దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ జేపీ దత్తా క్లాసిక్ ‘బోర్డర్’ మూవీకి సీక్వెల్గా ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘బోర్డర్ 2’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసేందుకు ఓటీటీ రిలీజ్ అవుతోంది.
బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్

ఈ యుద్ధ వీరుల గాథను థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారి కోసం మరికొన్ని గంటల్లో బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన బోర్డర్ 2 మూవీ వార్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కింది.
బోర్డర్ 2 మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితోపాటు సోమన్ బజ్వా, మేధా రాణా, మోనా సింగ్, ఆన్యా సింగ్, పరమ్వీర్ చీమ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
అత్యధిక వసూళ్లు సాధించిన యుద్ధ చిత్రం
2026 జనవరి 23న థియేటరల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 464.5 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హృతిక్ రోషన్ ‘ఫైటర్’, విక్కీ కౌశల్ ‘ఉరి’, అక్షయ్ కుమార్ ‘కేసరి’ వంటి చిత్రాలను అధిగమించి భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన వార్ ఫిల్మ్గా నిలిచింది.
1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ కథలో.. ఆర్మీ మేజర్ హోషియార్ సింగ్ దహియాగా వరుణ్ ధావన్, నేవీ లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్గా అహాన్ శెట్టి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్గా దిల్జీత్ దోసాంజ్ నటించారు. వారికి సీనియర్గా లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కాలేర్ పాత్రలో సన్నీ డియోల్ మరోసారి తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు.
ఐఎమ్డీబీ రేటింగ్
{{/usCountry}}1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ కథలో.. ఆర్మీ మేజర్ హోషియార్ సింగ్ దహియాగా వరుణ్ ధావన్, నేవీ లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్గా అహాన్ శెట్టి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్గా దిల్జీత్ దోసాంజ్ నటించారు. వారికి సీనియర్గా లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కాలేర్ పాత్రలో సన్నీ డియోల్ మరోసారి తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు.
ఐఎమ్డీబీ రేటింగ్
{{/usCountry}}రూ. 275 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన బోర్డర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాకుండా ఐఎమ్డీబీలో పదికి 7.1 రేటింగ్ సైతం సాధించింది. ఇంత హిట్ అయిన బోర్డర్ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. మార్చి 20 నుంచి బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
మార్చి 20 అర్థరాత్తి 12 గంటల నుంచే బోర్డర్ 2 ఓటీటీ ప్రీమియర్ అవనుంది. అంటే, దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో బోర్డర్ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (మార్చి 19) నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించేసింది.
నెట్ఫ్లిక్స్ ఓటీటీలో
దాంతోపాటు ఆసక్తికరమైన వీడియోను సైతం పంచుకుంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ. పాత ‘బోర్డర్’ మూవీలోని క్లాసిక్ సాంగ్ ‘ఘర్ కబ్ ఆవోగే’ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుండగా.. నెట్ఫ్లిక్స్ అని రాసి ఉన్న ఒక కవరు (Envelope) కనిపిస్తున్న వీడియోను షేర్ చేశారు.
నెట్ఫ్లిక్స్కు వచ్చేసింది
"చిల్టీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్కు వచ్చేసింది.. మార్చి 20 నుంచి ‘బోర్డర్ 2’ను వీక్షించండి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్పై అభిమానులు క్రేజీగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా దిల్జీత్ దోసాంజ్ నటనను మళ్లీ లూప్లో చూస్తామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వార్ డ్రామాలు ఇష్టపడేవారు నెట్ఫ్లిక్స్ ఓటీటీ మూవీ బోర్డర్ 2పై లుక్కేయవచ్చు.