OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హారర్ కామెడీ సిరీస్- 40 బొమ్మలు, 40 దెయ్యాలు- ప్రతి వారం 4 ఎపిసోడ్స్- తెలుగులో రిలీజ్!
Ali Baba Aur 40 Bhoot OTT Release Today: లాజిక్ మాత్రమే నమ్మే న్యూరో సైకాలజిస్ట్, ఆత్మల ఉనికిని నమ్మే లోకల్ పోలీస్ ఆఫీసర్.. వీరిద్దరూ కలిసి 40 దెయ్యాల మిస్టరీని ఛేదిస్తే ఎలా ఉంటుంది? హారర్, కామెడీ కలగలిసి తెలుగులో వచ్చిన కొత్త వెబ్ సిరీస్ అలీ బాబా ఔర్ 40 భూత్ ఓటీటీ రిలీజ్ వివరాలు ఇక్కడ చూద్దాం.
Ali Baba Aur 40 Bhoot OTT Streaming Today: మిస్టరీ, హర్రర్ అంశాలకు కాస్త హాస్యం తోడైతే వచ్చే థ్రిల్లే వేరు. డిజిటల్ తెరపై అలాంటి సరికొత్త వినోదాన్ని పంచేందుకు ఇవాళ (సెప్టెంబర్ 11) ఒక క్రేజీ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రతీ విషయానికి విజ్ఞాన శాస్త్ర ఆధారాలను మాత్రమే వెతికే ఒక సైకాలజిస్ట్, దెయ్యాలు-ఆత్మలు ఉన్నాయని గట్టిగా నమ్మే ఒక చిన్న ఊరి సీఐ కలిసి చేసే భయానక అన్వేషణ ఆధారంగా 'అలీ బాబా ఔర్ 40 భూత్' (Ali Baba aur 40 Bhoot) అనే వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది.
కథ నేపథ్యం ఏంటి?
మధ్య భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న జానపద కథలు, రహస్య ఆధారంగా ఈ కథను మలిచారు. ఆశా నేగి ‘అలీషా అలియాస్ అలీ’ అనే న్యూరో-సైకాలజిస్ట్ పాత్ర పోషించగా, విశాల్ వశిష్ట ‘బాబారావ్ దేశ్ముఖ్ అలియాస్ బాబా’ అనే ధైర్యవంతుడైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
హఠాత్తుగా మాయమైన తన తండ్రి ఆచూకీ కోసం వెతుకుతూ అలీ ఒక మాయా ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఆమెకు స్థానిక పోలీస్ అధికారి బాబా పరిచయమవుతాడు. సైన్స్తో ప్రతీ దాన్ని విశ్లేషించే అలీ ఒకవైపు, దెయ్యాల ఉనికిపై నమ్మకం ఉన్న బాబా మరోవైపు ఉంటారు.
40 దెయ్యాలను ఎదుర్కొనే జంట
పూర్తిగా భిన్నమైన ఆలోచనా ధోరణులు కలిగిన ఈ ఇద్దరూ కలిసి ఒక శతాబ్దాల నాటి రహస్యాన్ని ఛేదించే క్రమంలో 40 వేర్వేరు దెయ్యాలను ఎదుర్కొంటారు. ప్రతీ దెయ్యానికి ఒక నేపథ్యం, దానికి ముడిపడి ఉన్న రహస్యం ఉండటంతో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
అలాగే, ఆ 40 దెయ్యాలు 40 బొమ్మల్లో ఉంటాయి. ఒక్కో బొమ్మ నుంచి వచ్చే కథగా 40 ఎపిసోడ్లను ప్లాన్ చేశారు. ఇప్పటివరకు అలీబాబా 40 దొంగల కథ విన్నాం. ఇదే క్రమంలో 40 అనే నెంబర్ కథకు కొత్తగా దెయ్యాలతో సాగే హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్గా ఈ సిరీస్ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
అలీ బాబా ఔర్ 40 భూత్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇలాంటి అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. జియో హాట్స్టార్లో సెప్టెంబర్ 11 నుంచి అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం వంటి నాలుగు భాషల్లో హాట్స్టార్లో అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీ రిలీజ్ అయింది.
అయితే, మొత్తం 40 ఎపిసోడ్స్ ఉన్న ఈ ఓటీటీ సిరీస్ నుంచి ఇవాళ మాత్రం కేవలం నాలుగింటిని రిలీజ్ చేశారు. ప్రతీ శుక్రవారం 4 కొత్త ఎపిసోడ్లను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఇలా 10 వారాల పాటు అలీబాబా ఔర్ 40 భూత్ సిరీస్ సరికొత్తగా ఓటీటీ ప్రీమియర్ కానుందన్నమాట.
హీరో హీరోయిన్ల కామెంట్స్
అలీ బాబా ఔర్ 40 భూత్ ఓటీటీ రిలీజ్ సందర్భంగా తన పాత్ర విశేషాలను హీరోయిన్ ఆశా నేగి పంచుకుంది. "నేను ఇప్పటివరకు చేసిన పాత్రలకు అలీ పూర్తిగా భిన్నమైనది. ప్రతీ దానికి ఒక లాజిక్ కారణం వెతికే ఆలోచనా విధానం ఉన్న అమ్మాయి. అలాంటి వ్యక్తి ఒక అలౌకిక ప్రపంచంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో ఇందులో చూపించాం" అని ఆశా నేగి చెప్పుకొచ్చింది.
అలాగే, హీరో విశాల్ వశిష్ట మాట్లాడుతూ.. "బాబా పాత్రను పోషించడం నాకు మంచి ఉపశమనాన్ని ఇచ్చింది. మానసిక ఒత్తిడిని దూరం చేసేలా అతడి పాత్రలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ, వినోదం ఉంటాయి" అని పేర్కొన్నారు.
జియో హాట్స్టార్ ఓటీటీలో
భువనేష్ శ్రీవాస్తవ క్రియేటర్గా వ్యవహరించిన ఈ హారర్ కామెడీ సిరీస్లో ఆశా నేగి, విశాల్ వశిష్టలతో పాటు రామ్దీప్ యాదవ్, మీనాక్షి సేఠీ, ఆశిష్ కౌల్, ఉజ్వల్ చోప్రా, మానసి సెహగల్, మృదుల్ దాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. థ్రిల్తో పాటు నవ్వులు కోరుకునే ఓటీటీ ప్రియులకు జియో హాట్స్టార్ ఓటీటీలో అలీబాబా ఔర్ 40 భూత్ మంచి ఎంటర్టైనర్గా నిలవనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


