Dhurandhar Part 1 Raw And Undekha OTT Release Telugu: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ , ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్' సరికొత్త రికార్డులతో వార్తల్లో నిలిచింది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లపై కూడా దుమ్మురేపుతోంది.
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్

తాజాగా నెట్ఫ్లిక్స్ ప్రకటించిన ఒక అప్డేట్ అటు అభిమానుల్లో జోష్ నింపుతూనే, ఇటు తీవ్ర గందరగోళానికి దారితీసింది. అయితే, ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ను జియో హాట్స్టార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ధురంధర్ 2 అన్కట్ వెర్షన్ ఓవర్సీస్లో నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ఇండియన్ ఆడియెన్స్కు సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా ధురంధర్ పార్ట్ 1 అన్కట్ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ను నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. అంటే, 'ధురంధర్' మొదటి భాగానికి సంబంధించి థియేటర్లలో విడుదల కాని కొన్ని కీలకమైన సీన్లను ఈ వెర్షన్తో స్ట్రీమింగ్ చేయనున్నారు.
రా అండ్ అన్దేఖా టైటిల్తో
'రా అండ్ అన్దేఖా' (Raw & Undekha) అనే టైటిల్తో ధురంధర్ ఫస్ట్ పార్ట్ ఎక్స్టెండెడ్ వెర్షన్ను మే 22 అంటే రేపటి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ అన్కట్ వెర్షన్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
"ఆంధీ ఆ రహీ హై.. ఔర్ ఇస్ బార్, ఎక్స్ట్రా ఘాతక్," అంటూ నెట్ఫ్లిక్స్ ఓటీటీ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థియేటర్లలో కట్ చేసిన సీన్లు, సెన్సార్ కాకుండా ఉండే కొన్ని పవర్ఫుల్ డైలాగులు ఈ వెర్షన్లో చూడవచ్చని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఓటీటీ వేదికల మధ్య గందరగోళం
{{/usCountry}}"ఆంధీ ఆ రహీ హై.. ఔర్ ఇస్ బార్, ఎక్స్ట్రా ఘాతక్," అంటూ నెట్ఫ్లిక్స్ ఓటీటీ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థియేటర్లలో కట్ చేసిన సీన్లు, సెన్సార్ కాకుండా ఉండే కొన్ని పవర్ఫుల్ డైలాగులు ఈ వెర్షన్లో చూడవచ్చని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఓటీటీ వేదికల మధ్య గందరగోళం
{{/usCountry}}ఈ క్రేజీ అప్డేట్ పక్కన పెడితే, సగటు ఓటీటీ ప్రేక్షకుడికి మాత్రం ఒక పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. దానికి కారణం ఈ సినిమా ఓటీటీ రైట్స్ పంపిణీనే. 'ధురంధర్ 2' (ధురంధర్: ది రివెంజ్) చిత్రం అంతర్జాతీయంగా మే 14న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కానీ, భారతీయ ప్రేక్షకుల కోసం ఈ రెండో భాగం జూన్ 4న జియో హాట్స్టార్ (JioHotstar) వేదికగా ప్రసారం కానుంది.
ఒకే సినిమాకు సంబంధించిన రెండు భాగాలు వేర్వేరు ప్లాట్ఫామ్స్లో, వేర్వేరు తేదీల్లో వస్తుండటంతో ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. "మొదటి భాగం రా వెర్షన్ను ఇప్పుడెందుకు ఇస్తున్నారు, ముందే ఇవ్వొచ్చు కదా?" అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే "హాట్స్టార్ పరిస్థితి ఘోరంగా తయారైంది" అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం
'ఉరి' సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ ధురంధర్ ఫ్రాంచైజీని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. 2025 డిసెంబర్ 5న విడుదలైన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1307 కోట్ల వసూళ్లు సాధించింది.
ఇక ఈ ఏడాది మార్చి 19న విడుదలైన సీక్వెల్ 'ధురంధర్ 2' ఆ రికార్డులను తిరగరాస్తూ రూ. 1790 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. రణ్వీర్ సింగ్తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
అసలు కథేంటంటే?
ఈ సినిమా కథాంశం ఒక హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్తాన్లోని ల్యారీ ప్రాంతంలో ఉన్న ఒక ఉగ్రవాద నెట్వర్క్ను అంతం చేయడానికి భారత ఏజెంట్ జస్కీరాత్ సింగ్ రంగీ (అలియాస్ హంజా అలీ మజారీ) రంగంలోకి దిగుతాడు. అక్కడ బలూచ్ గ్యాంగ్లోకి చొరబడి, స్థానిక రాజకీయ నాయకుడి కుమార్తెను వివాహం చేసుకుని ఆ సమాజంలో కలిసిపోతాడు. ఆ తర్వాత అతను ఆ ఉగ్రవాద ముఠాను ఎలా మట్టుబెట్టాడనేదే ప్రధాన ఇతివృత్తం.