బాలీవుడ్లో 'దమ్ లగా కే హైషా', 'సాండ్ కీ ఆంఖ్', 'బధాయ్ దో' వంటి చిత్రాలతో పవర్ఫుల్ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్. సాధారణంగా సెలబ్రిటీలు తమ కెరీర్లో చేసిన తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడరు.
పొరపాట్లు జరిగాయని

కానీ, భూమి పెడ్నేకర్ మాత్రం అందుకు భిన్నంగా, తాను చేసిన కొన్ని సినిమాల ఎంపిక విషయంలో పొరపాట్లు జరిగాయని నిజాయితీగా అంగీకరించారు. ఇటీవల జరిగిన ‘వి ది ఉమెన్’ (We the Women) కార్యక్రమంలో పాల్గొన్న భూమి పెడ్నేకర్ తన సినీ ప్రయాణంలోని ఎత్తుపల్లాలను పంచుకున్నారు.
రూ. 200 కోట్ల హిట్ కోసం ఆశపడి
కెరీర్లో మీరు చేసిన ఎంపికల్లో తప్పుగా అనిపించినవి ఏవైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు భూమి పెడ్నేకర్ చాలా సూటిగా సమాధానమిచ్చారు.
"అవును, నేను కొన్ని తప్పులు చేశాను. నా కెరీర్ ఆరంభం నుంచి మహిళా సాధికారత ఉన్న, బలమైన పాత్రలనే ఎంచుకుంటూ వచ్చాను. కానీ, మధ్యలో కొన్నిసార్లు పక్కదారి పట్టాను. ఏదో ఒక సినిమాతో రూ. 200 కోట్ల క్లబ్లో చేరాలనే టెంప్టేషన్ (ఆశ) కలగడమే దానికి కారణం. ఆ క్రమంలో నా పాత్రకున్న ప్రాధాన్యతను తగ్గించుకున్నాను. అది నేను చేసిన అతిపెద్ద పొరపాటు" అని భూమి పెడ్నేకర్ వివరించారు.
ఆ విషయంలో అస్సలు రాజీ పడను!
కమర్షియల్ విజయాల కోసం ఆశపడినా, కొన్ని విషయాల్లో మాత్రం తాను ఎప్పుడూ రాజీ పడనని భూమి స్పష్టం చేశారు. "నా జెండర్ను (స్త్రీత్వాన్ని) కించపరిచేలా లేదా గౌరవం లేని పాత్రలను నేను ఎప్పటికీ చేయను" అని భూమి పెడ్నేకర్ తెలిపారు.
ఆ నమ్మకాన్ని కష్టపడి నిలబెట్టుకున్నా
"నా నుంచి ప్రేక్షకులు కేవలం నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఆశిస్తారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి నేను ఎంతో కష్టపడ్డాను. మధ్యలో ఆ స్థానాన్ని కొంత పలచన చేశాను (Diluted), కానీ అలాంటి తప్పును మళ్లీ ఎప్పటికీ చేయను" అని భూమి పెడ్నేకర్ గట్టిగా చెప్పారు.
గోప్యంగా సినిమా పేరు
{{/usCountry}}"నా నుంచి ప్రేక్షకులు కేవలం నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఆశిస్తారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి నేను ఎంతో కష్టపడ్డాను. మధ్యలో ఆ స్థానాన్ని కొంత పలచన చేశాను (Diluted), కానీ అలాంటి తప్పును మళ్లీ ఎప్పటికీ చేయను" అని భూమి పెడ్నేకర్ గట్టిగా చెప్పారు.
గోప్యంగా సినిమా పేరు
{{/usCountry}}అయితే, తాను ఏ సినిమాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది మాత్రం భూమి పెడ్నేకర్ వెల్లడించలేదు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో సినిమా పేరును గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది.
ఓటీటీ సిరీస్ దల్దల్
ఆయుష్మాన్ ఖురానా సరసన నటించిన 'దమ్ లగా కే హైషా'తో బాలీవుడ్ వెండితెరకు పరిచయమైన భూమి పెడ్నేకర్ ఇటీవల ఓటీటీ సిరీస్ 'దల్దల్' (Daldal) తో డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా తన ముద్ర వేశారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
విష్ ధమీజా రాసిన 'భెండి బజార్' పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ జనవరి 30న అమెజాన్ ప్రైమ్లో దల్దల్ ఓటీటీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ ఓటీటీ సిరీస్లో భూమితో పాటు సమర తిజోరి, ఆదిత్య రావల్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.