...
...
Next Story

Imtiaz Ali Daughter: అగ్ర దర్శకుడి కూతురు మతాంతర ప్రేమ, నిశ్చితార్థం.. ఇంతియాజ్ అలీ రియాక్షన్ ఏంటంటే?

Imtiaz Ali On Daughter Ida Ali Engagement: ప్రముఖ బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ ఇంట్లో పెళ్లి గంటలు మోగనున్నాయి. ఆయన కుమార్తె ఇదా అలీ తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ క్రిష్ అగర్వాల్‌తో నార్వేలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయంపై ఇంతియాజ్ అలీ తాజాగా స్పందించారు.

Published on: Jul 13, 2026, 22:35:04 IST
Advertisement

Imtiaz Ali On Daughter Ida Ali Engagement: 'జబ్ వి మెట్', 'లవ్ ఆజ్ కల్', 'రాక్‌స్టార్' వంటి రొమాంటిక్ క్లాసిక్ చిత్రాలతో బాలీవుడ్‌లో సరికొత్త ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ. ఆయన సినిమాల్లోని లవ్ సీన్స్ ఎంత అందంగా ఉంటాయో, ఇప్పుడు ఆయన నిజ జీవితంలోనూ అలాంటి ఒక అద్భుతమైన ప్రేమకథ శుభం కార్డు వైపు అడుగులు వేస్తోంది.

నార్వే లోయల్లో ఫిల్మీ ప్రపోజల్

అగ్ర దర్శకుడి కూతురు మతాంతర ప్రేమ, నిశ్చితార్థం.. ఇంతియాజ్ అలీ రియాక్షన్ ఏంటంటే?
అగ్ర దర్శకుడి కూతురు మతాంతర ప్రేమ, నిశ్చితార్థం.. ఇంతియాజ్ అలీ రియాక్షన్ ఏంటంటే?

ఇంతియాజ్ అలీ కుమార్తె, యంగ్ ఫిల్మ్ మేకర్ ఇదా అలీ (25) తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ క్రిష్ అగర్వాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. జూలై 1వ తేదీన నార్వేలోని అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య క్రిష్ అగర్వాల్.. ఇదా అలీకి ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు. మోకాళ్లపై కూర్చుని ఉంగరాన్ని చూపిస్తూ క్రిష్ ప్రపోజ్ చేసిన విధానం పక్కా ఇంతియాజ్ అలీ సినిమా సీన్‌ను తలపించింది.

ఈ డ్రీమ్ ప్రపోజల్‌కు ఇదా అలీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా ఆదివారం (జూలై 12) నాడు ఇదా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వేడుకకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

మామగారి పర్మిషన్ తోనే..

నేటి తరం ప్రేమకథ అయినప్పటికీ, క్రిష్ అగర్వాల్ పాతకాలపు పద్ధతులను, సంప్రదాయాలను గౌరవించారు. ఇదాకు ప్రపోజ్ చేయడానికి ముందే ఆయన కాబోయే మామగారు ఇంతియాజ్ అలీని కలిసి మాట్లాడారు.

"ఇది నాకు అత్యంత సంతోషకరమైన సమయం. ఇదాకు ప్రపోజ్ చేయడానికి ముందే క్రిష్ నాతో మాట్లాడి నా ఆశీస్సులు తీసుకున్నాడు" అని ఇంతియాజ్ అలీ తన ఆనందాన్ని పంచుకున్నారు. కూతురి జీవితంలో వచ్చిన ఈ మైలురాయిని చూసి ఆయన ఎంతో మురిసిపోతున్నారు.

కాబోయే అల్లుడు క్రిష్ ఎవరు?

నిశ్చితార్థం ముగియడంతో బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడే పెళ్లి గురించిన చర్చలు మొదలయ్యాయి. అయితే, ఇంతియాజ్ అలీ మాత్రం పెళ్లి విషయంలో ఎలాంటి తొందరపడటం లేదు. "నేను వాళ్ల విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోదల్చుకోలేదు. ప్రస్తుతానికి ఈ మధుర క్షణాలను వాళ్లను ఎంజాయ్ చేయనివ్వండి" అని ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు.

తండ్రి మాటలకు తగ్గట్టే ఇదా అలీ కూడా స్పందిస్తూ.. "ప్రస్తుతానికి పెళ్లి ప్లాన్స్ ఏమీ లేవు. మా నాన్నగారు చెప్పినట్లు ఈ మధురమైన క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం" అని స్పష్టం చేశారు.

బాలీవుడ్ ప్రముఖుల శుభాకాంక్షలు

ఈ క్రేజీ కపుల్‌కు బాలీవుడ్ ప్రముఖులు అయిన శార్వరి వాఘ్, ఖుషి కపూర్, ఓరి, అలియా కశ్యప్, వేదాంగ్ రైనాతోపాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe