే ట్రైన్… మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి. ఇక ఆదిలాబాద్-కాజీపేట (ట్రైన్ నెంబర్ 07501) మధ్య ప్రత్యేక రైలు ఉంటుంది. జనవరి 28, 29 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}