పెళ్లి చేసుకోబోతున్న దీపికా పదుకొణె చెల్లెలు అనీషా పదుకొణె.. అతనెవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సోదరి అనీషా పదుకొణె త్వరలో పెళ్లి చేసుకోనుందని డెక్కన్ క్రానికల్ మీడియా తెలిపింది. అయితే, అనీషా పెళ్లిపై దీపికా కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని సమాచారం. కాకపోతే అనీషా పెళ్లి చేసుకునే రోహన్ ఆచార్య ఎవరు అనే అంశం ఆసక్తిగా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కల్కి 2898 ఏడీ బ్యూటీ దీపికా పదుకొణె ఇంట్లో పెళ్లి సందడి మొదలు కానుంది. దీపికా పదుకొణె చెల్లెలు అనీషా పదుకొణె త్వరలో పెళ్లి చేసుకోనుందని డెక్కన్ క్రానికల్ మీడియా తెలిపింది. అయితే, అనీషా వివాహ విషయంపై దీపికా కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అనీషాకు కాబోయే భర్త
కానీ, బాలీవుడ్ మీడియాలో అనీషా పదుకొణె పెళ్లి టాపిక్ జోరుగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అనీషా పదుకొణె పెళ్లి చేసుకునేది ఎవరిని, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటీ అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
అనీషా పదుకొణె వ్యాపారవేత్త రోహన్ ఆచార్యను పెళ్లి చేసుకోనుందని హిందీ మీడియా పేర్కొంది. హిందీ దిగ్గజ నిర్మాత బిమల్ రాయ్ మని మనవడు ఈ రోహన్ ఆచార్య. అలాగే, రోహన్ ఆచార్య బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ను వివాహం చేసుకున్న దిశా ఆచార్య సోదరుడు.
పేరుకే బిజినెస్మ్యాన్
అంటే సన్నీ డియోల్కు రోహన్ ఆచార్య కోడలు దిశా తరఫు నుంచి అల్లుడు వరస అవుతాడు. పేరుకు బిజినెస్ మ్యాన్ అయిన రోహన్ ఆచార్యకు సినీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనీషా పదుకొణె, రోహన్ ఆచార్య పెళ్లి గురించి వారి కుటుంబం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
కాగా అనీషా, రోహన్ తమ లవ్ రిలేషన్ను చాలా సీక్రెట్గా ఉంచారు. రోహన్ ఆచార్య కుటుంబానికి దీపికా భర్త రణ్వీర్ సింగ్ చాలా క్లోజ్గా ఉండేవాడు. రోహన్ ఫ్యామిలీతో రణ్వీర్ సింగ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి. అప్పుడు అనీ, రోహన్పై లవ్ ట్రాక్ రూమర్స్ వచ్చేవి. కానీ, వాటికి ఇద్దరూ రియాక్ట్ అయ్యేవారు కాదు.
ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ డైరెక్టర్
ఇకపోతే పాపులర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె- ఉజ్జల పదుకొణె దంపతుల చిన్న కుమార్తె అనీషా. దీపికా పదుకొణె ప్రారంభించిన ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్కు అనీషా డైరెక్టర్గా ఉంది. మెంటల్ హెల్త్, ఒత్తిడిని అధిగమించడంపై అవగాహన కల్పిస్తుంటుంది అనీషా పదుకొణె.
కాగా, గతంలో హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో చెల్లి గురించి దీపికా మాట్లాడుతూ.. "అనీషా తెగ మాటకారి. మాట్లాడుతూనే ఉంటుంది. కానీ, తాను చెప్పాలనుకుంది చాలా చాలా స్పష్టంగా, అతి సున్నితంగా చెబుతుంది. అవతలి వ్యక్తిని బాధించకుండా తన అభిప్రాయాలను ఎలా చెప్పాలో ఆమెకు తెలుసు" అని తెలిపింది.
నా గురించి ఏం చెప్పదు
"నా గురించి నాకు మంచి అనుభూతి కలిగించడానికి మాత్రం అనీషా ఏమీ చెప్పదు. అనీషాకు నేను నటించిన రామ్-లీలా (గోలియోన్ కి రాస్లీలా) సినిమా అంటే చాలా ఇష్టం" అని దీపికా పదుకొణె పేర్కొంది.
ఇదిలా ఉంటే, యాక్షన్ కామెడీ చిత్రాల డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'సింఘం ఎగైన్' మూవీలో దీపికా పదుకొణె చివరి సారిగా కనిపించింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు నటించారు. ఇది గత ఏడాది థియేటర్లలో విడుదలై ఆకట్టుకోలేదు.
షారుక్-అల్లు అర్జున్ సినిమాల్లో
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న కింగ్ మూవీలో దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


