రాజమౌళి తండ్రి కథలో చైల్డ్ ఆర్టిస్ట్- ఇప్పుడు బాలకృష్ణ అఖండ 2తో తెలుగులోకి ఎంట్రీ- ఎవరీ హర్షాలి మల్హోత్రా?
వారణాసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన హర్షాలి మల్హోత్రా వెండితెరపై నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమానే బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2. మరి మున్నిగా ఆకట్టుకున్న హర్షాలి మల్హోత్రా గురించి తెలుసుకుందాం.
చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి హీరోయిన్స్గా ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయమే. అలా ఎంతోమంది ముద్దుగుమ్మలు వివిధ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అలానే తాజాగా మరొక చైల్డ్ ఆర్టిస్ట్ నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే, బాలీవుడ్లో మున్నిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బాల నటి నేరుగా టాలీవుడ్లో తెరంగేట్రం చేయడం విశేషంగా మారింది.

మున్నీగానే ఎక్కువ
ఆ చిన్నదే హర్షాలి మల్హోత్రా. హర్షాలి అంటే పెద్దగా ఎవరు గుర్తు పట్టరు. కానీ, మున్ని అంటే బాలీవుడ్ ఆడియెన్స్ ఎక్కువగా గుర్తు పడతారు. మున్నీగా హర్షాలి ఆకట్టుకున్న సినిమానే భజరంగీ భాయిజాన్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, బెబో కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా హిందీ చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్.
హృదయాలను కొల్లగొట్టిన మూవీ
బాక్సాఫీస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టడమే కాకుండా ఎంతోమంది ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈ సినిమా. హృద్యమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా ఈ సినిమాలోని పాత్రలు ఆకట్టుకుంటాయి. అందులో ముఖ్యంగా మున్ని పాత్ర.
రాజమౌళి తండ్రి కథ
2015లో సూపర్ హిట్ అయిన ఈ భజరంగీ భాయిజాన్ సినిమాకు వారణాసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. అయితే, ఇప్పుడు పదేళ్లకు నేరుగా తెలుగులో హర్షాలి మల్రోత్రా అరంగేట్రం చేస్తుంది. అది కూడా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మూవీతో.
అఖండ 2లో
ఆ సినిమానే అఖండ 2 తాండవం. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాలుగోసారి తెరకెక్కుతున్న అఖండ 2లో హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్ర గురించి ఇటీవల విడుదలైన ది తాండవం సాంగ్ లాంచ్ ఈవెంట్లో బాలకృష్ణ గొప్పగా చెప్పారు.
బాలకృష్ణతో ఫొటోలు
అలాగే, ఈ ఈవెంట్లో బాలకృష్ణ-హర్షాలి మల్హోత్రా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం హర్షాలికి 17 ఏళ్లు. 2008 జూన్ 3న ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. హర్షాలి కుటుంబం ఒక ఖత్రి తెగకు చెందింది.
హర్షాలి మల్హోత్రా సీరియల్స్
2012 నుంచి హిందీ బుల్లితెర సీరియల్స్లో హర్షాలి మల్హోత్రా నటిస్తోంది. కాబుల్ హై, లావుట్ ఆవో త్రిష, సావధాన్ ఇండియా వంటి సీరియల్స్తో ఆకట్టుకుంది హర్షాలి. అనంతరం 2017లో సబ్సే బడా కళాకార్ షోలో పాల్గొంది. 2015లో భజరంగీ భాయిజాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది హర్షాలి.
హర్షాలి మల్హోత్రా అవార్డ్స్
ఇక హర్షాలి తన నటనకు గానూ బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్, స్టార్ గైడ్, స్టార్డస్ట్, స్క్రీన్, జీ సినీ అవార్డ్స్ను గెలుచుకుంది. ఇవే కాకుండా పలు ఇన్స్టాగ్రామ్ రీల్స్, డ్యాన్స్ వీడియోలతో అలరించింది. ఇప్పుడు పదేళ్లకు బాలకృష్ణ అఖండ 2 మూవీతో తెలుగులో తానేంటో నిరూపించుకోనుంది హర్షాలి మల్హోత్రా.













