Alia Bhatt Counter To Student Says Gareeb Aadmi Alpha: బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ సమయస్ఫూర్తికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. తను నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) ప్రమోషన్స్ కోసం రాజస్థాన్ వెళ్లిన అలియా, అక్కడ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
నవ్వులతో నిండిపోయిన స్టేజ్

ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా క్రేజీ స్టైల్ను ఫాలో అవుతూ అలియా ఇచ్చిన కౌంటర్తో స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. రాజస్థాన్లోని జేఈసీఆర్సీ (JECRC) ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులతో అలియా భట్ ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఓ స్టూడెంట్ ఆలియాను మైక్లో ఒక ప్రశ్న అడిగారు. "సోషల్ మీడియాలో ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నడిచే 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోకి వెళ్లడానికి మీ మేనేజ్మెంట్, మీరు ఎలా ఒప్పుకున్నారు?" అని ప్రశ్నించాడు.
డబ్బు కామెంట్
అలియా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేలోపే.. ఆడియన్స్లో కూర్చున్న మరో స్టూడెంట్ గట్టిగా "పైసా (డబ్బు)!" అంటూ అరిచాడు. కేవలం భారీ రెమ్యునరేషన్ కోసమే అలియా ఆ ఓటీటీ షోకి వెళ్లారనే అర్థంలో అతను ఆ కామెంట్ చేశాడు.
సమయ్ రైనా డైలాగ్తో అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్
ఆ కామెంట్ వినగానే అలియా భట్ అస్సలు కంగారు పడలేదు. మొదట నవ్వేసిన ఆమె, వెంటనే మైక్ అందుకుని గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఇంతకీ ఆ మాట అన్నది ఎవరు? బహుశా ఎవరో ఒక పేదవాడు (గరీబ్ ఆద్మీ) అనుకుంటా" అని అలియా నవ్వుతూ ఎద్దేవా చేశారు. ఈ పంచ్ డైలాగ్ వినగానే అక్కడున్న స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా ఈలలు, కేకలతో కాలేజీ కాంపౌండ్ను హోరెత్తించారు.
ఈ మూమెంట్కు సంబంధించిన వీడియోను సదరు యూనివర్సిటీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 'ఇండియాస్ గాట్ లేటెంట్' అధికారిక ఖాతా దీనిపై స్పందిస్తూ "టూ గుడ్" అని కామెంట్ చేసింది. కమెడియన్ సమయ్ రైనా సైతం "కిల్డ్ ఇట్" అంటూ అలియాను మెచ్చుకున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఇదంతా ముందే ప్లాన్ చేసిన స్క్రిప్ట్ అని కామెంట్లు పెడుతున్నారు.
అసలు ఈ డైలాగ్ వెనుక ఉన్న కథ ఏంటి?
{{/usCountry}}ఈ మూమెంట్కు సంబంధించిన వీడియోను సదరు యూనివర్సిటీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 'ఇండియాస్ గాట్ లేటెంట్' అధికారిక ఖాతా దీనిపై స్పందిస్తూ "టూ గుడ్" అని కామెంట్ చేసింది. కమెడియన్ సమయ్ రైనా సైతం "కిల్డ్ ఇట్" అంటూ అలియాను మెచ్చుకున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఇదంతా ముందే ప్లాన్ చేసిన స్క్రిప్ట్ అని కామెంట్లు పెడుతున్నారు.
అసలు ఈ డైలాగ్ వెనుక ఉన్న కథ ఏంటి?
{{/usCountry}}ఈ డైలాగ్ వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 'ఇండియాస్ గాట్ లేటెంట్' సీజన్ 2 మొదటి ఎపిసోడ్లో అలియా భట్, ఆమె కో-స్టార్ శార్వరి వాఘ్ ఇద్దరూ గెస్టులుగా హాజరయ్యారు. ఆ షోలో కమెడియన్ సమయ్ రైనా ఒక కంటెస్టెంట్ను ఉద్దేశిస్తూ.. "మగవారిలో అమ్మాయిలకు అన్నింటికంటే ఎక్కువగా నచ్చేది ఏంటి?" అని అడిగారు.
అప్పుడు ఆడియన్స్ నుంచి ఒక వ్యక్తి "పైసా (డబ్బు)!" అని మహిళలను కించపరిచేలా కామెంట్ చేశాడు. ఆ సమయంలో తీవ్ర అసహనానికి గురైన అలియా.. ఆ మాట ఎవరు అన్నారని వెతుకుతుండగా, సమయ్ రైనా అందుకొని.. "కచ్చితంగా ఎవరో ఒక పేదవాడే ఆ మాట అని ఉంటాడు" అంటూ ఆ కామెంట్ను కామెడీగా మార్చేశారు.
మహిళల గురించి తక్కువ చేసి మాట్లాడిన ఆ నెటిజన్కు బుద్ధి చెప్పినందుకు అప్పట్లో సమయ్పై ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు అదే లైన్ను అలియా భట్ రివర్స్లో వాడటం విశేషం. కాగా అలియా భట్ లీడ్ రోల్లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' ఈ శుక్రవారమే (జూలై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
యష్ రాజ్ స్పై యూనివర్స్
శివ్ రావల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శార్వరి వాఘ్, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్లో మెరవనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'స్పై యూనివర్స్' లో భాగమే ఈ సినిమా.
పఠాన్, టైగర్, వార్ సిరీస్ చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్లతో రూపొందించారు. ఈ స్పై యూనివర్స్లో మహిళా ప్రధానంగా వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.