తమిళ చిత్ర పరిశ్రమలో తల అజిత్ కుమార్, దళపతి విజయ్ అభిమానుల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అజిత్ 2011 నాటి సంచలన చిత్రం ‘మంగాత్తా’ (తెలుగులో గ్యాంబ్లర్) రీ రిలీజ్ సందర్భంగా ఈ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. థియేటర్ లోపల జరిగిన ఒక దాడి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
జెండా ఊపినందుకు చొక్కా చింపి మరీ దాడి!

కారాకుడిలోని పాండియన్ సినిమాస్లో ‘మంగాత్తా’ స్క్రీనింగ్ జరుగుతుండగా ఒక చేదు ఘటన చోటుచేసుకుంది. అజిత్ ఫ్యాన్స్ అంతా సినిమాను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక విజయ్ ఫ్యాన్ తన దళపతి కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) జెండాను థియేటర్ లోపల ఊపాడు.
అజిత్ సినిమా థియేటర్లో విజయ్ టీవీకే జెండా పట్టుకుని దళపతి అభిమాని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అజిత్ ఫ్యాన్స్ విజయ్ అభిమానిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అతని చొక్కా చింపివేసి, థియేటర్ బయటకు గెంటేశారు.
వీడియోలు వైరల్
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. "ఒక స్కూల్ అబ్బాయిలా ఉన్న వ్యక్తిపై ఇలా దాడి చేయడం దారుణం" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
"విజయ్ అభిమానుల తిక్కను అజిత్, రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కుదర్చగలరు" అంటూ మరొకరు వీడియోను పోస్ట్ చేశారు. "ఎంత అభిమానం ఉన్న మరొక హీరో సినిమా సమయంలో జెండా ఊపడం కరెక్ట్ కాదు కదా" అని మరొక నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
'గిల్లి' రికార్డు గల్లంతు.. బాక్సాఫీస్ వద్ద 'మంగాత్తా' జోరు
ఇదిలా ఉంటే, ఇలా వరుస గొడవలు ఒకవైపు ఉన్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం అజిత్ తన సత్తా చాటారు. రీ రిలీజ్ చిత్రాల్లో ఇప్పటివరకు విజయ్ నటించిన ‘గిల్లి’ (రూ. 4 కోట్లు) పేరిట ఉన్న ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును ‘మంగాత్తా’ తుడిచిపెట్టేసింది.
{{/usCountry}}ఇదిలా ఉంటే, ఇలా వరుస గొడవలు ఒకవైపు ఉన్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం అజిత్ తన సత్తా చాటారు. రీ రిలీజ్ చిత్రాల్లో ఇప్పటివరకు విజయ్ నటించిన ‘గిల్లి’ (రూ. 4 కోట్లు) పేరిట ఉన్న ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును ‘మంగాత్తా’ తుడిచిపెట్టేసింది.
{{/usCountry}}మొదటి రోజున మంగాత్తా (గ్యాంబ్లర్) సుమారు రూ. 4.1 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం తమిళనాడులోనే రూ. 3.75 కోట్ల గ్రాస్ సాధించి, అజిత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.
విజయ్ ‘జన నాయకన్’ విడుదలకు బ్రేక్!
మరోవైపు విజయ్ చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న ‘జన నాయగన్’ సెన్సార్ చిక్కుల్లో పడింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ బోర్డు (CBFC) నుంచి అభ్యంతరాలు ఎదురవడంతో వాయిదా పడింది. ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టులో జనవరి 27న విచారణ జరగనుంది. త్వరలోనే ఈ చిత్రానికి లైన్ క్లియర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.